సిరియా పై అమెరికా ఆశ, అడ్డుపడుతున్న రష్యా -కార్టూన్

– లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.

జపాన్ పాలపొడి డబ్బాల్లో రేడియేషన్

జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున…

ఇంటర్నెట్ సామాజిక వెబ్ సైట్లు స్వీయ నియంత్రణ పాటించాలి -కేంద్ర మంత్రి

గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి ఇంటర్నెట్ సంస్ధలు, సామాజిక వెబ్ సైట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే అంశాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర సమాచార, ఐ.టి శాఖ మంత్రి కబిల్ సిబాల్ మంగళవారం కోరాడు. అనేక సంస్కృతులు, మతాలు ఉన్న భారత దేశంలో ఏ ఒక్కరి మనోభావాలు గాయపడకుండా ఇంటర్నెట్ సంస్ధలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరాడు. మంత్రి ప్రకటనకు ఇంటర్నెట్ సంస్ధలు వివిధ రకాలుగా స్పందించాయి.…

ఇంగ్లండ్ వీధి చిత్రకారుడి కళ -ఫొటోలు

BANKSY (బేంక్సి) ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. ఈయన సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. పెయింటర్ కూడా. ఇతని వీధి చిత్రాలు చాలా బాగుంటాయి. అందంగా, ఆలోచించేవిగా, వ్యంగ్యాత్మకంగా ఇలా చాలా రకాలుగా చిత్రాలు గీయగలడు. “షాప్ టిల్ యు డ్రాప్” అనే షాపు కోసం ఆయన ఆ షాపు గోడపైన గీసిన చిత్రం చూడండి. – –

ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఇండియా

భారత దేశం ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఉన్న విషయాన్ని ఆర్ధిక పరిశీలకులు పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. రూపాయి విలువ పతనం రూపంలో భారత దేశం ద్రవ్య సంక్షోభం వ్యక్తమవుతున్నది. పైకి రూపాయి విలువ పతనమే ద్రవ్య సంక్షోభానికి కారణంగా కనిపిస్తున్నప్పటికీ భారత దేశ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలే ఇండియాను ద్రవ్య సంక్షోభం వైపుకి నెడుతున్న విషయాన్ని గుర్తించవలసి ఉంది. 1991 లో రూపాయి విలువను రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు తగ్గించిన తర్వాత…

12 వ సంవత్సరంలోకి ప్రవేశించిన “ఇరోం షర్మిలా” నిరాహార దీక్ష

-రచన: డేవిడ్ ఉక్కు సంకల్పం ఆమె. మొక్కవోని మనో నిబ్బరం ఆమె. అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం ఆమె. తల్లడిల్లుతున్న యుద్ధభుమిలో తపోదీక్ష చేస్తున్న శాంతికపోతం ఆమె. తుపాకి గొట్టాల విచ్చలవిడీ తనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు. నిరంకుశ చట్టాన్ని నిరసించిన నిప్పు కణిక. జాతికోసం జంగ్ చేస్తున్న జ్వలిత. అన్యాయంపై తిరగబడ్డ అగ్గిబరాట. శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత. పుష్కర కాలంగా అన్నపానియాలు ముట్టని అసలు సిసలు సత్యాగ్రహి. కన్నీళ్ళను, కష్టాలను కలబోసిన నెత్తుటి…

సృజనాత్మక నిఘా -వీడియో

ఇది ప్రవేటు నిఘా కన్ను. జనాన్ని తన వద్దకు ఆకర్షించి మరీ నిఘా వేస్తుంది ఈ కన్ను. న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ లోని మిల్టన్ స్ట్రీట్ లో ఉన్న ఈ నిఘా కన్ను పదంతస్ధుల ఎత్తులో వాటర్ ట్యాంకు కింది భాగంలో ఏర్పాటు చేశారు. తన పరిధిలో తాను చూడగల ప్రాంతంలో ఎవరు వస్తున్నదీ, ఎవరు పోతున్నదీ అన్నింటినీ ఇది రికార్డు చేస్తుంది. ప్రవేటు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతంలో నిఘా పెడుతున్నందుకు ప్రభుత్వం అభ్యంతరం…

రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ కి ఎదురుదెబ్బ, సాధారణ మెజారిటీతో సరిపుచ్చిన ఓటర్లు

గత దశాబ్దం పైగా రష్యాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్ కు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఎదురు లేకుండా తమకు అవసరమైన ‘రాజ్యాంగం సవరణలు’ చేసుకుంటూ పాలించిన పుతిన్ పార్టీకి ఈసారి రష్యా ప్రజలు కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే కట్టబెట్టారు. అంటే ఇక పుతిన్ పార్టీ ‘రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునే’ వెసులుబాటును కోల్పోయిందన్నమాట. రాజ్యాంగానికి ఏమన్నా మార్పులు చేయదలుచుకుంటే ఇతర పార్టీలపై ఆధారపడవలసిందే.…

యురేనియంను ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -2

రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు…

యురేనియం ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -1

భారత్ నూ, పాకిస్ధాన్ నూ సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను పాకిస్ధాన్ కోరింది. ఇండియాకు యురేనియం ఖనిజాన్ని అమ్మడానికి ఆస్ట్రేలియా పాలక లేబర్ పార్టీ ఆదివారం ఆమోదం తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాకిస్ధాన్, తమను కూడా ఇండియాతో సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను కోరింది. యురేనియం కొనుగోలు చేయడానికి తమను కూడా అనుమతించాలని కోరింది. అణు రియాక్టర్లలో యురేనియం ను ఇంధనంగా వాడతారన్నది తెలిసిందే. ప్రపంచంలోకెల్లా యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో అధికంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా న్యూక్లియర్ సప్లయర్స్…

గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం సస్పెన్షన్ తాత్కాలికమే

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “ఇవి కేవలం భారతీయ రాజకీయాలు మాత్రమే” అని ఆ అధికారి అన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. “నమ్మదగని భారత ప్రభుత్వం (ఫికిల్ ఇండియా గవర్నమెంట్) విదేశీ సూపర్ మార్కెట్ల నిర్ణయాన్ని పక్కనబెట్టింది” అన్న హెడ్డింగ్ తో  రాయిటర్స్ వార్తా సంస్ధ ఓ…