మా దేశంలో రక్తపాతానికి టర్కీ ఆపాలజీ చెప్పిందా? -సిరియా

టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి…

కమలమే హస్తమా? -కార్టూన్

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో…

అమరనాధ్ హిందూ భక్తి యాత్రను మోసేది కాశ్మీర్ ముస్లింలే -ఫోటోలు

కాశ్మీరీ జాతి స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పరితపించే కాశ్మీరీలను వేర్పాటువాదులుగా ముద్ర వేసి ద్వేషించడం హిందూ మతోన్మాదులకు పరిపాటి. తమ వర్తమానం, భవిష్యత్తు తమకే అప్పజెప్పాలని కోరే కాశ్మీరీ యువకులను టెర్రరిస్టులని చెప్పి కరకు తుపాకులకు బలి చేయడం భారత మిలట్రీ దశాబ్దాలుగా సాగిస్తున్న దుశ్చర్య. హిందూ మతోన్మాదం తమ ప్రజాస్వామిక ఆకాంక్షలపై విద్వేషం వెళ్లగక్కుతున్నప్పటికీ అమర్ నాధ్ హిందూ భక్తి యాత్రీకులను కాశ్మీరీ యువతే తమ భుజస్కందాలపై మోసి గమ్యం చేర్చే సంగతి చాలా…

డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్

సోనియా గాంధీ అల్లుడి గిల్లుడి పై దృష్టి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన స్వరాన్ని మరింత పెంచాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించకుండా స్ధిరాస్తి కంపెనీ ‘ఢిల్లీ లాండ్ అండ్ ఫైనాన్స్’ (డి.ఎల్.ఎఫ్) కి దళారీగా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భారత దేశానికి అనధికారిక ప్రధమ కుటుంబంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అభివర్ణించే సోనియా కుటుంబ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అయాచిత లబ్ది చేకూర్చిన డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా రాష్ట్ర…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత…

చైనా కంపెనీలతో దేశ భద్రతకి ప్రమాదం, అమెరికా కమిటీ హెచ్చరిక

చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలతో జాతీయ భద్రతకి ప్రమాదం కలగవచ్చని అమెరికా కమిటీ ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా ప్రఖ్యాత టెలీ కంపెనీలయిన హువి, జెడ్.టి.ఇ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. అమెరికా కంపెనీల స్వాధీనం, విలీనాల నుండి ఈ రెండు కంపెనీలను నిషేధించాలని సిఫారసు చేసింది. కాగా, తమ సిఫారసుకు కమిటీ చూపిన కారణం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. చైనా ప్రభుత్వంతోనూ, మిలటరీతోనూ తమకు సంబంధం లేదని రుజువు…

ఈ దళిత మహిళల ఆత్మగౌరవం మహోన్నతం

భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవాలు దేశంలోని కోట్లాది శ్రమజీవుల్లో ఉన్నాయి తప్ప డాలర్ల కోసం దేశ సరిహద్దులు దాటడానికి అవలీలగా సిద్ధపడేవారిలోనో, తెల్లరాజ్యాల పౌరసత్వం కోసం అర్రులుచాచే బుద్ధి జీవుల్లోనో లేదని దళిత మహిళలు అక్కు, లీల లు చాటి చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల పౌరసత్వం సంపాదిస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరపడే కొద్ది బుద్ధుల అల్పజీవులు, దశాబ్దాల బెత్తెడు వేతన జీవనంలోనూ నిలువెత్తు ఆత్మ గౌరవాన్నీ త్యజించలేని అక్కు, లీలలను చూసి నిష్కళంక హృదయాలతో సిగ్గుపడవచ్చు. లేదంటే…

అమెరికా నిరుద్యోగం నిజంగానే తగ్గిందా?

సెప్టెంబర్ లో అమెరికా నిరుద్యోగం 8.1 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి.ఎల్.ఎస్) రెండు రోజుల క్రితం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బి.ఎల్.ఎస్ ప్రకటించడంతోటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు సంతోషాన్ని ప్రకటించాయి. అమెరికా నిరుద్యోగం తగ్గినందుకు ఆశ్చర్యానందాలని ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ల లాభాల్ని కూడా ఉపాధి నివేదికకి ఆపాదించి సంతృప్తి చెందాయి. అనుకోకుండా శుభవార్త విన్నామని శీర్షికలు పెట్టి మంచి రోజులు రానున్నాయని అమెరికా…

శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు

సిరియాపై అమెరికా ప్రత్యక్ష దురాక్రమణ దాడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల అండతో 18 నెలలుగా సిరియా ప్రజలపై టెర్రరిస్టులు సాగిస్తున్న మారణకాండ అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యక్ష జోక్యానికి సాకులు వెతుకుతున్న నాటో కూటమి తానే ఒక సాకును సృష్టించుకుంది. టర్కీ భూభాగం నుండి సిరియాలోకి చొరబడిన టెర్రరిస్టులు టర్కీ పైకే జరిపిన దాడిని అడ్డు పెట్టుకుని సిరియాపై ఆయుధ దాడికి టర్కీ (నాటో సభ్యురాలు) మిలట్రీ తెగబడింది. ఇరాక్ పై…

లెట్రిన్ లు కడిగే ఈ దళిత మహిళల నెలజీతం 15/-

అక్కు, లీల అనే ఇద్దరు దళిత మహిళలు 42 సంవత్సరాలుగా లెట్రిన్ లు కడుగుతున్నారు. వీరి నెల వేతనం అప్పుడూ, ఇప్పుడూ 15 రూపాయలే. కోర్టుకి వెళ్ళినందుకు ఆ 15 రూపాయలు కూడా చెల్లించడం మానేశారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హై కోర్టు, చివరికి సుప్రీం కోర్టు కూడా మహిళలకు అనుకూలంగా తీర్పులిచ్చి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించాయి. కోర్టు ధిక్కారం నోటీసులు అందుకున్నాక కూడా, తీర్పులను అమలు చేయకపోగా, రిటైర్ మెంట్ వయసుకి…

అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి -అధ్యయనం

అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్…

దేశ దేశాల్లోని రైతు భాష ‘శ్రమే’ -ఫోటోలు

ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా రైతు కూలీలకి తెలిసిన భాష ‘శ్రమ’ ఒక్కటే. కొండలనుండి గడ్డిమోపులు దింపే స్విస్ రైతయినా, జొన్న చేలో కలుపు తీసే సత్నాపూర్ పేద రైతయినా వొళ్ళు వంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించవలసిందే. ఇండియానాలో బ్లూ బెర్రీ ని తుంచి పోగు చేసే పెద్దా పిన్నా అయినా, బోర్డీక్స్ (ఫ్రాన్స్) లో ద్రాక్ష గుత్తుల్ని తెంచే ఆడా మగా అయినా సిగలు ముడేసి, నడుం బిగించి చెమట చుక్కలతో పుడమితల్లిని…

కేంద్ర మంత్రి జైస్వాల్ కి ముసలి భార్యపై మోజు తగ్గిందట!

కేంద్ర బొగ్గు మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తానింకా ప్రాచీన యుగాల్లోనే మగ్గుతున్నానని చెప్పుకున్నాడు. వివాహ బంధాన్ని క్రికెట్ మ్యాచ్ తోనూ, భార్యలని కాలక్రమేణా మోజు తగ్గిపోయే విజయాలతోనూ పోల్చి తన ఫ్యూడల్ బుద్ధి చాటుకున్నాడు. వయసు పెరిగిన భార్యలపై మోజు కోల్పోయే పురుష పుంగవుల వక్రబుద్ధికి ఆమోద ముద్ర వేసేశాడు. భార్య అంటే మనసు, మెదడు, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ కాదనీ, కేవలం మగ శరీరాలకి సుఖాల్ని పంచే మాంసపు ముద్దలేననీ ‘మనసులో మాట’ బయట పెట్టాడు.…

సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా కొత్త కుట్ర

సిరియా కిరాయి తిరుగుబాటు ఎంతకీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ప్రత్యక్ష దాడికి అమెరికా కొత్త మార్గాలు వెతుకుతోంది. రష్యా జోక్యంపై అబద్ధాలు సృష్టించి ఆ సాకుతో తానే ప్రత్యక్షంగా రంగంలో దిగడానికి పావులు కదుపుతోంది. జులైలో సిరియాలో జొరబడిన టర్కీ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేయడం వెనుక రష్యా హస్తం ఉందంటూ తాజాగా ప్రచారం మొదలు పెట్టింది. సిరియా కిరాయి తిరుగుబాటుకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్న సౌదీ అరేబియాకి చెందిన చానెల్ ఆల్-అరేబియా ఈ…

మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది.  వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. “రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు…