రూపాయి విలువ అడ్డం పెట్టుకుని మోస పూరితంగా పెట్రోల్ రేట్లు పెంచిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్ ధరలను లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే తగ్గిపోయినందున కంపెనీలు దిగుమతులకు ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదనీ దానివలన నష్టాలు పెరిగాయనీ కారణం చూపి ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచింది. కాని వాస్తవానికి రూపాయి విలువ తగ్గుదల తాత్కాలిక పరిణామమేననీ కొద్దిరోజుల్లోనే రుపాయి పూర్వ విలువను పొందుతుందనీ ప్రభుత్వ అధికారులే నాలుగురోజుల క్రితం ప్రకటిన సంగతి గమనిస్తే, ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అబద్ధాలు…