ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…

ఇండియా అగ్రరాజ్యం అయ్యే ఛాన్సే లేదు -అధ్యయనం

అగ్ర రాజ్యంగా అవతరించాలని కలలు కంటున్న భారత దేశానికి ఆ అవకాశాలు కనుచూపు మేరలో లేవని “లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” (ఎల్.ఎస్.ఇ) జరిపిన అధ్యయన నివేదిక తేల్చింది. అనేకమంది భారతీయ స్కాలర్లు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2009లో భారత్ సందర్శిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ “ఇండియా కేవలం ప్రాంతీయ శక్తి కాదు, అదొక ప్రపంచ శక్తి” అని ప్రకటించడాన్ని కొట్టి పారేసింది. ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆర్ధిక వృద్ధి సాధించడంలోనూ,…

Water problem in India

భారత దేశంలో నీటి సమస్య ‘విశ్వరూపం -ఫొటో

ఇన్ఫర్మేషన్ అన్న పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఈ ఫొటో లబ్యమయింది. భారత దేశంలో తాగు నీరు సమస్య కళ్లకు కట్టినట్లు ప్రతిబింబిస్తున్న ఈ ఫొటో తీసిన ఫొటో గ్రాఫర్ ని అభినందించకుండా ఎవరైనా ఉండగలరా? ఫొటోగ్రఫీ కళతో ప్రజల సమస్యలను ఎంత శక్తివంతంగా చెప్పవచ్చో ఈ ఫోటో తెలుపుతోంది. కళలన్నవి ప్రజలకు ఉపయోగపెట్టాలన్న స్పృహ ఉన్నపుడు కళలతో అద్భుతాలు సాధించవచ్చు.

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…

2012 అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీనీ నమ్మని భారత ప్రజలు

భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే…

ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …

యు.పి ఎన్నికల్లో సైకిల్ హవా -కార్టూన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…

మమతకి గడ్డి పెట్టిన కోల్ కతా హై కోర్టు

తన ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలకు 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనే కారణం అంటూ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ తన భాద్యతలను ఎలా తప్పించుకోగలదని కోల్ కతా హై కోర్టు తీవ్రంగా విమర్శించింది. సి.పి.ఐ(ఎం) పార్టీ నాయకులను చంపిన కేసులో పోస్టు మార్టం రిపోర్టు కూడా మృతుల బంధువులకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. శుక్రవారం నాలుగు గంటల లోగా పోస్టు మార్టం రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల పాలన…

రికార్డు స్ధాయికి యూరోజోన్ నిరుద్యోగం

17 దేశాల యూరో జోన్ లో నిరుద్యోగం రికార్డు స్ధాయికి చేరుకుంది. జనవరి నాటికి ఈ దేశాల నిరుద్యోగం 10.7 శాతం ఉందని యూరో స్టాట్ సంస్ధ వెల్లడించింది. యూరో జోన్ దేశాల్లోని కంపెనీలు డిసెంబరులో మరో 1,85,000 ఉద్యోగాలు రద్దు చేశాయని గణాంకాలు చెపుతున్నాయి. యూరప్ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బుని బిలియన్ల కొద్దీ బెయిలౌట్లుగా మేసిన కార్పొరేట్ కంపెనీలు ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడినప్పటికీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు మరిన్ని  ఉద్యోగాలు…

ఎరువుల రేట్ల తగ్గుదల రైతుకి చేరకుండా నోక్కేసిన కేంద్ర ప్రభుత్వం

అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల రైతుకీ చేరకుండా కేంద్ర ప్రభుత్వం నోక్కేసింది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలకు నష్టం వస్తోందంటూ పెంచే ప్రభుత్వం అవి తగ్గినపుడు మాత్రం, ఆ తగ్గుదలను ప్రజలకు అందకుండా తానే నోక్కేస్తుంది. అదే పద్ధతిని ఎరువుల విషయంలో కూడా అనుసరించడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎరువల ధరలను చాలా కాలం క్రితమే ప్రభుత్వం డీ కంట్రోల్ చేసింది. దానివల్ల ఎరువుల ధరలు సాధారణ రైరులకు అందనంత ఎత్తులో…

అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా

తాలిబాన్ తో జరుగుతున్న చర్చల్లో అమెరికా ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తుండగా, తమ సుప్రీం నాయకుడి కోసం ‘రాజ్యాంగ హోదా’ కావాలని తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. గ్వ్యాంటనామో బే లో ఖైదీగా ఉన్న తమ నాయకులను, కమాండర్లనూ విడుదల చేయాలనీ, కీలు బొమ్మ కర్జాయ్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందేననీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. ఋణ సంక్షోభం, మళ్ళీ రిసెషన్ లోకి జారిపోతుందేమోనని భయపెడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం లాంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా,…

‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది.…

ఇండియా ‘జిడిపి గ్రోత్’ కధ ఇక కంచికేనా?

ప్రపంచానికి గొప్పగా చూపుతూ వచ్చిన భారత దేశ జి.డి.పి వృద్ధి రేటు ఇక గత కాలపు జ్ఞాపకమేనా? ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని ఎనిమిది శాతం పైగా జీడీపీ పెరుగుదల రేటును నమోదు చేసిన భారత ఆర్ధిక వృద్ధి కధ ఇక కంచికేనా? 2011-12 సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్ల మొత్తం మీద భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసిన వృద్ధి రేటు చూసీనా, మూడో క్వార్టర్లో నమోదయిన వృద్ధి రేటు చూసినా ఈ…