ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస

ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది. “ప్రపంచ…

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…

ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా రానున్న రెండేళ్లలో జర్మనీ AAA రేటింగ్ కోల్పోవచ్చని సంకేతం ఇచ్చింది. ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ గా చేసుకున్న 17 దేశాల యూరో జోన్ కూటమి నుండి గ్రీసు బైటికి వెళ్లిపోతుందన్న అంచనా తో పాటు…

అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం

గత బుధవారం ఒక మానసిక వికలాంగుడికి మరణ శిక్ష అమలు చేసిన అమెరికా ప్రభుత్వం సోమవారం మరో మానసిక రోగికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేయనుంది. ఫ్రాన్సు ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి లతో పాటు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి అమెరికా ససేమిరా అంటోంది. మూడు విడతల మిశ్రమ డోసులో ఇంజెక్షన్స్ ఇచ్చి నెమ్మదిగా ప్రాణం తీసే మామూలు పద్ధతి కాకుండా మొదటిసారిగా ఒకే ఒక్క కొత్త విషం…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…

పెట్టుబడిదారుల అక్రమ డబ్బు రు. 1155 లక్షల కోట్లు

ప్రపంచ దేశాలన్నింటికీ చెందిన ధనికులు దాచిన అక్రమ సొమ్ము విలువ 21 ట్రిలియన్ డాలర్లని ‘టాక్స్ నెట్ వర్క్ జస్టిస్’ (టి.ఎన్.జె) సంస్ధ చెప్పింది. ఈ సొమ్ము 1155 లక్షల కోట్ల రూపాయలకి (1 ట్రిలియన్ = లక్ష కోట్లు, 1 డాలర్ = 55 రూపాయలు) సమానం. ఇది కేవలం కనీస మొత్తం (conservative estimates) మాత్రమే. వాస్తవ మొత్తం 32 ట్రిలియన్ డాలర్లు (రు. 1760 లక్షల కోట్లు) ఉండవచ్చని సదరు సంస్ధ తెలిపింది.…

ఫుకుషిమా: రేడియేషన్ రీడింగ్ తగ్గించి చూపిన కంపెనీలు

ఫుకుషిమా ప్రమాదం అనంతరం కర్మాగారంలో రేడియేషన్ విడుదల స్ధాయిని తగ్గించి చూపేందుకు కంపెనీ ప్రయత్నించిందని బి.బి.సి వెల్లడించింది. కర్మాగారంలో పని చేస్తున్న వర్కర్లకు అమర్చిన డొసి మీటర్లు వాస్తవ రేడియేషన్ స్ధాయిని చూపించకుండా ఉండేందుకు మీటర్లను లెడ్ కవచాలతో కప్పి ఉంచాలని కంపెనీ అధికారులు వర్కర్లకు ఆదేశాలిచ్చిన సంగతిని పత్రికలు వెల్లడి చేశాయి. వర్కర్లు నివాసం ఉండే డార్మీటరీలో కంపెనీ అధికారి ఒకరు ఆదేశాలిస్తుండగా వర్కర్లు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఫుకుషిమా ప్రమాద తీవ్రతను…

పాక్ సాయంలో భారీ కోతకు ఆమోదించిన అమెరికా కాంగ్రెస్

పాకిస్ధాన్ కి ఇస్తున్న సాయంలో భారీ కోత విధించడానికి అమెరికా సిద్ధపడుతునంట్లు కనిపిస్తోంది. 650 మిలియన్ డాలర్ల కోత విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ కి మెజారిటీ సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో సీనియర్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘టెడ్ పో’ ప్రవేశ పెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. పాకిస్ధాన్ ను అమెరికా విప్లవంలో విద్రోహిగా ముద్ర పడిన “బెనెడిక్ట్ ఆర్నాల్డ్” గా ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడొకరు…

ఆత్మీయ ‘ఉత్తరం’ ఇప్పుడెక్కడ?

పోస్టు కార్డు, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్… ఒకప్పుడు భారత దేశ వ్యాపితంగా మనుషులను, మనసులను కలిపింది ఈ మూడే. నిత్యం లక్షలాది చేతి రాత ఉత్తరాలు రైళ్లల్లో, బస్సుల్లో తూనీగల్లా దూసుకు వెళ్ళేవి. వీధి వీధినా, సందు సందునా సైకిళ్లపై పడుతూ లేస్తూ పోయే పోస్ట్ మేన్ గారి ‘పోస్ట్’ అన్న కేకతో గడప గడపలో చురుకు పుట్టేది. ప్రయాణించేది రైళ్లలో, బస్సుల్లోనే అయినా ఉత్తరం రాశామన్న సంతృప్తి నుండి, ఉత్తరం రావాలన్న ఎదురు చూపుల వరకూ…

