బి.జె.పి లుకలుకలు: అధ్యక్షుడి పై అద్వానీ అసంతృప్తి?

బి.జె.పి లో లుకలుకలు గణనీయ స్ధాయికి చేరినట్లు ఆ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.  బి.జె.పి జాతీయ కార్యవర్గం సమావేశాలు ముగిశాక గత శుక్రవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో అద్వానీ, సుష్మా పాల్గొనకపోవడం పై ఊహాగానాలు సాగుతుండగానే, అద్వానీ తన బ్లాగ్ ద్వారా తన అసంతృప్తిని మరోసారి వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ తెలిపింది. అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హయాంలో జరిగిన వివిధ తప్పులను ఎత్తిచూపుతూ పార్టీలో అంతర్మధనం అవసరమని అద్వానీ చెప్పినట్లు పత్రిక తెలిపింది.…

అమెరికా అభ్యంతరాలు పక్కకు నెట్టి ‘నార్త్-సౌత్ కారిడార్’ ముందడుగు

అమెరికా అభ్యంతరాలను పక్కకు నెడుతూ ‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్’ శరవేగంతో ముందుకు సాగుతోంది. ఉత్తర, దక్షిణార్ధ గోళాలను కలుపుతూ సాగే ఈ వాణిజ్య మార్గం చారిత్రాత్మక ‘సిల్క్ రోడ్’ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఇండియా, రష్యా, మధ్య ఆసియా ల మధ్య నెలపాటు ప్రయాణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్న కారిడార్ లో ఇరాన్ ది కీలక పాత్ర కావడంతో అమెరికాకి అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. కారిడార్ రూపకల్పనలో ఇండియా, ఇరాన్, రష్యాలు కీలక భాగస్వామ్యం…

ఇరాన్ ఆయిల్: ఇండియాపై దుష్ప్రచారం తగదు -నిరుపమ

ఇరాన్ క్రూడాయిల్ దిగుమతుల విషయంలో ఇండియా పై జరుగుతున్న ప్రతికూల ప్రచారం పనికి రాదని అమెరికాలో భారత రాయబారి నిరుపమా రావు అభ్యంతరం తెలిపారు. 120 కోట్ల మంది ప్రజల ఎనర్జీ అవసరాలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్న సంగతి గ్రహించాలని ఆమె అమెరికాకి పరోక్షంగా సూచించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామనీ, అమెరికా ఆంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులనూ తగ్గించామనీ ఆమె వివరించారు. ఇరాన్ క్రూడాయిల్ పట్ల…

విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి, ప్రధానితో అన్నా బృందం

ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్ నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. “తనపై కేశినా ఆరోపణలు ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు. మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు…

రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?

జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం…

జూలియన్ అస్సాంజ్: స్వీడన్ తరలింపుకు ఇంగ్లండ్ కోర్టు అంగీకారం

ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ ‘జూలియన్ అస్సాంజ్’ ను స్వీడన్ కు తరలించడానికి ఇంగ్లండు సుప్రీం కోర్టు అంగీకరించింది. జూలియన్ ను తమకు అప్పగించాలన్న స్వీడన్ ప్రాసిక్యూటర్ల కోరిక న్యాయబద్ధమేనని మెజారిటీ తీర్పు ప్రకటించింది. ‘రీ ట్రయల్’ కు జూలియన్ కోరవచ్చని తెలుస్తోంది. దానివల్ల తరలింపు మరింత ఆలస్యం అవుతుందే తప్ప ఆపడం జరగకపోవచ్చని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ పత్రికలు వ్యాఖ్యానించాయి. డిసెంబరు 2010 లో జూలియన్ బ్రిటన్ లో అరెస్టయ్యాడు. ఒక మహిళను రేప్…

ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ

ఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్…

ఇరాన్ ఆయిల్ కొనుగోళ్ళు పెంచిన దక్షిణ కొరియా

ఓ వైపు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించుకుంటుండగా ఇతర ఆసియా దేశాలు మాత్రం పెంచుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను దక్షిణ కొరియా 42 శాతం పెంచినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలను చైనాతో పాటు అమెరికా మిత్ర దేశం దక్షిణ కొరియా కూడా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోంది. కొరియా ప్రభుత్వ సంస్ధ ‘కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్’ మంగళవారం వెల్లడించిన గణాంకాలను ప్రెస్…

కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్

కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫిన్ తునా’ చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ సముద్ర జలాల్లో ఈదుతుండగా ఫుకుషిమా రేడియేషన్ కాలుష్యాన్ని గ్రహించిన తునా చేపలు అనంతరం కాలిఫోర్నియా తీరానికి వచ్చి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చేపల్లోని కాలుష్యం ప్రమాదకరం కాదనీ, అయితే వలస వెళ్ళే సముద్ర జీవుల ద్వారా కాలుష్యం ఎంతటి దూరానికైనా చేరవచ్చన్నదీ తమ పరిశోధన చెబుతోందని వారు తెలిపారు. మార్చి 11, 2011 తేదీన జపాన్ లో పెద్ద…

