చైనా అధ్యక్షుడి రాకను నిరసిస్తూ ఢిల్లీలో టిబెటన్ ఆత్మాహుతి -ఫొటోలు

చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి. టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ…

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ ప్రయాణాల ఖర్చు రు.205 కోట్లు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ…

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు…

అమెరికా యుద్ధ నేరాలకు మచ్చుతునక ‘కోలేటరల్ మర్డర్’ -వీడియో

“అబద్ధాలు నిజాలుగా ధ్వనించడానికీ, హత్యలు గౌరవనీయమైనవిగా చేయడానికీ, ఒట్టి గాలిని సైతం గట్టి పధార్ధంగా చూపడానికీ రాజకీయ పరిభాష ఉద్దేశించబడింది” -జార్జ్ ఆర్వెల్ “Political language is designed to make lies sound truthful and murder respectable, and to give the appearance of solidity to pure wind.” -George Orwell మార్చి 22 న ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంస్ధలో అమెరికా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఎల్.టి.టి.ఈ…

పరీక్ష హాలులో దళిత బాలికల బట్టలిప్పించిన ఇన్విజిలేటర్లు

పరీక్షల్లో ఎవరైనా విద్యార్ధులు కాపీ కొడుతున్నట్లు అనుమానం వస్తే ఇన్విజిలేటర్లు ఏం చేయాలి? సాధారణంగా జేబుల్లో కాపీ స్లిప్పులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. కాగితాల కింద దాచి పెట్టారేమో చెక్ చేస్తారు. ఇంకా దాచిపెట్టడానికి ఉన్న అవకాశాలని పరిశీలించి వెతుకుతారు. జామెట్రీ బాక్సుల్లో, రిస్ట్ వాచీ కిందా ఇలాంటి చోట్ల. అయితే దళిత బాలికలైతే ఇవేవీ అవసరం లేదు. పరీక్ష రాస్తున్న వారు 15 సంవత్సరాల బాలికలైనా, సంస్కార హీనమని తెలిసినా వారు దళిత బాలికలైతే అందరి…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

బ్లాక్ టీనేజర్ హత్య: అమెరికా వ్యాపితంగా నిరసనలు -ఫొటోలు

బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ మార్టిన్ (17 సం.) ను తెల్ల పోలీసు కాల్చి చంపిన కేసును ‘జాత్యహంకార హత్య’ గా భావిస్తున్నారు. హత్య చేసిన పోలీసు ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం టీనేజర్ ని కాల్చిచంపానని చెప్పడంతో అతనిని పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో రెండు వారాలుగా అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లోరిడా రాష్ట్రంలో కేంద్రీకృతమైన ఈ ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరించాయి. ఫిలడెల్ఫియా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో ‘మిలియన్…

బ్లాక్ టీనేజర్ హత్య పై అట్టుడుకుతున్న అమెరికా

ఫిబ్రవరి 26 వ తేదీన ఫ్లోరిడా రాష్ట్రంలో తెల్ల జాతికి చెందిన పోలీసు ఒకరు నల్ల జాతికి చెందిన టీనేజర్ ను కాల్చి చంపిన విషయంలో అమెరికా అంతటా నిరసనలు చెలరేగుతున్నాయి. 17 యేళ్ళ వయసు కలిగిన ట్రేవాన్ మార్టిన్  నిరాయుధుడుగా ఉన్నప్పటికీ పోలీసు (జిమ్మర్ మేన్ – 28 సం.) అతనిని ‘ఆత్మ రక్షణ’ కోసం చంపినట్లుగా చెబుతున్నాడు. బ్లాక్ టీనేజన్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో దానికి కారణం జాతి పక్ష…

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు 2.4 లక్షలు

అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏడవ స్ధానంలో ఉందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2.4 లక్షల మంది భారతీయులు ఎటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని, 2000, 2011 సంవత్సరాల మధ్య వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అమెరికా తెలిపింది. ఇదే కాలంలో  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 84.6 లక్షల నుండి 1.151 కోట్లకు పెరిగిందని కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మెక్సికోకి …

పిల్లల ఊహాశక్తికి నిదర్శనం ఈ పెయింటింగ్ లు -ఫొటోలు

‘ది హిందూ’ పత్రిక ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలు వేసే పెయింటింగ్ లు చాలా సార్లు అబ్బురం కలిగిస్తాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలపైన, ముఖ్యంగా ప్రకృతి పైన వీరికి ఉన్న ఊహాశక్తిని అభినందనించకుండా ఉండలేం. ప్రకృతితో పాటు సమాజం, సంస్కృతి, దేశ భక్తి లాంటి అంశాలపై కూడా వీరి అభిప్రాయాలను అక్కడక్కడా చూడగలం. ప్రధానంగా పాఠ్య పుస్తకాల ద్వారా తమకు అందే విజ్ఞానాన్నే…

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని…

Pirate of the Malvinas

‘వలస బుద్ది’ వీడన్ బ్రిటన్ -కార్టూన్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచ దేశాలను కబళించే అగ్రరాజ్యంగా అవతరించడంతో ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అస్తమించింది. అనేకవలసల నుండి విరమించుకున్న బ్రిటన్ అమెరికాకి ఉపగ్రహ రాజ్యంగా మారిపోయింది. స్వతంత్ర దేశాలపై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాల్లో జూనియర్ పార్టనర్ గా చేరింది. అయితే అదింకా అర్జెంటీనా కి చెందిన ‘మాల్వినాస్’ (బ్రిటన్ దీనిని ఫాక్ లాండ్స్ గా పిలుస్తుంది) ద్వీపకల్పాన్ని ఇంకా తన వలసగానే పరిగణిస్తోంది. మాల్వినాస్ ని సముద్రాలకు ఆవల ఉన్న…

Coal scam-Wind fall gains

“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్

ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ…

రు. 10.67 లక్షల కోట్ల ‘బొగ్గు కుంభకోణం’ బట్టబయలు చేసిన సి.ఏ.జి

వేలం వేయకుండా ప్రవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి ఏకంగా 10.67 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని రాజ్యాంగ బద్ధ సంస్ధ ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి) గురువారం వెల్లడించింది. విలువ రీత్యా 1.76 లక్షల కోట్ల 2 జి కుంభ కోణం కంటే ఇది ఆరు రెట్లు పెద్దది. 2004-2009 మధ్య కాలంలో 155 ఏకరేజ్ ల బొగ్గు గనులను వేల వేయకుండా 155 కంపెనీలకు…

అంతిమ ఘడియల్లో ‘పిచ్చుకలు -ఫొటోలు

పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు…