తెలంగాణ ఎక్కడ? -కార్టూన్

“తెలంగాణా! అదెక్కడుంది?” కేంద్ర సచివుడు వయలార్ రవి కొద్ది రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇది. కేంద్రంలో తిష్టవేసి, ఆంధ్ర దొరల డబ్బు కట్టలు మేస్తూ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షలను చెద పురుగుల్లా కొరికేస్తున్న అవినీతి కీటకాలు ఇలాంటి గుడ్డితనాన్ని ఇప్పటికి చాలా సార్లు ప్రదర్శించాయి. వీరి అంధత్వాన్ని గేలి చేస్తూ తెలంగాణ ప్రజలు పదే పదే ఆందోళనలు నిర్వహించి తెలంగాణ ఎక్కడుందో చాచికొట్టినట్లు చెప్పినా కళ్ళు తెరవడానికి వీరు నిరాకరిస్తున్నారు. పోలీసులు, పారా మిలటరీ…

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా…

ప్రజాస్వామ్యం నవ్వులపాలు, సాగరహారం వర్షం పాలు

‘తెలంగాణ మార్చ్’ మరో సీరియస్ ఉద్యమంగా మారకుండా వర్షం అడ్డుపడడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బతికిపోయింది. మార్చ్ కి అనుమతించినట్లే అనుమతించి పోలీసులతో ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగించడం ద్వారా మార్చ్ ని విఫలం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించడంతో రాజకీయ ఐకాస నాయకత్వం ఆగ్రహించింది. ప్రభుత్వం, పోలీసుల మోసానికి ప్రతిగా సాయంత్రం 7 గంటల లోపు మార్చ్ ముగిస్తామన్న హామీని రద్దు చేసుకుని, రాత్రంతా కొనసాగించనున్నట్లు ఐ.కా.స నాయకులు ప్రకటించారు. వర్షం వస్తున్నప్పటికీ మార్చ్ కొనసాగిస్తామని…

ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే

షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలనుండి యూనివర్సిటీ లాంటి ఉన్నత చదువుల వరకూ రాలేకపోతున్నారని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో తెలిసింది. ఇతర వెనుకబడిన కులాల విద్యార్ధులు వారి జనాభా దామాషాలోనే ఉన్నత స్ధాయి చదువుల వరకూ రాగలుగుతున్నారనీ, కానీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన విద్యార్ధులలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నతస్ధాయి చదువులకు చేరగలుగుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది.…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…

కూడంకుళం: ‘ఇదింతకరై’ లో అప్రకటిత ఎమర్జెన్సీ -నిజ నిర్ధారణ నివేదిక

కూడంకుళంలో మత్స్యకారుల శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్రాల సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూర నిర్బంధ విధానాలు స్వతంత్ర పరిశీలకుల ద్వారా మరోసారి వెల్లడైనాయి. కూడంకుళం అణు కర్మాగారంలో అణు ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా సెప్టెంబరు 10 తేదీన సముద్రతీర గ్రామ ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు అమానుష నిర్బంధాన్ని ప్రయోగించారనీ పిల్లలు, స్త్రీలపై కూడా బలప్రయోగం చేశారనీ, మైనర్ పిల్లలపై దేశ ద్రోహం నేరం మోపి బాలల ఖైదుకి పంపారని నిజనిర్ధారణ కమిటీ…

కాంగ్రెస్ పడవ మునిగేదే, మరి బి.జె.పి పడవ? -కార్టూన్

‘కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం మునిగిపోతున్న పడవ’ అని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఉవాచ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా గడ్కారీ ప్రకటించాడు.  బి.జె.పి జాతీయ కార్యవర్గంలో మాట్లాడుతూ గడ్కారీ చెప్పిన ఈ మాటలు వాస్తవంలో నిజం కాదని పత్రికల ఏకాభిప్రాయం. బి.జె.పి నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ వరుస ప్రజావ్యతిరేక సంస్కరణలతో బరితెగించేదేనా అన్నది పత్రికల వాదన. ఆ మాట కొంత నిజమే అయినా సంస్కరణల పట్ల బి.జె.పి…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

