ఫోన్లు, ఈ-మెయిళ్ళు ట్యాప్ చెయ్యడానికి అనుమతి పొందిన ‘రా’

పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఉన్నట్లే, ఇండియాకి కూడా ఓ గూఢచార సంస్ధ ఉంది. దాని పేరు ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’. దీన్ని సంక్షిప్తంగా ఆర్.ఎ.డబ్ల్యు లేదా ‘రా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా పాకిస్ధాన్, చైనా విషయాల్లో చురుకుగా పని చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు భారతీయులు చేసే ఫోన్ కాల్స్, ఈ-మెయిళ్ళు, ఇంకా ఇతరేతర డేటా కమ్యూనికేషన్లు అన్నింటినీ దొంగచాటుగా వినే అధికారం చట్టపరంగా దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం…

ప్రపంచంలో అత్యంత పొట్టి మహిళ ‘జ్యోతి ఆమ్గే’ -ఫొటోలు

62.8 సెంటీ మీటర్లు లేదా 24.7 అంగుళాల ఎత్తుకలిగిన జ్యోతి ఆమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. తన పద్దెనిమిదవ పుట్టిన రోజు డిసెంబరు 16 న ఆమే ఈ ఘనత సాధించింది. తన ఎత్తుతో సంబంధం లేకుండా ఆమె బాలీవుడ్ స్టార్ కావాలని కలలు కంటోందిట. గత సెప్టెంబరు నెలలోనే ప్రపంచ పొట్టి మహిళగా రికార్డుల కెక్కిన 22 ఏళ్ళ అమెరికన్ మహిళ రికార్డును జ్యోతి అధిగమించింది.…

‘బ్యాట్ మేన్’ రెక్కలు కత్తిరించిన చైనా పోలీసు గూండాలు

చైనాలో ‘పోలీసులు’ అనబడే గూండాలు ‘బ్యాట్ మేన్’ సినిమా హీరో రెక్కలు కత్తిరించారు. తన తాజా సినిమా ప్రచారం కోసం చైనాలో పర్యటిస్తున్న ‘బ్యాట్ మేన్’ హీరో క్రిస్టియన్ బేల్, ఒక చైనా న్యాయవాద కార్యకర్తను కలవడానికి చేసిన ప్రయత్నాలను స్ధానిక పోలీసులు వమ్ము చేసారు. పోలీసు నిర్భంధం నుండి విడుదలైన కార్యకర్త ఇంటివద్ద ఉన్నప్పటికీ, ఆయనను కలవడం పైన ప్రస్తుతం నిషేధమేమీ లేనప్పటికీ అతన్ని సినిమా స్టార్ కలవడానికి పోలీసులు ఇష్టపడకపోవడం విశేషం. బేల్ ను…

ఫుకుషిమా అణు కర్మాగారం కార్మికులకు ‘స్టమక్ ఫ్లూ’

భూకంపం, సునామీల బారినపడి ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు కర్మాగారం లో శుభ్రపరిచే పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో డజన్లమందిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద పరిస్ధితి స్ధిర దశకు (స్టబిలిటీ) వచ్చిందని జపాన్ ప్రధాని ప్రకటించిన మరుసటిరోజే కార్మికులు జబ్బుబారిన పడడం విశేషం. అణు ప్రమాదం కారణంగా కర్మాగారంలో విడుదలైన రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరిచే కార్యక్రమంలో కార్మికులు అనేక నెలలుగా నిమగ్నమై ఉన్నారు. కార్మికులకు…

బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి

విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలన్న డిమాండ్ తో బాబా రాందేవ్ ప్రారంభించిన నిరాహార దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి చేసిన దాడికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం బాధ్యుడని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ నిర్ధారించాడు. రాందేవ్ నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్న వార్తలు పత్రికలలో రావడంతో సుప్రీం కోర్టు తనంతట తానే ఈ కేసును చేపట్టింది. అనంతరం కేసు విచారణలో తనకు సాయపడాలని కోరుతూ సుప్రీం కోర్టు, సీనియర్…

