teluguvartalu

ఈనాడు లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్

సోమవారం (23.04.2012) నాటి ఈనాడు దిన పత్రిక తన పాఠకులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ ను పరిచయం చేసింది. ప్రతి సోమవారం విద్యార్ధులు, ఉద్యోగార్ధుల కోసం అందిస్తున్న ‘చదువు’ పేజీలో ఈ బ్లాగ్ ను పరిచయం చేసింది. సివిల్స్ లాంటి పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్దులు, ఉద్యోగార్ధులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ ఉపయోగకరంగా ఉందని తెలియజేసింది. – గత సంవత్సరం ఫిబ్రవరి 4 తేదీన ఈ బ్లాగ్ ప్రారంభం అయింది. ముఖ్యమైన…

ఫ్రాన్సు మొదటి రౌండ్ ఎన్నికల్లో అధ్యక్షుడు సర్కోజీకి రెండవ స్ధానం

ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మొదటి రౌండ్ ఎన్నికల్లో రెండవ స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే మొదటి స్ధానం చేజిక్కించుకున్నాడు. హాలండే కి 28 శాతం ఓట్లు రాగా, సర్కోజీకి 26 శాతం ఓట్లు వచ్చాయని బి.బి.సి తెలిపింది. అయితే హాలండే కి 28.63 శాతం ఓట్లు, సర్కోజీకి 27.18 ఓట్లు వచ్చాయని ‘ది హిందూ’ తెలిపింది. తీవ్ర మితవాది (far right) గా పత్రికలు అభివర్ణిస్తున్న మేరీన్ లీ పెన్ (నేషనల్…

‘బిక్రం సింగ్’ ఫైలు కోర్టుకి ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం కోర్టు

ప్రస్తుత ఆర్మీ చీఫ్ పదవీ విరమణ చేశాక తదుపరి చీఫ్ గా ప్రభుత్వం నిర్ణయించిన ‘లెఫ్టినెంట్ జనరల్ బిక్రం సింగ్’ కి చెందిన ‘కాన్ఫిడెన్షియల్ ఫైలు’ ని కోర్టు ముందుంచాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశిచింది. జస్టిస్ ఆర్.ఏం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన డివిజన్ బెంచి ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది. బిక్రం సింగ్ ను తదుపరి ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు…

ఇండియాలో టి.బి చావులు రోజుకి 1,000

భారత దేశ పాలకవర్గాలు సిగ్గుతో తల దించుకోవలసిన చేదు నిజం ఇది. ట్యూబర్కులోసీస్ (టి.బి) వ్యాధి బారిన పడిన భారతీయ రోగులు సరైన వైద్యం అందక రోజుకు 1,000 మంది చనిపోతున్నారు. మరే దేశంలోనూ ఇంతమంది టి.బి రోగులు మృత్యువాత పడడం లేదు. చనిపోతున్న టి.బి రోగుల్లో ప్రతి ఐదు నిమిషాలకు చనిపోతున్న ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని టి.బి వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్ధ టి.బి.ఎ.ఐ (ట్యూబర్కులోసీస్ అలర్ట్ ఇండియా) తెలియజేసింది.…

ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

వచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో…

అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…

అమెరికా సీక్రెట్ సర్వీస్ స్కాండల్ -మరిన్ని కార్టూన్లు

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అంగరక్షకులు తమ బాస్ రక్షణ కోసం కొలంబియా వెళ్లి ఎస్కార్ట్ మహిళలతో దొరికిపోయిన అంశం ఒబామా ఎన్నికల ప్రచారంలో పంటికింద రాయిలో తగులుతోంది. వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజలు ఒబామా భద్రతాధికారుల ప్రవర్తన పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్షుడు ఒబామాకి ఈ వ్యవహారం ప్రతికూలంగా పని చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఒబామా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడే తలియదు గానీ రాజకీయ కార్టూనిస్టులు మాత్రం వచ్చిన…

Saving Taxpayers money

ఖజానాపై భారం తగ్గించిన ఒబామా భద్రతాధికారులు! -కార్టూన్

కొలంబియాలో ఒబామా భద్రత కోసం వెళ్ళిన భద్రతా సిబ్బంది పన్నెండు మంది ‘ఎస్కార్ట్’ మహిళలతో ఉండగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ కాన్ఫరెన్స్ కోసం కొలంబియా లోని కార్టిజీనా నగరానికి కొద్ది రోజుల క్రితం ఒబామా వెళ్ళివచ్చాడు. స్ధానిక క్లబ్ లో తాగి అక్కడే మహిళలతో బేరం కుదుర్చుకుని తాము బస చేసిన హోటల్ కి తీసుకెళ్లారు. $800 ఇస్తానని చెప్పి ఉదయాన్నే $30 మాత్రమే ఇవ్వజూపడంతో ఒక మహిళ…

పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం

పాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది.…

$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు

ఒక రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి త్వరగా వెళ్ళిపోండి -అధ్యక్షుడు కర్జాయ్

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులు త్వరగా వెళ్లిపోవడం మంచిదని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కోరాడు. అమెరికా సైన్యం ఎంత త్వరగా దేశం నుండి వెళ్ళిపోయి రక్షణ బాధ్యతలు ఆఫ్ఘన్లకు అప్పగిస్తే అంత మంచిదనీ, అమెరికా సైనికుల వల్ల ఆఫ్ఘన్లకు కలుగుతున్న అవమానాలు అంతం కావాలంటే అదే ఉత్తమ మార్గమనీ గురువారం ప్రకటించాడు. తాలిబాన్ మిలిటెంట్ల మృత శరీరాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలు పరమ చీదరగా, అసహ్యంగా ఉన్నాయనీ వ్యాఖ్యానించాడు. “ఇటువంటి బాధాకరమైన అనుభవాలు అంతం కావాలంటే…

ఆఫ్ఘన్ల శరీర భాగాలతో ఫోటోలు దిగిన అమెరికా సైనికులు

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికా సైనికుల నీచ ప్రవర్తనకి హద్దు లేకుండా పోతోంది. దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆత్మాహుతి బాంబర్ల విడి శరీర భాగాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలను ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక ప్రచురించింది. ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వర్తించిన సైనికుడే తమకు ఆ ఫోటోలు అందించచాడని ఆ పత్రిక తెలిపింది. ఫోటోలు ప్రచురించవద్దని అమెరికా మిలట్రీ కోరినప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల ప్రవర్తన ఎలా ఉన్నదీ అమెరికా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో…

‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…

పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్

అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ…

ద్ర్యవ్యోల్బణం: హోల్ సేల్ 6.89%, రిటైల్ 9.47%

మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ…