‘టచ్ స్క్రీన్’ లేని స్టీవ్ జాబ్స్ ‘ఆటో బయోగ్రఫీ’ -కార్టూన్

స్టీవ్ జాబ్స్ అనగానే యాపిల్ కంపెనీ, ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా టచ్ స్క్రీన్ గుర్తొస్తుంది. వేళ్లతో తాకి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆదేశాలివ్వడం అన్న నూతర ఒరవడికి స్టీవ్ జాబ్స్ శ్రీకారం చుట్టాడు. ఆయన ఆత్మకధను తిరగేయడానికి కూడా టచ్ స్క్రీన్ కోసం చూడడంలో వింతేమీ లేదు కదా. – ఏమిటీ?! టచ్ స్క్రీన్ లేదా!!! —

మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి

మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి…

యూరప్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, ముందుంది మొసళ్ళ పండగ

గురువారం అర్ధరాత్రి దాటాక కూడా జరిగిన తీవ్ర చర్చల అనంతరం యూరోప్ దేశాలు తమ రుణ సంక్షోభం పరిష్కారం దిశలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ప్రస్తుత సంక్షోభం గ్రీసు తన రుణాలు చెల్లించలేకపోవడం చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో గ్రీసు రుణంలో కోతకు అంగీకరించినట్లుగా యూరప్ సమావేశం ప్రకటించింది. బుధవారం నుండి జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం గ్రీసు రుణ సంక్షోభమే ప్రధాన ఎజెండగా జరిగింది. అనేక తర్జన భర్జనలు, చర్చోప చర్చల అనంతరం ఒప్పందం…

భారత్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు, ప్రతీకారమే కారణం

పాకిస్ధాన్ కి చెందిన హ్యాకర్లు భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీలు, విభాగాల వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. భారత హ్యాకర్లు పాకిస్ధాన్ ప్రభుత్వ కంప్యూటర్లను పలుమార్లు హ్యాకింగ్ చేస్తున్నాయనీ, అందుకే తాము భారత ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ చేస్తున్నామని  వారు ప్రకటించారు. దాదాపు ఎనిమిది ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ కి గురయినట్లుగా తెలుస్తోంది. హ్యాకింగ్ చేసిన వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించారని ‘ది హిందూ’ తెలిపింది. పాకిస్ధాన్ హ్యాకర్ తననుతాను ‘khantastic…

ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!

ఇరాక్ లో అమెరికా యుద్ధం పూర్తయ్యిందట. అలా అని అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. ఇరాక్ లో అమెరికా పని పూర్తయినందున ఈ సంవత్సరాంతానికి అక్కడనుండి అమెరికా సైన్యాలన్ని వెనక్కి వస్తాయి అని ఆయన ప్రకటించాడు. “అమెరికా సైనికులు తల ఎత్తుకుని, తమ విజయాన్ని చూసి గర్వపడుతూ, సైన్యానికి మద్దతు ఇవ్వడం కోసం అమెరికా ప్రజలంతా సమైక్యంగా నిలబడి ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి ఇరాక్ ని వదిలి ఇళ్ళకు చేరుకుంటారు” అని ఒబామా ప్రకటించాడు.…

లిబియా నుండి నాటో సైన్యాలు ఇప్పుడప్పుడే వెళ్ళవు -అమెరికా

షరా మామూలే. సవాలక్ష అబద్ధాలు చెప్పడం, ప్రజస్వామ్యం స్ధాపిస్ధానని బొంకడం, బాంబులతో నాశనం చేయడం, దేశాలలో జొరబడడం, ఆ తర్వాత ఇప్పుడప్పుడే వెళ్ళేది లేదనీ ఆయా దేశాల ప్రభుత్వాలే తమను ఇంకా ఉండమని కోరుతున్నాయని నంగనాచి కబుర్లు చెప్పడం. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో సైన్యాల సాధారణ కార్యక్రమం ఇది. అదిగో లిబియాలో కూడా తిరుగుబాటు తలెత్తింది అని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గత ఫిబ్రవరిలో చెప్పాయి. కాని ప్రజలు పాల్గొన్న తిరుగుబాటుపై ఒక్క…

జపాన్ రాయబార కార్యాలయాలపై సైబర్ దాడులు

జపాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు వివిధ దేశాల్లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయాలలోని కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయని జపాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ దాడులు జూన్ నెలనుండి జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఉన్న జపాన్ కార్యాలయాలపైనా ఈ దాడులు జరిగాయని క్యోడో వార్తా సంస్ధ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలిపాయని క్యోడో ప్రకటించింది. విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని…

పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…

గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు నిశ్చింతగా గడిపారు. అటువంటి గడ్డాఫీని చంపి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల ధనికుల ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి అడుగులకు మడుగులొత్తే తొత్తు పాలకులు లిబియాని ఏలడానికి సిద్దంగా ఉన్నారు. గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు ఎన్ని సౌకర్యాలు అనుభవించారో తెలుసుకుంటే వారిపైన అసూయ కలుగుతుంది. లిబియాలో విద్యుత్ వాడుకున్నందుకు నెల నెలా బిల్లులు రావు. దేశ ప్రజలందరికీ విద్యుత్ ఉచితం. (కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై బాదే అధికారులు అక్కడ…

ఇదే నా విల్లు -మౌమ్మర్ గడ్డాఫీ

ఇది నా విల్లు. మౌమ్మర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుస్సలాం బి హుమాయ్ద్ బిన్ అబు మాన్యర్ బిన్ హుమాయ్ద్ బిన్ నాయిల్ ఆల్ ఫషి గడ్డాఫీ అను నేను, ప్రమాణం చేసి చెప్పునదేమనగా, అల్లా తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ దేవుడి ప్రవక్త, ఆయనకు శాంతి లభించు గాక. నేను ముస్లిం గానే మరణిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నన్ను చంపేస్తే గనక, ముస్లిం సాంప్రదాయాల ప్రకారమే నన్ను పూడ్చిపెట్టాలి. చనిపోయినపుడు ఏవి ధరించి ఉన్నానో…

పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా

యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా…

ఇంతకీ ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం ఎందుకోసం? -కార్టూన్

— పెట్టుబడిదారుడు: అయితే, మీ నిరసనలు దేనికోయ్? నిరసనకారుడు 1: ఉద్యోగాలు, ఇళ్ళు, ఆరోగ్య సంరక్షణ, విద్య… నిరసనకారుడు 2: న్యాయం, నిజాయితీ, నమ్మకం, మార్పు, హేతుబద్ధత… నిరసనకారుడు 3: శాంతి, శుభ్రమైన గాలి, నీరు, భూమి, భవిష్యత్తు… నిరసనకారుడు 4: ?! పెట్టుబడిదారుడు: అంతేనా? —