ట్రాఫిక్ గుర్తుల్ని స్ట్రీట్ ఆర్ట్ గా మలిచిన వైనం -ఫొటోలు

ట్రాఫిక్ గుర్తుల్ని రూపొందించినవారికి కళా దృష్టి తప్పని సరి. బిజీ రోడ్లపై ట్రాఫిక్ ను నియంత్రించడానికి వాడుతున్న గుర్తుల్ని రూపొందించడంలో కళాత్మక దృష్టిని మనం చూడగలం. కళాత్మక దృష్టి లేకుండా ట్రాఫిక్ లో ఎదురవగల ప్రమాదాలను కేవలం కొన్ని రేఖలతో గీసిన గుర్తుల ద్వారా, పెద్దగా రంగులు వాడకుండానే చెప్పగలగడం సాధ్యమేనా? స్ట్రీట్ అర్ట్ చిత్రకారులు తమ కళా దృష్టికి మరింత పదును పెట్టి గీసిన ట్రాఫిక్ గుర్తులివి. మౌస్ పాయింటర్ తో కంప్యూటర్లలో ఎన్నో ఆపరేషన్స్…

ipad_iphone_ipod

పాక్ జీడీపీ కి యాపిల్ ‘మార్కెట్ కేపిటలైజేషన్’ మూడు రెట్లు

ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్, మేక్ కంప్యూటర్ల సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ కంపెనీ ‘యాపిల్’ మార్కెట్ కేపిటలైజేషన్ విలువ త్వరలో అర ట్రిలియన్ (500 బిలియన్) డాలర్ల మార్కు దాటనున్నది. మంగళవారం నాటికి ఆ విలువ 499.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది.  ఐ ప్యాడ్ -3 అమ్మకాలు బంపర్ స్ధాయిలో ఉంటాయన్న ఊహాగానాలతో యాపిల్ కంపెనీ స్టాక్ విలువ పైపైకి దూసుకు పోతుండడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రికార్డు స్ధాయిని చేరుతోంది.…

Austerity ward

‘పొదుపు విధానాల’ క్షతగాత్ర ‘యూరప్’ -కార్టూన్

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అమెరికా, యూరప్ లకు చెందిన బడా కార్పొరేట్ కంపెనీలు అక్కడి ప్రభుత్వాల ద్వారా ప్రజలపైన దారుణమైన పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల ఫలితంగా అనేక యూరప్ దేశాలు క్షత గాత్ర దేశాలుగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము అభివర్ణించుకునే ఈ దేశాల ప్రభుత్వాలు తాము వత్తాసు పలికే పెట్టుబడిదారీ కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు…

కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

అరగంటకోసారి విశ్రాంతి కోరే పని అది, పదేళ్ళుగా సెలవే లేదు

భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోనే వాజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో గల అనేక స్టీల్ ప్లాంట్లలో పదేళ్ళుగా సెలవన్నది తెలియకుండా పని చేస్తున్న కార్మికుల సంగతి వెలుగులోకి వచ్చింది. వారానికొక విశ్రాంతి దినం కోసం అక్కడి కార్మికులు స్వచ్ఛందగా సమ్మెకు దిగడంతోనే ఇప్పటికైనా వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మొదటిసారిగా వాజీర్ పూర్ స్టీల్ ప్లాంటుల కార్మికులు బుధవారం రోజు (ఫిబ్రవరి 29) వారాంతపు సెలవు దినాన్ని పొందనున్నారు. ఆ రోజు వారు…

ఖురాన్ దహనంపై ఆఫ్ఘన్ల నిరసనలు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా సైనిక స్ధావరంలో సైనికులు ఖురాన్ ప్రతులను దగ్ధం చేయడంతో వారం రోజుల నుండి అక్కడ ప్రజల నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఇద్దరు సీనియర్ అమెరికా సైనికాధికారులను ఆఫ్ఘన్ పోలీసు కాల్చి చంపాడు. శనివారం నిరసనకారులు విసిరిన గ్రేనేడ్ పేలి పది మందికి పైగా అమెరికా సైనికులు, అధికారులు గాయపడ్డారు. నిరసన ప్రదర్శనలపై ఆఫ్ఘన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికి పాతిక మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబాబా తో…

కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా

రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్…

నక్సల్ జిల్లాల్లో పోలీసులకి రు.800 కోట్లు, ప్రజలకి రు.30 కోట్లు

దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే.  మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే…

కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ఫాసిస్టు పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. భారత దేశంలోని పాలక వర్గ పార్టీలు నామ మాత్రంగా ఏర్పరుచుకున్న నియమాలను, సూత్రాలనూ సైతం ఉల్లంఘిస్తోంది. రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా రావడమే కాకుండా రైతుల ఆత్మహత్యలను బూటకంగా అభివర్ణిస్తూ ‘పచ్చి ప్రజా వ్యతిరేకి’ గా తనను తాను రుజువు చేసుకుంటోంది. మమత వ్యవహార సరళితో బెంగాల్ లోని వివిధ రంగాల మేధావులు తీవ్రంగా నిరసిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.…

‘ఖురాన్’ దగ్ధం పై ఆఫ్టనిస్ధాన్ లో వెల్లువెత్తుతున్న నిరసనలు

అమెరికా సైనికులున్న సైనిక స్ధావరంలో ఖురాన్ ప్రతులను అనేకం దగ్ధం చేసిన తర్వాత అక్కడ నిరసన ప్రదర్శనలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం పదకొండు మంది ఆఫ్ఘన్ల నిరసనలలో మరణించారు. అమెరికా సైనికులు నిరసనకారుల చేతుల్లో చనిపోగా ఆఫ్ఘన్ నిరసన కారులు ఆఫ్ఘన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ సైనికుల చర్యకు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు చల్లారకపోవడంతో అమెరికా, ఆఫ్ఘన్ పాలకులు తలలు పట్టుకున్నారు. ఒబామా చెబుతున్న…

ఇండియా, చైనాల్లో కార్ల కొనుగోలు వల్లనే ఆయిల్ రేట్లు పెరగడం -ఒబామా

అమెరికాలో జనం లాగానే ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాల్లోని జనం కూడా కార్లు కొనడం ఎక్కువయిందనీ అందువల్లనే ఆయిల్ ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయనీ ఒబామా కొత్త సంగతి కనిపెట్టాడు. అక్కడికి కార్లు కొని సుఖపడే యోగం అమెరికా ప్రజల సొంతమైనట్లు. వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, అవినీతి, దోపిడి లవల్ల తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులను పరిష్కరించలేక మూడో ప్రపంచ దేశాలపై పడి ఏడ్వడం అమెరికా, యూరప్ లకు మామూలైపోయింది. తమ కంపెనీల దుర్మార్గాన్ని…

Saif Ali Khan

హీరో, హీరోయిన్లా, విలన్లా?

బహిరంగ స్ధలం అయిన ఓ హోటల్ లో పెద్దగా మాట్లాడవద్దన్న పాపానికి ఒక వ్యాపారిపై పిడిగుద్దులు కురిపించి అతని ముక్కు ఎముకను విరగ్గొట్టిన బాలీవుడ్ హీరో ఉదంతం ఇది. సినిమాల్లో విలన్లనూ, వారి అనుచరులనూ యధేచ్ఛగా కొట్టి, కాల్చి చంపే హీరోలు వాస్తవ జీవితంలో కూడా అదే పద్ధతిని కొనసాగించవచ్చని భావిస్తున్నారా? ముంబైలో గల తాజ్ హోటల్ లో జరిగిందీ ఘటన. బుధవారం రాత్రి నలభై నాలుగేళ్ల ఇక్బాల్ నవీన్ శర్మ అనే ఎన్నారై వ్యాపారి సైఫ్…

Bala Gopal

బాల గోపాల్ ‘మానవ ప్రవృత్తి’ వాదన, విమర్శ

(“మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత” పేరుతో ఈ బ్లాగ్ లో రాసిన వ్యాసం కింద కొద్ది రోజుల క్రితం ‘మౌళి గారు’ రాసిన వ్యాఖ్యకి సమాధానాన్ని టపా గా ప్రచురిస్తున్నాను -విశేఖర్) బాల గోపాల్ గారు మార్క్సిజంలో ఖాళీలున్నాయని రాసారు. మానవ ప్రవృత్తి అనేది ప్రత్యేకంగా ఒకటుంటుందనీ, దానిని మార్క్సిజం పట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయ పడ్డాడు. భౌతిక సమాజ నియమాలకు అతీతంగా మానవ ప్రవృత్తి ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇంకా అలాంటివి మరి…

ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు

సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది.…