అమెరికాలో కరువు, గత పాతికేళ్లలో ఇదే తీవ్రం

గ్లోబల్ వార్మింగ్ కు అన్ని దేశాల కంటే అధికంగా కారణంగా నిలిచిన అమెరికా ఫలితం అనుభవిస్తోంది. అనావృష్టి వలన గత పాతికేళ్ళలోనే అత్యంత తీవ్రమైన స్ధాయిలో కరువు ఏర్పడిందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపాడు. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బ తిని ఆహార ద్రవ్యోల్బణం తీవ్రం కానున్నదని అమెరికా వ్యవసాయ కార్యదర్శి టాం విల్సక్ బుధవారం పత్రికల సమావేశంలో చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. విస్తార ప్రాంతాల్లో మొక్క జొన్న, సోయా బీన్స్ లాంటి…

ఒంటి కాలి ఆత్మ స్థైర్యం ఈ పెద్దాయనది

కష్టాల కడలి ఈదడానికి ఆత్మ స్ధైర్యానికి మించింది లేదని పాతికేళ్ళ తిరుపాలు ఒంటికాలి జీవితం ప్రత్యక్ష సాక్ష్యం. ఈనాడు పత్రిక వెలికి తీసిన ఈ మట్టి మనిషి నిరోశోపహతులకు స్ఫూర్తి ప్రదాత అనడంలో సందేహం లేదు. రాజస్ధాన్ కృత్రిమ అవయవ తయారీ గురించి బహుశా ఇతనికి తెలియదో లేక ఖర్చు భరించలేకపోయాడో తెలియదు గానీ వడ్రంగి చేసిచ్చిన చేతి కర్ర ఇతనికి మరోకాలుగా మారిపోయింది. పాతికేళ్ళ శ్రమ జీవితంలో ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా పూర్తి చేసి…

అమెరికా చెబుతున్నది అబద్ధం -భారత జాలర్లు

కాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశామని అమెరికా చెబుతున్నది ఒట్టి అబద్ధమని దుబాయ్ తీరంలో అమెరికా సైనికుల కాల్పుల్లో గాయబడిన భారత జాలర్లు ‘ది హిందూ’ కు తెలిపారు. యు.ఏ.ఇ కి చెందిన కంపెనీలో పని చేస్తున్న భారత జాలర్లపై అక్కడి అమెరికా సైనిక స్ధావరానికి చెందిన సైనికులు కాల్పులు జరపడంతో ఒక భారతీయ జాలరి చనిపోగా, మరో ముగ్గురు జాలర్లు గాయపడ్డారు. కాల్పులకు ముందు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశామనీ వినకపోవడంతో కాల్చారని అమెరికా చెబుతుండగా…

కంపల్సరీ లైసెన్స్ ఫలితం, 2.8 లక్షల కేన్సర్ ఔషధం ఇప్పుడు 9 వేలే

ప్రపంచ మార్కెట్ లో 2.8 లక్షల రూపాయల ఖరీదు చేసే ఔషధాన్ని కేవలం 9 వేల రూపాయలకే భారత దేశ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లో భాగమైన ట్రిప్స్ (Trade Related Intellectual Property Rights) ఒప్పందం ప్రకారం ఒక కంపెనీ పేటెంటు పొందిన ఔషధాన్ని మరొక కంపెనీ తయారు చేయరాదు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖరీదుకు మందులు తయారు చేయగలిగినా ట్రిప్స్ ఒప్పందం దానిని నిషేధిస్తుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి…

దుబాయ్ తీరంలో భారత జాలర్లను కాల్చి చంపిన అమెరికా సైనికులు

దుబాయి తీరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన సైనికులు ఒక భారత జాలరిని కాల్చి చంపారు. మరో ముగ్గురు జాలర్లను తీవ్రంగా గాయపరిచారు. హెచ్చరికలు లెక్క చేయకుండా ఒక చిన్న బోటు ‘యు.ఎస్.ఎన్.ఎస్ ర్యాపేహనోక్’ ఓడ వైపుకి వేగంగా దూసుకు వచ్చిందనీ, దానితో రక్షణ కోసం కాల్పులు జరపక తప్పలేదనీ బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్ధావరం (ఫిఫ్త్ ఫ్లీట్) ప్రతినిధి ప్రకటించాడు. చనిపోయినవారు, గాయపడ్డవారు భారతీయులేనని అమెరికా ధ్రువపరిచిందని ‘ది హిందూ’ తెలిపింది. దుబాయ్ లోని…