కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు

భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే…

‘ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి’ అన్నదెవరు?

“ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి” అన్నాడని ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ పైన పశ్చిమ దేశాల పత్రికలు, ఇజ్రాయెల్ తరచూ విషం కక్కుతుంటాయి. ఆయన ఎన్నడూ అనని మాటల్ని ఆయన నోటిలో కుక్కి అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు లాంటి దేశాలు ఇరాన్ పైన చేసే ఆధిపత్య దుర్మార్గాలకు చట్ట బద్ధతని అంటగట్టడానికి అవి నిత్యం ప్రయత్నిస్తుంటాయి. కెనడాకు చెందిన ప్రఖ్యాత పోలిటికల్ ఎకనమిస్టు ‘మైఖేల్ చోసుడోవ్ స్కీ’ ఇటీవల రాసిన పుస్తకం (Towards…

పాక్ లో ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన అమెరికా రాయబారులు

పాకిస్తాన్ పట్టణం పెషావర్ లో ఆయుధాలు అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు అమెరికా రాయబారులు సోమవారం పట్టుబడినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. పెషావర్ మోటార్ వే టోల్ ప్లాజా వద్ద రొటీన్ చెకింగ్ లో వీరు పట్టుబడ్డారు. ముగ్గురు అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీలో నాలుగు అస్సాల్ట్ రైఫిళ్ళు + 36 మ్యాగజైన్లు, మరో నాలుగు పిస్టళ్లు + 30 మ్యాగజైన్లు దొరికాయని పోలీసులను ఉటంకిస్తూ డాన్ తెలిపింది. టోల్ ప్లాజా వద్ద…

మన్మోహన్ సచ్ఛీలుడనే అనుకున్నా, కానీ… … -అన్నా హజారే

“నేను పత్రాలు చూశాను. నాకు అనుమానం ఉంది. నాకూ అనుమానాలు వచ్చాయి. ఆయన పరిశుభ్రమైన ప్రధాన మంత్రి నేను ఎల్లప్పుడూ భావించాను. కానీ ఫైళ్ళు చదివాక… అక్కడ ఏదో తప్పు జరిగింది.” ఇవీ అన్నా హాజరే మాటలు. “ఆయన సామాన్యమైన వ్యక్తి” అని రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కి సర్టిఫికేట్ ఇచ్చిన అన్నా హజారే సోమవారం అన్న మాటలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా, మన్మోహన్ ని సమర్ధిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్నీ,…

ఫాలక్, అఫ్రీన్… నేడు షిరీన్

మనుషుల్లో మృగత్వానికి అంతే లేకుండా పోతోంది. భర్త చేత విస్మరించబడి, మరో తోడు కోసం ఆశపడి వ్యభిచార కూపంలో చిక్కిన తల్లికి తనయగా పుట్టిన ఫాలక్, పురుషాధిక్య సమాజం క్రూరత్వానికి బలై రెండేళ్ల వయసులోనే కాటికి చేరి రెండు నెలలయింది. తండ్రికి అవసరం లేని ఆడపిల్లగా పుట్టి తండ్రి చేతుల్లో చిత్ర హింస అనుభవించిన మూడు నెలల అఫ్రీన్ మరణం ఇంకా మరుపులో జారిపోనేలేదు. మరో ఫాలక్, షిరీన్ పేరుతో ఇండోర్ ఆసుపత్రిలో చేరింది. షిరీన్ వయసు…

ఇండియా, చైనా: తమలపాకుతో నువ్వొకటి, తలుపు చెక్కతో నేనొకటి

దౌత్య రంగంలో ఇండియా, చైనాలు తలపడిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ‘తమలపాకుతో నేనొకటి’ అన్నట్లుగా ఇండియా ఒకటి చేస్తే, ‘తలుపు చెక్కతో నేనూ ఒకటి’ అని చైనా మరొకటి చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద కమోడిటీ వ్యాపార కేంద్రం అయిన ‘యివు’ కి ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఇండియా తన వ్యాపారులకు ‘ట్రావెల్ అడ్వైజరీ’ జారీ చేయగా, ఇండియా వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నందున అక్కడికి ప్రయాణం పెట్టుకునే ముందు పదిసార్లు ఆలోచించాలని చైనా ఏకంగా…