జగన్ చిరునవ్వు వెనక… -కార్టూన్

జగన్ జైలు వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. జగన్ అవినీతి అంతా ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వం ఫలితమే. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలోని ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన కీర్తిని ఆ పార్టీయే ఆయనకి ఆపాదించింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తేవడమే కాక కేంద్ర పార్టీకి 33 మంది ఎం.పిలను సరఫరా చేసిన కీర్తి కూడా వై.ఎస్.ఆర్ ఖాతాలోనే ఉంది. రాజశేఖర రెడ్డితో…

జైలుకు జగన్: ట్రయల్ ఖైదీ 6093

జగన్ బెయిల్ పిటిషన్ ను సి.బి.ఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎ.పుల్లయ్య తిరస్కరించాడు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించాడు. జగన్ అరెస్టు చట్ట విరుద్ధం అన్న జగన్ న్యాయవాదుల వాదనలను జడ్జి తిరస్కరించాడు. సాక్షులను భయపెట్టి, సాక్ష్యాలను తారుమారు చేయగల స్ధాయిలో జగన్ ఉన్నాడని భావిస్తూ ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండడమే సరైందని తీర్పు ప్రకటించాడు. జగన్ ను తమ కస్టడికీ ఇవ్వాలన్న సి.బి.ఐ కోరికను కూడా జడ్జి తిరస్కరించాడు. జూన్ 12 న ఉప…

రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా

రష్యాకు చెందిన ‘సుఖోయ్ సూపర్ జెట్ 100’ విమానం మే నెల మొదటి వారంలో ఇండోనేషియా కొండల్లో కూలి పోవడం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా మిలట్రీ గూఢచారి సంస్ధ జి.ఆర్.యు ఆరోపించిందని ప్రెస్ టి.వి తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడే చనిపోయారు. విమానానికి గ్రౌండ్ సిబ్బందికి ఉన్న సంబంధాన్ని అమెరికా గూఢచర్య సంస్ధలు తెంపేయడంతో విమానం ప్రమాదానికి గురయ్యిందని రష్యా తెలిపింది. “ఒక ఎయిర్ క్రాఫ్ట్ కీ గ్రౌండ్ సిబ్బందికీ మధ్య జరిగే…

అలో బి.బి.సి… నీ కిది తగునా?

సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ కు సంబంధించి పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు సిరియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి మరోసారి లోకానికి వెల్లడయింది. 2003 సంవత్సరంలో ఇరాక్ యుద్ధంలో తీసిన ఫోటోను ఆదివారం సిరియాలో జరిగిన హత్యాకాండగా చెప్పడానికి బి.బి.సి చేసిన ప్రయత్నం ‘ది టెలిగ్రాఫ్’ వెల్లడి చేసింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల ఆయుధ, ఫైనాన్స్ సాయంతో, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి మత ఛాందస ప్రభుత్వాల ప్రత్యక్ష మద్దతుతో సిరియా…

బ్రిటిషర్లకు పిల్లల్ని కని పెడుతున్న భారత తల్లులు

గర్భాన్ని అద్దెకు ఇచ్చే పరిశ్రమకు ఇండియా కేంద్రంగా మారుతున్నట్లు ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. భారత దేశంలో ఇపుడు 1000 కి పైగా క్లినిక్ లు బ్రిటిషర్లు తల్లిదండ్రులు కావడానికి సహాయం చేయడంలో స్పెషలైజేషన్ సాధించినట్లు సదరు పత్రిక కధనం వెల్లడించింది. 1.5 బిలియన్ పౌండ్ల కు (దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సమానం) ఈ వ్యాపారం అభివృద్ధి చెందిందని వెల్లడించింది. ఒక్కో జంట లేదా వ్యక్తి ఒక్కో బిడ్డకు సగటున 25,000 పౌండ్లు చెల్లిస్తున్నారని…

జగన్ అరెస్ట్, సోమవారం బంద్

అక్రమాస్తుల కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సి.బి.ఐ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ అరెస్టు అయినట్లు 7:20 గంటలకు ఆయన పార్టీ నేతలు ప్రకటించారు. అరెస్టు కు ముందు పోలీసులు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ‘ది హిందూ తెలిపింది. అరెస్టయిన జగన్ ఈ రాత్రికి దిల్ కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంటాడని ఎన్.డి.టి.వి తెలిపింది. “సి.బి.ఐ జగన్ మోహన్ రెడ్డి ని 7:15 కి అరెస్టు చేసింది”…