జపాన్ లో మరో అణు ప్రమాదం, రేడియేషన్ నీరు లీకేజి

జపాన్ లో మరో అణు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాయవ్య జపాన్ లో నెలకొల్పిన ఇక అణు విద్యుత్ కర్మాగారంలోపల రేడియెషన్ కలిసి ఉన్న నీరు లీక్ అవుతున్నట్లు కనుగొన్నారని తెలుస్తోంది. ఈ రేడియెషన్ లీకేజి అణు విద్యుత్ కర్మాగారం లోపలి వరకే పరిమితం అయిందనీ, ఇంకా వాతావరణంలోకి వెలువడలేదనీ తెలుస్తోంది. అయితే వాతావరణంలోకి రేడియేషన్ విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకున్నదీ లేనిదీ తెలియరాలేదు. వాయవ్య జపాన్ లో ఉన్న క్యుషు ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (కెప్కో)…

అత్యాధునిక అమెరికా గూఢచారి విమానాన్ని నేలకూల్చిన ఇరాన్

అత్యాధునికమైన తన మానవ రహిత గూఢచార డ్రోన్ విమానాన్ని ఇరాన్ గగనతలంలో ఎగురుతూ గూఢచర్యానికి పాల్పడుతుండగా ఇరాన్ నేలకూల్చడంతో అమెరికా మింగలేక, కక్కలేక ఉంది. తన గూఢచర్య విమానాన్ని ఇరాన్ నేల కూల్చలేదనీ, దానంతట అదే కొన్ని సమస్యలు రావడం వలన కూలిపోయిందని చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. ఆర్.క్యు – 170 గా పిలిచే ఈ గూఢచార డ్రోన్ విమానం అత్యంత ఆధునికమైనదనీ, అత్యంత ఎత్తునుండి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని అంగీకరిస్తూనే దాన్ని ఇరాన్ కూల్చిందన్న…

అమెరికా కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది -ఒబామా

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శుక్రవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ అది శాశ్వతం కాదని ఆర్ధిక విశ్లెషకులు భావిస్తున్నారు. బారక్ ఒబామా అంచనా సైతం దాని ధృవీకరిస్తోంది. సిబి.ఎస్ టెలివిజన్ కి చెందిన “60 మినిట్స్” కార్యక్రమానికి ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం ఇచి ప్రసారం కానున్నది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో సమస్యల పరిష్కారాన్ని తక్కువ…

అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత

ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్‌మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్‌మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు. ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి…

కోల్‌కతా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 73 మంది దుర్మరణం

కోల్‌కతా లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మంది దుర్మరణ పాలయ్యారు. చనిపోయినవారిలో అధికులు రోగులే. ప్రమాదం జరిగినపుడు రోగులు నిద్రలో ఉండడంతో అధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడంతస్ధుల భవనంలో పొగ దట్టంగా అలుముకోవడంతో అనేకమందికి ఊపిరాడలేదు. అగ్నిమాపక సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి నిచ్చెనలు ఉపయోగించి రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు రోగులను స్ట్రెచర్లలో ఉంచి బైటికి తెస్తున్నారు. బేస్‌మెంట్ లో మంటలు బయలుదేరి ఎ/సి షాఫ్టుల ద్వారా భవనం అంతా వ్యాపించినట్లు…

ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే……

ఆచారాలు, సంప్రదాయాలు భ్రష్టు పట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే క్లబ్ కి వెళ్తున్నట్లుంది –చిన జీయరు స్వామి * * * * (………. …………. …………… ఎడిట్) చినజీయరు స్వామి గారు తిరుపతిని క్లబ్బుతో పోల్చకుండా ఉండవలసింది. ప్రభుత్వం తెస్తున్న మార్పులు అదనంగా వచ్చి చేరేవే తప్ప తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేవి కాదు. అందువలన ప్రజల మనసుల్లో గౌరవ స్ధానంలో ఉన్న తిరుపతిని క్లబ్బుతో…

బేంక్సీ గీసిన మరికొన్ని వీధి చిత్రాలు -ఫొటోలు

‘బేంక్సీ ఇంగ్లండు లో ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. వయసు ముప్ఫై ఏడు. సినిమా డైరెక్టర్ కూడా. పెద్దగా కష్టపడకుండా ఆయన గీసే వీధి చిత్రాలు ఇంగ్లండ్ లో చాలా ప్రసిద్ధి పొందాయి. గోడలపైన సహజంగా ఏర్పడే ఆకారాలను తన చిత్రాలలో భాగంగా చెయ్యడంలో ఈయన దిట్ట. చూడండి మీకే తెలుస్తుంది. – –

యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాం -ఎస్ & పి హెచ్చరిక

యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.…

రష్యా ఎన్నికల నిరసనల వెనుక అమెరికా హస్తం -పుతిన్

రష్యాలో ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా అక్కడ తలెత్తిన నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా ప్రధాని వ్లాదిమిరి పుతిన్ విమర్శించాడు. అమెరికా విదేశాంగ మంత్రి రష్యాలో కొద్దిమంది ప్రతిపక్ష కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చిందని పుతిన్ విమర్శించాడు. “ఆమె వారికి ఓ సిగ్నల్ ఇచ్చింది. వారు ఆ సిగ్నల్ విన్నారు. విని తమ పనిని ప్రారంభించారు” అని పుతిన్ విమర్శించాడు. రష్యా ఎన్నికలు సక్రమంగా జరగలేదని అంతర్జాతీయ పరిశీలకులు, రష్యా ప్రతిపక్ష పార్టీలు…

పాకిస్ధాన్ లో నిశ్శబ్ద (సైనిక) కుట్ర?

పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ గుండె నొప్పి తో దుబాయ్ ఆసుపత్రిలో చేరడంతో పాకిస్ధాన్ లో నిశ్శబ్ద కుట్ర జరుగుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘మెమో గేట్’ కుంభకోణం దరిమిలా పౌర ప్రభుత్వానికీ, సైన్యానికి మధ్య విభేధాలు తీవ్రమైనాయన్న వార్తల నేపధ్యంలో తాజా కుట్ర వార్తలు బలం సంపాదించుకున్నాయి. సైన్యం ఒత్తిడి మేరకు పదవి నుండి రాజీనామా చేయడం కోసమే దుబాయ్ ఆసుపత్రిలో జర్దారీ చేరాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జర్దారీ ప్రతినిధులు మాత్రం కుట్ర…

కోదండరాం నోట ‘2014’ పాట

టి.ఆర్.ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యిందని కోదండరాం గాని ప్రకటన ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అంతేకాదు. కోదండరాం గారు టి.ఆర్.ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ప్రకటన స్పష్టం చేసింది. “2014 సంవత్సరం లోపల తెలంగాణ సాధించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని ప్రొఫెసర్ కోదండరాం గారు మంగళవారం ప్రకటించారు. ఆయన ఇంటెగ్రిటీ పట్ల ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నవారికి ఈ ప్రకటన కళ్ళు తెరిపించినట్లయ్యింది. ‘2014 లోపల తెలంగాణ సాధిద్దాం’ అని…

ఐక్యరాజ్య సమితి తప్పుడు సమాచారం ఇస్తోంది -సిరియా అధ్యక్షుడు

సిరియాలో ప్రజల మరణాలపై ఐక్యరాజ్య సమితి ఇస్తున్నవి తప్పుడు లెక్కలని సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ తెలిపాడు. అమెరికా వార్తా సంస్ధ ఎబిసి న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. సిరియా లో నాలుగు వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సిరియా వచ్చి ఇక్కడ సర్వే జరిపి నిజా నిజాలు వెల్లడించాలని సిరియా అధ్యక్షుడు కోరాడు. సిరియా భద్రతా దళాలు తన సొంత దళాలు కాదని బషర్ అన్నాడు. దళాలను తాను…

యూరోపియన్ వీధి చిత్ర కళ -ఫొటోలు

యూరప్ లోని వివిధ దేశాల నుండి సేకరించిన వీధి చిత్రాలు ఇవి. ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో చూడండి. త్రీ డైమెన్షనల్ చిత్ర కళ అందునా వీధుల్లో ప్రదర్శించడం, ప్రదర్శించి మెప్పించడం ఎంతో సులువుగా చేశారు వీళ్ళు. – –

5 లేదా 6 శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణం ఇండియా భరించలేదు -ప్రణబ్

భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని భరించలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పార్లమెంటులో అన్నాడు. అక్టోబరు నెలలో భారత ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణం 9.73 శాతం గా ఉంది. కనీసం సంవత్సరం నుండి భారత ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం కంటే కిందికి దిగి రాలేదు. మరి ద్రవ్యోల్బణం తగ్గించకుండా ప్రణబ్ ముఖర్జీని ఎవరు ఆపారో తెలియడం లేదు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్న ఆర్ధిక పండితులలో…