జగన్ అరెస్ట్, సోమవారం బంద్

అక్రమాస్తుల కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సి.బి.ఐ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ అరెస్టు అయినట్లు 7:20 గంటలకు ఆయన పార్టీ నేతలు ప్రకటించారు. అరెస్టు కు ముందు పోలీసులు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ‘ది హిందూ తెలిపింది. అరెస్టయిన జగన్ ఈ రాత్రికి దిల్ కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంటాడని ఎన్.డి.టి.వి తెలిపింది. “సి.బి.ఐ జగన్ మోహన్ రెడ్డి ని 7:15 కి అరెస్టు చేసింది”…

నన్ను ఇరికించడానికి రక్షణ శాఖే నా లేఖ లీక్ చేసింది -ఆర్మీ ఛీఫ్

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖే తాను ప్రధాన మంత్రికి రాసిన లేఖను లీక్ చేసిందని ఆర్మీ ఛీఫ్ జనరల్ వి.కె.సింగ్ శనివారం ఆరోపించాడు. కొంత సమాచారాన్ని ఎంచుకుని మరీ లీక్ చేసి తనను ఇరికించాలని ప్రయత్నించిందని ఆరోపించాడు. మరో ఐదు రోజుల్లో రిటైర్ కానున్న వి.కె.సింగ్ తాజా ఆరోపణల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఢీ కొన్నట్లయింది. వివిధ టి.వి చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన న్యాయ వ్యవస్ధను కూడా తప్పు పట్టాడు. గాలివాటుతో పాటు తననూ…

మన్మోహన్, ప్రణబ్, ఇంకా 15 మంత్రుల అవినీతిపై విచారణ చేయాలి -టీం అన్నా

అన్నా బృందం బ్రహ్మాస్త్రం సంధించినట్లు కనిపిస్తోంది. సత్య సంధుడుగా యు.పి.ఏ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని’ ఆరోపించింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో పాటు మరో 13 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికను  ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఆధారంగా చూపింది. రిటైర్డ్ న్యాయమూర్తులతో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది. అన్నా బృందం ఆరోపణలను కాంగ్రెస్…

నిండా మునిగిన మన్మోహన్ కి చలే లేదు -కార్టూన్

అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అప ప్రధ మూట కట్టుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టడానికి సంకోచించడం లేదు. పెట్రోల్ ధరలు లీటర్ కి ఏకంగా రు. 7.54 లు పెంచడం ఆ కోవలోనిదే. ఓ పట్టాన దిగిరాని ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రజలకు ఉపశమనం చేకూర్చడానికి బదులు మరింత భారాన్ని మోపడానికే మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇరాన్ అణు బాంబు విషయంలో పశ్చిమ దేశాలు, ఇరాన్…

ఆఫ్ఘన్ ఫ్రెంచి బలగాలన్నీ ముందే ఉపసంహరణ

ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం…

ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది.  వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం…

అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది.…

లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్,…

మంత్రి మోపిదేవి అరెస్టు, జగన్ ముందస్తు బెయిల్ దరఖాస్తు

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చెప్పగా, ఐదు రోజుల కస్టడీకి అనుమతించినట్లు ఈ టి.వి తెలిపింది. మరో వైపు కీడు శంకించిన జగన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసినట్లు ఎన్.డి.టి.వి…

రెండో భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది.…

మొదటి భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

గత సంవత్సరం మార్చి 11 తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20 మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం, సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు…

కాలిఫోర్నియా సముద్ర మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్

అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో జపాన్ ఫుకుషిమా అణు ప్రమాదానికి చెందిన రేడియేషన్ చేరుకుందని వెల్లడయింది. ఫుకుషిమా దై-చి అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన నెల రోజులకే రేడియేషన్ అమెరికా తీరానికి వచ్చిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీనితో అనేక సంస్ధలు, పర్యావరణ ఉద్యమవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని తేలింది. ఫుకుషిమా ప్రమాదం అనంతరం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సి.ఎస్.యు), లాంగ్ బీచ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరంజ్ కౌంటీ, శాంతా క్రాజ్…

పెట్రోల్ వినియోగదారులపై చావు దెబ్బ, లీటర్ కి రు. 7.54 పై పెంపు

కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో సారి చావు దెబ్బ కొట్టింది. పెట్రోల్ ధరలు లీటర్ కి ఒకేసారి రు. 7.54 పైసలు పెంచింది. ఈ స్ధాయిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇదే మొదటి సారి. గతంలో రెండు సందర్భాల్లో లీటర్ కి రు. 5 రూపాయలు పెంచినా ఆ గీత ఎన్నడూ దాటలేదు. ఆరు నెలలు ఓపిక పట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ దెబ్బ ఒకేసారి వేసింది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్ కి రు.…

రికార్డు స్ధాయికి రూపాయి విలువ పతనం -కార్టూన్

గత కొద్ది నెలలుగా పతన దిశలో ఉన్న రూపాయి విలువ బుధవారం మరో రికార్డు స్ధాయికి పతనం అయింది. ఉదయం డాలరుకి రు. 55.52 పై లతో ప్రారంభమై సాయంత్రం 3 గంటల సమయానికి 74 పైసలు పతనమై రు. 56.13 పై లకు పతనం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో పక్క యూరో, యెన్ లతో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. అయితే స్వంత కారణాలవల్ల యూరో, యెన్ లు పతనం అవడమే దీనికి…

పెనుగొండలో హంపి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం, 25 మంది దుర్మరణం -ఫోటోలు

హుబ్లి-బెంగుళూరు హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ వద్ద ప్రమాదానికి గురయింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో 13 మంది మంటల్లో చిక్కుకుని చనిపోగా మిగిలినవారు గాయాలతో చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. 3 గంటలకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఇంజను వెనక ఉన్న బోగీకి నిప్పు అంటుకుని ఆ తర్వాత మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పెనుగొండ డి.ఎస్.పి కి కబురు అందిందనీ వెంటనే…