ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గింపు, గృహ ఆటో కార్పొరేట్ రుణాలు చౌక

భారత రిజర్వ్ బ్యాంకు తన స్వల్ప కాలిక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రధానంగా కార్పొరేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. నూతన పెట్టుబడుల కోసం, కంపెనీలు వ్యాపారాల విస్తరణ కోసం బ్యాంకులు మరిన్ని రుణాలను సమకూరుస్తాయి. తద్వారా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయాలన్నది ఆర్.బి.ఐ లక్ష్యం. గృహ రుణాలపై కూడా వడ్డీ…

అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

ప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు…

‘కాబూల్ దాడి’ సూత్ర ధారి పాకిస్ధానీ ‘హకానీ నెట్ వర్క్’

ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం వరకూ కొనసాగిన ‘కాబూల్ దాడి’ నిర్వహించింది పాకిస్ధాన్ కి చెందిన ‘హక్కానీ గ్రూపు’ అని అసోసియేటేడ్ ప్రెస్ తెలిపింది. కాబూల్ తో పాటు మరో మూడు ఆఫ్ఘన్ నగరాలపైన దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ‘దురాక్రమణకు తాలిబాన్ ప్రతిఘటన బలహీన పడిందని ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన అమెరికాకి తమ అంచనా తప్పని తెలియజేయడానికే ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా తెలిపాడు. తమ ‘వేసవి దాడులకు’…

‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు

పోలీసు గూండాయిజానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. భర్త కట్న దాహాన్ని తీర్చలేక ప్రొఫెసర్ ని శరణు వేడిన మహిళను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కట్న పిశాచికి అప్పగించడానికి ప్రయత్నించారు. మహిళను తీసుకెళ్లడానికి మహిళా పోలీసులను వినియోగించాలన్న చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించారు. రాష్ట్ర సరిహద్దుని దాటి మరీ పైశాచికత్వం ప్రదర్షించారు. తమ ఆధీనంలో ఉన్న మహిళను కొడుతున్నప్పటికీ మౌన ప్రేక్షకులుగా మిగిలినందుకు, స్ధానిక జిల్లా ఎస్.పి, ఒక ఎస్.ఐ తో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు. మహిళ…

ఆఫ్ఘన్ మహిళ ‘షంషియా’ వీధి చిత్రాలు -ఫొటోలు

‘కళా రంగం’ పై తీవ్ర అణచివేత ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో ఒక మహిళ వీధి చిత్రాలు గీయడానికి పూనుకోవడం సాహసమే. కాబూల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన షంషియాని హస్సాని (24) ఆమె మిత్రుడు ఫౌషంజి హస్సాని (25) లు గీసిన చిత్రాలివి. మెయిన్ రోడ్లపక్కన ఉన్న గోడలపై గీయడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. దానితో ముప్ఫై యేళ్ల యుద్ధాల్లో శిధిలమైన భవనాల్లో లోపలి గోడలే వారి కళా తృష్ణకు సాధనాలయ్యాయి. తామే ఫొటోలు తీసి పత్రికలకు…

మురికి కాలవలో అప్పుడే పుట్టిన బాలిక

ఇది రాజస్ధాన్ లో జరిగిన ఘోరం. అప్పుడే పుట్టిన బాలిక మురికి కాలవలో ప్రత్యక్షమైంది. పొద్దున్నే చేసే వ్యాయామంలో భాగంగా నడుస్తూ అటుగా వచ్చినవారు పాప ఏడుపు విని పోలీసులకు చెప్పడంతో పాప బతికిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఒక ఎన్.జి.ఓ సంస్ధ ముందుకు వచ్చి పాపని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్ధాన్ రాజధాని జైపూర్ కి 300 కి.మీ దూరంలో ఉన్న ఉదయ్ పూర్ నగరంలో జరిగిందీ ఘటన. శనివారం ఉదయం జాగింగ్…

కాబూల్ లో పశ్చిమ దేశాల ఎంబసీలపై తాలిబాన్ బహుముఖ దాడులు

పశ్చిమ దేశాల దురాక్రమణ లో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ ఆదివారం మరోసారి విరుచుకుపడింది. రాజధాని కాబూల్ లో దుర్భేద్యంగా భావించే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంపై బహుముఖ దాడులకి దిగింది. పశ్చిమ కాబూల్ లోని పార్లమెంటు భవనం వద్ద పెద్ద ఎత్తున పేలుళ్ళు వినబడుతున్నాయనీ, జర్మనీ, బ్రిటన్, నాటో లకు చెందిన ఎంబసీలపై అనేక వైపుల నుండి మిలిటెంట్లు కాల్పులు సాగిస్తున్నారనీ, రాకెట్లు ప్రయోగిస్తున్నారనీ బి.బి.సి తెలిపింది. దాడులకు తామే బాధ్యులమని తాలిబాన్ ప్రతినిధి తెలిపాడని ఆ…

GEORGE

కత్తిరింపులు: ఉస్మానియా అగ్నికణం జార్జి రెడ్డి 40 వ వర్ధంతి

జార్జి రెడ్డి పి.డి.ఎస్.యు (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్ధి సంఘం నిర్మాత. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విప్లవ విద్యార్ధి ఉద్యమాలకు ఆద్యుడు. క్యూబా విప్లవకారుడు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని భారత పీడిత ప్రజల పక్షాన విద్యార్ధి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న అగ్నికణం. ‘పుట్టుకతో వృద్ధులు’గా జీవించడానికి నిరాకరించి ‘పావన నవజీవన బృందావన నిర్మాతల’లో భాగం కావడానికి నిశ్చయించుకున్న స్ఫూర్తి ప్రదాత. యూనివర్సిటీ క్యాంపస్ లో మత దురభిమాన శక్తుల గూండాయిజాన్ని ఎదుర్కొని…

వ్యభిచారం స్కాండల్ లో ఒబామా సెక్యూరిటీ సిబ్బంది

ఒబామా భద్రత కోసం విదేశాల్లో విధులు నిర్వహించడానికి పోయి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒబామా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహారం ఇది. శని, ఆదివారాల్లో కొలంబియాలోని కార్టాజినా నగరంలో అమెరికా రాజ్యాల సంస్ధ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్ -ఓ.ఏ.ఎస్) సమావేశాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన ముప్ఫైకి పైగా దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. వారిలో ఒబామా ఒకరు. ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది…

mamata_cartoon

మమత ఫాసిస్టు పోకడ -కార్టూన్

మమత ఫాసిస్టు పోకడలు కొనసాగుతున్నాయి. తన పై గీసిన కార్టూన్ ను ఫార్వర్డ్ చేసినందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ను అరెస్టు చేయించింది. తన ప్రతిష్టను మసకబార్చడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ యధావిధిగా తన చర్యను సమర్ధించుకుంది. జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర, ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న సుబ్రత సేన్ గుప్తా లను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమత పరువు భంగం, మహిళ ప్రతిష్టకు మచ్చతేవడం, హేకింగ్ లాంటి సెక్షన్లను ప్రొఫెసర్ పై…

కొరియా స్లమ్ డాగ్ సింగర్ -వీడియో

చొయి సంగ్ బాంగ్. ఇప్పుడొక ఇంటర్నేషనల్ సెన్సేషన్. ‘కొరియాస్ గాట్ టాలెంట్’ షో లో అద్బుత ప్రతిభ కనబరిచి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన యువకుడు. నైట్ క్లబ్ లో పాటలు విని స్ఫూర్తి పొంది తనకు తాను పాడడం నేర్చుకున్నాడు. కష్టం చేసి సంపాదించిన డబ్బుతో అప్పుడప్పుడూ మ్యూజిక్ క్లాసులకు హాజరయ్యి తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. టాలెంట్ షో లో ఫైనల్స్ చేరుకుని రెండవ స్ధానం సంపాదించాడు. అనాధగా తీవ్ర కష్టాల్లో పెరిగిన నేపధ్యం ఉన్నప్పటికీ…

పెయింట్ వార్

జర్మనీలో స్కేటింగ్ హోళీ(?) -వీడియో

చూడబోతే వీళ్లకి మన హోళీ పండగే స్ఫూర్తి లాగుంది. ఎక్కడంటే అక్కడ స్కేటింగ్ చేసేస్తూ అందులో రంగుల్ని మిళితం చేశారు. నిజానికి ఇక్కడ స్కేటింగ్ అన్నది అప్రధానం. రంగుల హోళీ యే ప్రధానం. ఒంటి నిండా పొడి రంగులు నిలవ చేసుకుని ఎత్తు పల్లాల దగ్గర స్కేటింగ్ చేయడం ద్వారా ఆ రంగుల్ని గాలిలోకి వెదజల్లుతూ హోళీని స్ఫురింప జేశారు. వీరు చేస్తున్నది హోళీయో కాదో తెలియదు గానీ మనకు తెలిసింది అదే గనుక ‘హోళీ’ అనే…

తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి…

SRK at yale university

అమెరికా పొగరు: మరోసారి షారుఖ్ నిర్బంధం

అమెరికా తన పొగరు మరోసారి లోకానికి చాటుకుంది. రెండేళ్లలో రెండవ సారి షారుఖ్ ఖాన్ ను రెండు గంటలపాటు డిటెన్షన్ లోకి తీసుకుని ప్రశ్నించింది. షారుఖ్ ని పిలిచిన యేల్ యూనివర్సిటీ విద్యార్ధులు చెప్పాక, తమ కంప్యూటర్లు ఆయన పేరును ‘ఫ్లాగ్’ చేయడం వల్ల పొరబాటు దొర్లిందని న్యూయార్క్ ఎయిర్ పోర్టు అధికారులు తీరిగ్గా ‘అపాలజీ’ చెప్పారు. ఇలాంటి పోరాబాట్లు పదే పదే చేసి ఆనక ‘ఆపాలజీ’ చెప్పడం అమెరికాకి యాంత్రిక అలవాటుగా మారిందని భారత విదేశాంగ…

ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…