ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఫ్రాన్సు సైనికుల ఉపసంహరణ

ఫ్రాన్సు సైనికులలో మొదటి బ్యాచ్ ఆఫ్ఘనిస్ధాన్ నుండి స్వదేశం చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ సైనికుల విరమణ జరుగుతుంది. మొదటి విడతగా 200 మంది సైనికుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ఫ్రాన్సు ప్రకటించింది. గత జులైలో ఆఫ్గనిస్ధాన్ సందర్శించిన సందర్భంగా తమ సైనికులను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి ప్రకటించాడు. అది ఇప్పుడు ప్రారంభమయ్యింది. రెండవ విడతలో మరో 200 మంది సైనికులను విరమిస్తామని ఫ్రాన్సు తెలిపింది. రాబోయే క్రిస్టమస్ పండగలోపు రెండవ విడత సైనికులు ఫ్రాన్సు…

చెప్పు విసిరింది కేజ్రీవాల్ పైన కాదు, వందిమాగధుల అత్యుత్సాహంపైనే

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్ల ఛాంబర్ లోకి జొరబడి ప్రఖ్యాత లాయర్ ‘ప్రశాంత్ భూషణ్’ పైన దాడి చేసి కొట్టిన కొద్ది రోజుల్లోనే మరో అన్నా టీం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా దాడి జరిగిందని పత్రికలు వార్తను ప్రచురించాయి. సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగి పోతున్నాయని అసహనం వ్యక్తం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక దుండగుడు చెప్పు విసిరాడనీ, అతనిని అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారులు అక్కడే పట్టుకుని చావబాదారనీ తెలిపాయి. అయితే,…

‘సౌదీ’ దరిద్రంపై వీడియో తీసినందుకు అరెస్టు -కార్టూన్

సౌదీ అరేబియాకు చెందిన ‘ఫెరాస్ బగ్నా’ దేశ పౌరుడుగా ఓ చిన్న ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియో ద్వారా చూపించి తద్వారా ధనవంతులనుండి విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వాలనుకున్నాడు. అనుకన్నదే తడవుగా ఫెరాస్ సౌదీ రాజధాని రియాధ్ లో పేద ప్రాంతాలకు వెళ్ళి వారి ఇళ్ల లోపలి భాగం కూడా చూపించి, వారి ఆర్ధిక పరిస్ధితి గూర్చి వారి చేతనే చెప్పించి ఆ దృశ్యాలతో ఒక వీడియో రూపొందించాడు. తన వంతు బాధ్యతగా తాను…

సౌదీ అరేబియా ‘దరిద్రం’పై వీడియో తీసినందుకు అరెస్టు (+వీడియో)

కొద్ది వారాల క్రితమే మహిళలకు ఓటు హక్కు ఇస్తున్నట్లు ప్రకటించి అరబ్ ఆందోళనలనుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా రాజు తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు. కారు నడిపిన నేరానికి స్త్రీలను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ‘సౌదీ అరేబియా’లో కూడా దరిద్రం తాండవిస్తున్నదనీ, అది కూడా రాజధాని నగరంలోనే ఉన్నదని చూపిస్తూ వీడియో తయారు చేసినందుకు ‘ఫెరాస్ బగ్నా’ అనే పౌరుడిని అరెస్టు చేయించాడు. ‘ఫెరాస్ బగ్నా’ తాను తీసిన వీడియో ఇంటర్నెట్…

సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం

అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత…

ఒక ఇజ్రాయెల్ సైనికుడి కోసం 1027 పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక ఖైదీల మార్పిడి ఒప్పందం మంగళవారం అమలవుతోంది. పాలస్తీనీయులు పట్టుకున్న ఒకే ఒక్క ఇజ్రయెల్ సైనికుడుని విడుదుల చేస్తున్నందుకుగానూ ఇజ్రాయెల్ అనేక సంవత్సరాల తరబడి తమ జైళ్లలో ఉంటున్న పాలస్తీనా జాతీయులను విడుదల చేయడానికి సిద్దపడింది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు చివరికి ఫలవంతం అయ్యాయి. మంగళవారం 477 మంది, మరో రెండు నెలల్లో మరో 550 మంది పాలస్తీనా ఖైదీలు…

తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం, ఇక కాంగ్రెసే టార్గెట్

తెలంగాణ పొలిటికల్ జె.ఎ.సి సారధ్యసంఘం సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం రాత్రి పది గంటల సమయంలో ముగిసింది. సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ) రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెరాస, న్యూడెమొక్రసీ, ఉద్యోగ జె.ఎ.సి ప్రతినిధులు పత్రికలతో మాట్లాడారు. పొలిటికల్ జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను,…

బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?

బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తెరాస తరపున నిలబడిన సిటింగ్ ఎం.ఎల్.ఎ పోచారం శ్రీనివాసులు దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించినట్లుగా ఫలితం ప్రకటించారు. పోచారం ఎన్నిక అందరూ ఊహించినదే కాగా, శ్రీనివాస్ గౌడ్ కు వచ్చిన ఓట్ల సంఖ్య మాత్రం ఎవరూ ఊహించినవి కావడమే ఇప్పుడు వార్తగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తాము గెలిచిన పది స్ధానాలకు తెలంగాణ ఉద్యమంలో…

ఒబామా దర్శకత్వంలో యాక్షన్ ధ్రిల్లర్: ‘ఇరాన్ కాన్స్పిరసీ’ -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -2

ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1

ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు…

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు

“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి…

బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు

తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన మూడు రోజుల రైల్ రోకో పిలుపు మేరకు మొదటిరోజు శనివారం నాడు రైల్ రోకో విజయవంతంగా జరిగింది. శుక్రవారం రోజే తెలంగాణ జిల్లాలన్నింటా మూడు వందల మంది వరకూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో 2300 వరకూ అరెస్టు చేశామని ఐ.జి.అనూరాధ తెలిపింది. ముందస్తు అరెస్టులు ఇంకా కొనసాగుతాయని తెలిపింది. పట్టాలపై కూర్చున్నవారిపైన రైల్వే యాక్టు కింద అరెస్టు చేసి రిమాండ్…

యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు

శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి. యూరప్ రుణ సంక్షోభం…

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప అరెస్టుకు రంగం సిద్ధం

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక లోకాయుక్త కోర్టు కొట్టివేసింది. దీనితో యెడ్యూరప్ప అరెస్టు ఖాయమయ్యింది. బెంగుళూరులోని లోకాయుక్త ప్రత్యేక కోర్టు శనివారం యెడ్యూరప్ప బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేసింది. దరిమిలా బి.జె.పి కేంద్ర నాయకత్వం సమావేశమై యెడ్యూరప్ప అరెస్టు విషయమై ఏం చేయాలన్నదీ చర్చిస్తున్నట్లుగా వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములను డీ నోటిఫై చెయ్యడంలో యెడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డాడని యెడ్యూరప్ప అభియోగాలు…