ఇరాక్ యుద్ధం ముగిసిందట! -ఫొటోలు

‘ఇరాక్ యుద్ధం’ ముగిసిందని డిసెంబరు 15 తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించాడు. ఇరాక్ లో తమ పని ముగిసిందనడానికి ప్రతీకగా అక్కడ అమెరికా పతాకాన్ని అవనతం చేశారు. రెండు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఎనిమిదేళ్ల పాటు ఎందుకు కొనసాగిందో అమెరికా నాయకులు ఇంతవరకూ వివరించలేదు. సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని తెలిసినా ఇరాక్ లో సైన్యాన్ని ఎందుకు కొనసాగించారో ఇంకా చెప్పలేదు. అమెరికా లెక్క ప్రకారమే లక్షమంది ఇరాక్ పౌరులను చంపిన అమెరికా నాయకులకు…

‘యూరో’ ను నిలబెట్టడానికి జర్మనీ, ఫ్రాన్సుల విఫల యత్నం -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి సెన్సెక్స్ పతనం

బోంబే స్టాక్ ఎక్చేంజి సెన్సెక్స్ సూచి శుక్రవారం రెండున్నర శాతం పతనం అయింది. మొత్తంగా రెండేళ్లలోనే అత్యంత కనిష్ట స్ధాయికి చేరుకుంది. బ్యాంకింగ్, మెటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసిందని విశ్లేషకులు, ట్రేడర్లు విశ్లేషించారని రాయిటర్స్ తెలిపింది. బ్యాంకుల షేర్లు, ఫ్యూచర్లు బాగా పతనం అయ్యాయనీ, ఆర్.బి.ఐ పరపతి విధానం సమీక్షతో నిరుత్సాహపడిన మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని వారు చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్…

‘పాపులిస్టు ముసుగు’ చించుకుని బైటికి వచ్చిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని బైట పెట్టుకున్నాడు. తాను ఇస్తున్న పాపులిస్టు నినాదాలు నిజానికి తన ముసుగు మాత్రమేననీ, వాస్తవంలో తన ఆలోచనలు ప్రజానుకూలం కాదని రుజువు చేసుకున్నాడు. దాదాపు నాలుగు కోట్ల కుటుంబాలను రోడ్లపాలు చేసే ‘రిటైల్ రంగంలో విదేశీ సూపర్ మార్కెట్ల’ నిర్ణయానికి బహిరంగంగా తన మద్దతు తెలిపాడు. రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే రైతులకే లాభం అని నచ్చ జెప్పడానికి కూడా సిద్ధపడ్దాడు. బహిరంగంగా ప్రజలకు అబద్ధాలు చెప్పే రాజకీయ…

చీప్ లిక్కర్ మృతుల కుటుంబాల్లో అంతులేని విషాధం -ఫొటోలు

పశ్చిమ బెంగాల్, సంగ్రామ్ పూర్ గ్రామంలో విషపూరితమైన చీప్ లిక్కర్ తాగి మృతి చెందినవారి సంఖ్య 167 కి పెరిగింది. మృతులందరూ రిక్షా కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజు కూలీలే. వీరి మరణంతో వీరి సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు భవిష్యత్ ఎలా అని తల్లడిల్లుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనిక రోగులు చేరే ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం,…

131 మందిని చంపేసిన చీప్ లిక్కర్

ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయి రోజులైనా గడవక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ప్రాణాంతక (ప్రమాదం లాంటి) సంఘటనే జరిగింది. చట్ట విరుద్ధంగా తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి 131 మంది జనం చనిపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సంగ్రామ్ పూర్ గ్రామం చుట్టు పక్కల జరిగిన ఈ ఘటనలో ఇంకా అనేకమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి చీప్ లిక్కర్ సేవించిగా బుధవారం తెల్లవారు ఝాము…

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఎగుమతులపై చైనా అదనపు సుంకాలు

చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంలో మరో ముందడుగు పడింది. చైనా నుండి ఎగుమతి అవుతున్న గ్రీన్ ఉత్పత్తుల వలన అమెరికా గ్రీన్ ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతున్నదంటూ అమెరికా ఉత్పత్తిదారులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించిన తర్వాత చైనా ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికానుండి కార్లు పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి నుండి దిగుమతి అవుతున్న కార్లపైన చైనా వివిధ స్ధాయిల్లో అదనపు సుంకాలను విధించింది. అమెరికా కేవలం దర్యాప్తు…