ఇళ్లపై కూలిన నైజీరియా విమానం, 153 మంది దుర్మరణం -ఫొటోలు

నైజీరియాలో లాగోస్ పట్టణంలో ప్రయాణికుల విమానం ఒకటి నివాస భవనాలపై కూలిపోవడంతో అనేక మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 153 మందీ చనిపోయారని నైజీరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ‘ది హిందూ’ తెలిపింది. నివాస భవనాల్లో చనిపోయినవారిని కూడా కలుపుకుంటె మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. నీటి లభ్యత తక్కువ కావడంతో మంటలు ఆర్పడం కష్టమైంది. బోయింగ్ విమానం కూలివడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో సమస్య వచ్చిందని…

‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

స్టక్స్ నెట్, ఫ్లేమ్: ‘ఇంటర్నెట్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -1

‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది.…

‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్

భారత దేశ ‘రాజకీయ వ్యవస్ధ’, ‘బ్యూరోక్రసీ’ ల అవినీతి పై ‘ఉద్యమాస్త్రం’ ఎక్కు పెట్టిన అన్నా బృందాన్ని విడదీసి తేలిక చేయడంలో ఇరు వ్యవస్ధలూ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా అన్నా బృందం తాజాగా ఆరోపణలు చేయగా, సదరు ఆరోపణలను అన్నాయే ఆమోదించడం లేదని ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే మన్మోహన్ పై ఆరోపణలను నమ్మలేకున్నాడు. స్వామి అగ్నివేశ్ తో సహా అనేకమంది బృందం సభ్యులు…

గాలికి బెయిలు కేసు: సి.బి.ఐ రాష్ట్ర వ్యాపిత దాడులు

రు. 10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని ‘గాలి జనార్ధన రెడ్డి’ కి సి.బి.ఐ కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేసిన కేసులో సి.బి.ఐ రాష్ట్ర వ్యాపితంగా దాడులు నిర్వహించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చినందుకు సి.బి.ఐ కేసుల కోసం నియమించబడిన ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి టి.పట్టాభి రామారావు గురువారం సస్పెన్షన్ కు గురయ్యాడు. హైద్రాబాద్, నాచారంలోని ఒక రౌడీ షీటర్, మరొక రిటైర్డ్ జడ్జిలు గాలి, జడ్జి ల మధ్య ఒప్పందం…

ప్రధాని పై సి.బి.ఐ విచారణ వృధా -అన్నా బృందం

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా…

దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా…

అమెరికా ‘నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ తెలుగమ్మాయి

అమెరికా లో నిర్వహించే ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ షిప్ ను ఈసారి తెలుగమ్మాయి ‘స్నిగ్ధ నందిపాటి’ గెలుచుకుంది. ప్రవాస భారతీయులు ఈ ట్రోఫీ గెలుచుకోవడం ఇది వరుసగా అయిదవసారి కావడం గమనార్హం. గత 14 సంవత్సరాలలో పది సార్లు ప్రవాస భారతీయులే ఈ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని ‘ది హిందూ’ తెలిపింది. తొమ్మిది మంది ఫైనలిస్టులలో అగ్రస్ధానం పొందిన స్నిగ్ధ 30,000 డాలర్ల (దాదాపు 16.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీతో పాటు…

ప్రశ్నించే నోరు మనదే ఐతే… -కార్టూన్

‘వడ్డించే వాడు మనోడే అయితే’ బంతిలో ఎక్కడ కూచున్నా అన్నీ అందుతాయన్నది సామెత. ‘ప్రశ్నించే నోరు మనదే అయితే, నచ్చిన సమాధానం చెప్పుకోవచ్చు’ అన్నది ఇప్పటి సామెత గా చేర్చుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన తామే నిరసన ప్రదర్శనలు చెయ్యడం ఎమిటి? బందులు హర్తాళ్ లు చేస్తూ ఆవేశకావేశాలు వెళ్లగక్కడం ఏమిటి? ఇక జనానికి సమాధానం చెప్పేదెవ్వరు? యు.పి.ఎ ప్రభుత్వం ఒకేసారి లీటర్ పెట్రో ధర రు. 7.54…