నోట్ల రద్దు: టాటా, బిర్లాలకు $9 బిలియన్ల క్షవరం!
నోట్ల రద్దు వల్ల టాటా, బిర్లా, మహేంద్ర.. ఈ మూడు బడా పారిశ్రామిక గ్రూపులకు 9 బిలియన్ డాలర్లు క్షవరం అయిపొయింది. ఈ క్షవరం నల్ల ధనం రద్దు కావడం వల్ల జరిగిన నష్టం కాదు. నోట్ల రద్దు దరిమిలా జీడీపీ పడిపోతుందనీ, అమ్మకాలు తగ్గిపోతాయనీ… ఇత్యాది భయాలతో షేర్ హోల్డర్లు ఆ కంపెనీల లోని షేర్లను అమ్మేయటం వలన సంభవించిన నష్టం. ప్రధాన మంత్రి మోడీ డీమానిటైజేషన్ ప్రకటించిన దగ్గరినుండి షేర్ల సూచి సెన్సెక్స్…