హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

అమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001…

కూతురు ప్రశ్న–హృద్యమైన కవిత

కూతురు ప్రశ్న -రచన: నాగరాజు ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను దిగంతాలకు పరిచినట్టో ఒక దృగ్విషయపు లోతులకు దూకి పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ నేర్చుకుంటున్న…

రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 7, 2012 తేదీన మొదటిసారి ఈ బ్లాగ్ లో ప్రచురితమయింది. అమానత్ విషాదాంతం సందర్భంగా అత్యాచారాల విషయంలో ఢిల్లీ పోలీసుల దృక్పధం ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోవడానికి తేదీ మార్చి మళ్ళీ ప్రచురిస్తున్నాను. భారత సమాజాన్నీ, సంస్కృతినీ ఇలాంటి పుచ్చిపోయిన మెదళ్లు శాసిస్తూ, రక్షకులుగా ఉన్నంతవరకూ అత్యాచారాలు ఆగవనీ, దోషులందరికీ తగిన శిక్షలు పడవనీ తేలికగానే అర్ధం అవుతుంది -విశేఖర్) – “ఆవిడే కోరి వెళ్ళింది” “అంతా డబ్బు కోసమే” “ఇదో వ్యాపారం…

మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…

అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?

(ఈ టపా దీనికి ముందరి టపా కింద మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాఠకులు గ్రహించగలరు) – స్త్రీవాదిననీ, మార్క్సిస్టుననీ చెప్పే మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా తన అభిప్రాయాలతో ఏకీభవిస్తేనే స్త్రీవాది మరియు మార్క్సిస్టు అవుతారన్నట్లుగా చెప్పడం ఇంకా అభ్యంతరకరంగా ఉంది. మిత్రుడు చెప్పిందాన్నిబట్టి చూస్తే, ఆయన దృష్టిలో డేటింగ్ అంటే శారీరక సంభోగమే తప్ప మరొకటి కాదు. స్త్రీలు డేటింగ్ చేయడం తనకి నచ్చదు. ఒక…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…

ముచ్చటైన జంట! ఆమె 6′ 8", అతడు 5′ 4" -ఫోటోలు

ఆమె పేరు ఎలిసాని డ క్రజ్ సిల్వా, వయసు 17. అతని పేరు ఫ్రాన్సినాల్డో డ సిల్వా కర్వాలో, వయసు 22. సామాజికంగా అమ్మాయి, అబ్బాయిల ఎత్తు పట్ల నెలకొని ఉన్న అభ్యంతరాలను త్రోసిరాజని వీరిద్దరూ జంట కట్టారు. అందుకే వారు ముచ్చటైన జంట! ఇంకా పెళ్లి కాలేదు గానీ ఆ ఆలోచనలో ఉన్నారు. ఈ బ్రెజిల్ అమ్మాయికి పిట్యూటరీ గ్రంధిలో ట్యూమర్ ఏర్పడడంతో అనూహ్యంగా ఎదిగిపోయి 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుకు చేరుకుంది. డాక్టర్లు…

‘వన్ డే’ లనుండి సచిన్ రిటైర్మెంట్, ఒక పరిశీలన -కార్టూన్

(కార్టూన్: ది హిందూ నుండి) – 50 ఓవర్ల పరిమిత క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా విరమించుకుంటున్నట్లు భారతీయుల ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో ఆయన 50 సెంచరీలు పూర్తి చేసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరకుండానే వన్ డే ఆట నుండి తప్పుకుంటున్నట్లు సచిన్ ప్రకటించడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించినా శ్రేయోభిలాషులైన క్రికెట్ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించాక సచిన్…

దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు

కులవ్యవస్ధ అణచివేత తన వాస్తవ రూపంలోనే కొనసాగుతున్నదని కర్ణాటకలో జరిగిన ఘటన రుజువు చేస్తున్నది. సంప్రదాయక కులాచారం ప్రకారం దండోరా వెయ్యడానికి నిరాకరించాడని 38 సంవత్సరాల రంగస్వామిని అగ్రకులస్ధులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొట్టాక కూడా దండోరా వేయడానికి ఒప్పుకోకపోతే అతని ఇద్దరు కూతుళ్లను కూడా కొడతామనీ, వారికి ప్రమాదం కలగజేస్తామనీ బెదిరించారు. రోజువారీ కూలి చేసుకుంటూ బతికే రంగస్వామి అగ్రకులజుల కులాధిపత్య దాడికి బలై చెన్నరాయపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. తన భర్తను అగ్రకుల పెత్తందారులు చెట్టుకు…

బాధితురాలి తెగువ, ధైర్యం అపూర్వం -డాక్టర్లు

“ఆమె గొప్ప ధైర్యవంతురాలు. తనపై దాడి జరిగిన మొదటి క్షణం నుండి ఈ రోజువరకూ పోరాడుతూనే ఉంది” ఈ మాటలన్నది సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.డి.అధాని. బాధితురాలిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్ల ప్రకారం లైంగిక అత్యాచారం జరిగిన కేసుల్లో ఇంత తీవ్రమైన, లోతైన, బాధాకరమైన గాయాలను మరే కేసులోనూ వారు చూడలేదు. పెద్ద పేగు మొత్తాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు కొన్ని పత్రికలు చెబుతుండగా గాంగ్రీన్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించినట్లు…

ఢిల్లీ వీధుల్లో మగమృగాలు, మరణశయ్యపై గ్యాంగ్ రేప్ బాధితురాలు

దేశ చరిత్రను ఆడపిల్లల కన్నీళ్లతో రాయవలసిన దుర్దినాలు వర్ధిల్లుతున్నాయి. ఒక్కో మానభంగం ఒక్కో కొత్త అధ్యాయానికి అర్హత పొందుతూ పశుత్వ ప్రదర్శనలో కొత్త రికార్దులు సృష్టిస్తున్నాయి. దేశరాజధానే అందుకు నిరంతరవేదికగా మారిపోయింది. 23 సంవత్సరాల పారమెడికల్ విద్యార్ధిని ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన దారుణం సభ్యసమాజం శాశ్వత వంధత్వం కోరుకునేదిగా ఉంది. మగ మృగాల పశుత్వాన్ని ప్రతిఘటించినందుకు పొత్తికడుపులో పిడి గుద్దులు ఎదుర్కొని పేగులు చితికిపోయి చావుబతుకుల మధ్య ఒక ఆడపిల్ల కొట్టుమిట్టాడుతోంది. ఆమెను…

జసింత సల్దానా ఆత్మహత్య, మరి కొన్ని వివరాలు

జసింత సల్దానా ఆత్మహత్యపై మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియా రేడియో ‘2డే ఎఫ్.ఎం’ జాకీలు రెండోసారి ఆసుపత్రికి ఫోన్ చేసినప్పుడు కూడా జసింతయే దానిని అందుకున్న విషయం, ఆత్మహత్యకు ముందు రాసిన మూడు లేఖల్లోని ఒకదానిలో తన ఆత్మహత్యకు రేడియో జాకీలనే బాధ్యులను చేసిన విషయం, రేడియో ప్రసారం తర్వాత జసింత రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం, రోజూ తనకు ఫోన్ చేసే భార్య ఈసారి ఫోన్ చెయ్యకపోవడంతో తను క్షేమంగా ఉన్నదో లేదో…

బ్రిటన్ లో కేరళ నర్సు జసింత ఆత్మహత్య, విశ్లేషణ

డిసెంబరు 7 వ తేదీన భారతీయ నర్సు జసింత సల్దానా బ్రిటన్ లో ఆత్మహత్యకు పాల్పడింది. బ్రిటిష్ రాణిగారి కొడుకు గారి కోడలుగారు గర్భం ధరించి వేవిళ్లతో బాధపడుతున్న నేపధ్యంలో ఆమెకు సపర్యలు చేస్తున్న క్రమంలో జసింత సల్దానా అన్యాయంగా బలవన్మరణానికి గురయింది. సిగ్గూ, ఎగ్గూ లేని అనైతిక మీడియా ప్రమాణాలను అభివృద్ధి చేసుకున్న పశ్చిమ మీడియా విసిరిన గాలానికి చిక్కిన జసింత అర్ధాంతరంగా తనువు చాలించింది. తన చావుద్వారా బ్రిటిష్ రాచకుటుంబం చుట్టూ కమ్మిన మాయపొరను…

ప్రజా ప్రతిఘటనకు ప్రతిరూపంగా హైవే నడిబొడ్డున నిలిచిన చైనా ఇల్లు

ప్రజల కనీస అవసరాలపై కూడా ఆధిపత్యం చెలాయించే ధనికవర్గ ప్రభుత్వాలకు ప్రజాసామాన్యం ఇచ్చే ప్రతిఘటనకు సంకేతాత్మక రూపం ఈ ఇల్లు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్ లింగ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కోసం ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇటీవలే నిర్మించుకున్న తన ఇంటిని కూల్చడానికి అంగీకరిస్తూ సంతకం పెట్టడానికి ఓ వృద్ధ జంట నిరాకరించడంతో ప్రధాన రోడ్డు నడి మధ్యలో ఈ ఇల్లు ఇలా నిలబడిపోయింది. యాజమానుల అంగీకారం…