మరోసారి పోరాట పధంలో గ్రీసు ప్రజలు, కార్మిక సంఘాలు

గ్రీసు ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం పట్ల ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. త్రయం (troika) గా పిలిచే యూరోపియన్ యూనియన్ (ఇ.యు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా విధించిన నూతన షరతులను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం పట్ల దేశవ్యాపిత నిరసనలకు పూనుకున్నారు. త్రయం ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం విధించ తలపెట్టిన 11.5 బిలియన్ యూరోల (15 బిలియన్ డాలర్లు) కోతలను మూకుమ్మడి నిరసన…

చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల…

12 మృగాలు దళిత బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి…

మృగాలు సైతం చీదరించుకునే మానవ మృగాల అకృత్యం హర్యానాలో వెలుగు చూసింది. కోరిక తీర్చమన్న మృగ సమానుడి వికృత తృష్ణను నిరాకరించినందుకు 11 మంది సో కాల్డ్ అగ్రకుల మృగాలబారిన పడి సామూహిక అత్యాచారానికి గురయింది. వేంపైర్ రక్తం అవసరం లేని తోడేళ్ళు తమ నీచ కృత్యాన్ని వీడియో తీసాయి. అత్యాచారం విషయం బైటికి చెబితే వీడియో అందరికీ పంచుతామని, చంపేస్తామనీ బెదిరించాయి. ఫలితంగా 16 సంవత్సరాల దళిత బాలిక అత్యాచారం గురించి కుటుంబానికి కూడా చెప్పుకోలేక…

ఎన్నికల వ్యవస్ధల్లో వెనిజులా బెస్ట్, అమెరికా వరస్ట్ -జిమ్మీ కార్టర్

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అమెరికా రాజకీయ నాయకులకు నచ్చని వాస్తవం చెప్పాడు. వెనిజులాలో ఉన్న ప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఆయన కీర్తించాడు. డబ్బే పరమావధిగా నడుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోని వరస్ట్ వ్యవస్ధల్లో ఒకటని కూడా ఆయన ప్రకటించాడు. 2002లో అమెరికా ప్రేరేపిత కుట్రను వెనిజులా ప్రజలు వీరోచితంగా తిప్పి కొట్టినప్పటినుండీ వెనిజులాను శత్రువుగా ప్రచారం చేస్తున్న అమెరికా రాజకీయ వ్యవస్ధకు జిమ్మీ కార్టర్ వెల్లడిచిన వాస్తవం ఒక షాక్…

కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్

“నా పేరు వాడుకోవద్దు, నా ఫోటో పెట్టొద్దు” అని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ని హెచ్చరించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి సన్నిహిత సహచరుడుగా పేరుపడిన అరవింద్ కేజ్రీవాల్ కి అన్నా హెచ్చరిక శరాఘాతం లాంటిది. ‘అన్నా బృందం’ పేరుతో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధ కింద సాగిన ఉద్యమానికి అన్నా ముందు నిలబడినప్పటికీ ఉద్యమానికి అవసరమైన రోజువారీ వ్యవహారాలను చూసింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే నని అప్పట్లో పత్రికలు ఘోషించాయి. అదే నిజమయితే…

భేదాభిప్రాయాలు సహజం, సత్యాన్వేషణే అంతిమ లక్ష్యం!

(ఇది చందుతులసి గారి వ్యాఖ్య. మరో వ్యాఖ్యాత చందు గారితో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం. సమస్యను విభిన్న కోణంలో చూస్తారని చందుగారిని అభినందిస్తూ, భేదాభిప్రాయాలను ఎలా చూడవచ్చో, చూడాలో చెప్పిన అమూల్యాభిప్రాయం.  నచ్చని అభిప్రాయాలను కూడా గౌరవంగా ఎలా చూడవచ్చో క్లుప్తంగా ఈ నాలుగు మాటలు వివరిస్తున్నాయి. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరింత వెలుగు కోసం టపాగా మారుస్తున్నాను. -విశేఖర్)                        ***                                           ***                                             *** మనందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది.…