టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

నోట్ల రద్దు: రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్లు నష్టం!

‘పాత నోట్ల రద్దు – కొత్త నోట్లు ఆలస్యం’ వ్యవహారంలో రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నదని రాష్ట్రానికి చెందిన పరిశ్రమల సంఘం ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ రాజస్ధాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Forti) పేర్కొన్నది. రెండు నెలల్లో (నవంబర్, డిసెంబర్) ఈ నష్టం జరుగుతుందని ఫోర్టీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ చెప్పారని ద ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. కరెన్సీ సంక్షోభం ప్రతి ఒక్క రంగంలోని పరిశ్రమలనూ దెబ్బ తీసిందని ఫోర్టీ తెలిపింది.…

Mr మోడీ, 2014 ఎన్నికల లెక్కలు ఎందుకు చూపరు? -ధాకరే

నరేంద్ర మోడిని పొగడ్తలతో ముంచెత్తే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధిపతి రాజ్ ధాకరే ఈ రోజు తీవ్ర విమర్శలతో ఆయనపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల లెక్కలు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కు సమర్పించలేని సంగతిని గుర్తు చేశాడు.  బ్లాక్ మనీ లేకుండానే మీరు 2014 ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నించారు. పాత నోట్ల రద్దు చర్య, చెప్పిన ఫలితాన్ని ఇవ్వకపోతే దేశం అరాచకం లోకి జారిపోతుందని అందుకు నరేంద్ర మోడియే బాధ్యత…

కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు

  సాధారణ పాలనా ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు మసాలాలు అద్దడం, అబద్ధాలతో హైప్ సృష్టించడం, దేశానికీ ఎదో ఒరగబెట్టేసినట్లు నానా హంగామా చేయడం, పనిలో పనిగా మోడీ చుట్టూ కృత్రిమ ప్రతిష్టను నిర్మించడం, అవేవి వీలు కాకపొతే బాధితుడి పాత్రలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి సానుభూతి కోసం ప్రయత్నించడం..!  రు 500 , రు 1000 నోట్లు రద్దు చేయటం వెనుక లక్ష్యం నల్ల డబ్బుని వెలికి తీయడం అని కదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన…

అంబానీ, ఆదానీలకు ముందే తెలుసు -బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ

నిజాలు ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తున్నాయి. బి‌జే‌పి ప్రభుత్వం తమకు కావలసిన వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీలు కట్టగట్టుకుని చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు ఖండించే పనిలో ఉండగానే రాజస్ధాన్ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ అవే ఆరోపణలు చేయడం విశేషం. రాజస్ధాన్ లో కోట జిల్లాలోని లడ్ పురా నియోజకవర్గ ఎం‌ఎల్‌ఏ భవాని సింగ్ రజావత్ తనకు తెలిసిన నిజాన్ని వెళ్ళగక్కాడు. రు 500/-, రు 1000/- ల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతున్న…

కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు

  RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది.  బ్యాంకుల వద్ద…

ఎఫ్‌బి‌ఐ వల్లే ఓడిపోయా -హిల్లరీ క్లింటన్

డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయి విచారంలో ఉన్న హిల్లరీ క్లింటన్ తన ఓటమికి మరో చోట కారణాలు వెతుకుతోంది. తన తప్పుల్ని పక్కన బెట్టి ఆ తప్పుల్ని బైటపెట్టిన వారిని నిందిస్తోంది. ఒబామా మొదటి అధ్యక్ష పదవి కాలంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశీ మంత్రి) గా పని చేసినప్పుడు ఈ మెయిల్ సేవల కోసం అధికారిక భద్రతలతో కూడిన సర్వర్లకు బదులుగా ప్రైవేటు సర్వర్లను వినియోగించి ప్రభుత్వ రహస్యాలను వాల్ స్ట్రీట్ కంపెనీలకు అప్పజెప్పడంపై ఎఫ్‌బి‌ఐ…

కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!

  పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక…

నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ

  పెద్ద నోట్ల రద్దు వెనుక బీజేపీ లక్ష్యాలు తెర వెనుక నుండి మెల్లగా బైటికి వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నల్ల ధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు, మున్నగు జబ్బుల్ని నయం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని మోడీ చెబుతుండగా ‘నోట్ల రద్దు’ వల్ల వచ్చే ప్రతిష్టను ఓట్ల కోసం వినియోగించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.  “మేము రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. భజన బృందం నడపడం లేదు. భజన పాటలు…

ట్రంపోకలిప్స్ పై అవగాహన -ద హిందూ…

  డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ కు 45వ అధ్యక్షులు కానున్నారు. ఈ మాటలు నేడు 324 మంది అమెరికన్ల హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది, కొందరు దిగ్భ్రాంతికి లోనై నిరుత్సాహానికి గురి కాగా ఇతరులు సంతోషంలో మైరిచిపోయారు. ఆశ్చర్యకరమైన ఫలితాల పట్ల వ్యక్తం అవుతున్న భావోద్వేగాల లోని ఈ శుద్ధ భిన్నత్వమే దేశం, రెండు సంవత్సరాల పాటు భిన్న ధ్రువాల వైపుగా సాగిన ఎన్నికల ప్రచారం అనంతరం, ఎంత లోతుగా విభజనకు గురై ఉన్నదో తెలియజేసేందుకు చురుకైన సంకేతం.…

అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక ఆరోపణలు ఆయనపైన గుప్పించారు. పాత చరిత్రలు తవ్వి తీశారు. ఎక్కడా లేని బురదా తెచ్చి జల్లారు. ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పించారు. అయినా ట్రంప్ గెలుపు ఆగలేదు. మొత్తం వాల్ స్ట్రీట్ అంతా కట్టగట్టుకుని హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డా ఆమెను గెలిపించలేకపోయింది. ఆమె వాల్ స్ట్రీట్ మనిషి అన్న నిజమే అమెరికా శ్రామిక ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టింది.…

నానో ఛిప్? సారీ! -ఆర్‌బి‌ఐ

అదిగో పులి అనే వాడు ఒక్కడుంటే, ఇదిగో తోక అని వేల మంది కేకలు వేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ యుగంలో ఇది వేలం వెర్రి అయిపోయింది. ఎవరో ఏదో గొప్ప పని చేసేశారనీ, అదేదో అద్భుతం జరిగిపోతోందనీ, ఇంకేదో జరగరాని ఘొరం జరిగిపోయిందని ఒక బొమ్మ, ఒక చాత్రం (పిట్ట కధ)… ఎవరు పోస్ట్ చేసినా సరే, వెనకా ముందూ చూడకుండా షేర్ చేసెయ్యడం, బైట నలుగురికీ చెప్పి అబ్బురపరిచి తానూ అబ్బురపడిపోవడం…! పొద్దుట్నుంచి ఒకటే…

గెలుపు బాటలో ట్రంప్, మార్కెట్లలో రక్తపాతం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డోనాల్డ్ అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపు బాటలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలు అన్నింటిలో హిల్లరీ క్లింటన్ పై చేయి సాధిస్తే అసలు ఫలితాల్లో మాత్రం హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ ఫలితాలతో ఆసియా షేర్ మార్కెట్లలో ఊచకోత మొదలయింది. రక్తపాతం జరుగుతోంది. (షేర్ మార్కెట్లు భారీగా కూలిపోతే దాన్ని బ్లడ్ బాత్ గా పశ్చిమ పత్రికలు చెబుతాయి.) కడపటి…

కొత్త రు 500, రు 2000 నోట్లు?

SO, IT IS NOT SO GOOD NEWS! అవినీతి నిర్మూలన కోసం అంటూ మోడి ప్రకటించిన నోట్ల రద్దు చర్య అసలు స్వరూపం ఏమిటో అర్ధం అవుతున్నది. పత్రికలు పెద్దగా చెప్పని విషయం ఏమిటంటే త్వరలో కొత్తగా రు 500 నోటు, రు 2000 నోటు ఆర్‌బి‌ఐ ముద్రించబోతున్నదట. ఆ సంగతి కూడా ప్రధాన మంత్రి గారే చెప్పారా లేక ఎవరు చెప్పారన్నది తెలియడం లేదు. ఇండియా టుడే ఇంటర్నెట్ వర్షన్ అది కూడా మోడియే…

రు 500, రు 1000 నోట్లు రద్దు -ప్రధాని మోడి

ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది.…