సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఆపండి! ఒబామాకు అమెరికన్ల పిటిషన్

తిరుగుబాటు పేరుతో సిరియాలో మారణకాండకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం ఆపాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం నిర్వహించే వెబ్ సైట్ whitehouse.gov లో ఈ మేరకు వివిధ సెక్షన్ల ప్రజలు ఒక పిటిషన్ నమోదు చేశారు. ముస్లిం టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం పేర్కొన్న ఆల్-ఖైదా సంస్ధకు సిరియాలో తిరుగుబాటు నడుపుతున్న 29 సంస్ధలు విధేయతను ప్రకటించాయనీ, అలాంటి టెర్రరిస్టులకోసం అమెరికా ప్రభుత్వం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు పెట్టడం గర్హనీయమని…

అరుదైన ఫోటో, తోక లేపి నిద్రపోతున్న పులి

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎన్.ఎ.నజీర్ తీసిన ఫోటో ఇది. పాలక్కాడ్ జిల్లా (కేరళ) లోని పరంబికులం టైగర్ రిజర్వ్ అడవిలో ఫారెస్ట్ వాచర్ వెంట రాగా ప్రమాదకర పరిస్ధితుల్లో నజీర్ ఈ ఫోటో తీశాడని ఫ్రంట్ లైన్ తాజా సంచిక (డిసెంబర్ 28) తెలియజేసింది. పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పచ్చదనం నీడలో అదమరిచి నిద్రపోతున్న పులి ఇలా నజీర్ కెమెరా కంటికి చిక్కింది. తోకను పైకి లేపి నిద్రపోతున్న పులిని కెమెరాలో…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…

చదివించే బాధ్యత వదిలి ప్రవేటు స్కూళ్లను మేపుతున్న ప్రభుత్వం

(ఆర్టికల్ రచయిత: చందుతులసి) పూర్వం బతకలేక బడి పంతులు అని ఓసామెత ఉండేది. అంటే తమ చదువుకు ఏ ఉద్యోగం దొరక్కపోతే… ( ఆ రోజుల్లో ఉద్యోగం అంటే ఏ బ్రిటీష్ దొర దగ్గర గుమాస్తానో, లేదంటే ఏదో సహాయకుని పదవి. ) వీధిలో బడి మొదలు పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా ఫీజులు కూడా ఉండేవి కావు. తల్లిదండ్రుల స్తోమతను బట్టి ఒక పైసానో, రెండు పైసలో ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదే ఎక్కువ. మళ్లీ…

కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య

కుల వివక్షతో ఆలయ పాలక సిబ్బంది పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక తమిళనాడులో 23 సంవత్సరాల దళిత పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజారి పదవినుండి తప్పుకోవాలనీ, అసలు గుడిలోకే రాకూడదనీ పాలక సిబ్బంది వేధించడంతో దళిత పూజారి ఎస్.నాగముత్తు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు పెట్టకుండా పట్టించుకోక పోవడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ సాయంతో కోర్టుకి కూడా వెళ్ళాడు.  వేధింపులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా వేధింపుల్లో మార్పులేకపోవడంతో…

అణు హిపోక్రసీ: అమెరికా పరీక్షలకు జపాన్, ఇరాన్ ఖండన

అణ్వస్త్రవ్యాప్తి నిరోధం గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా తాను మాత్రం అణు పరీక్షలను మానలేదు. సామూహిక విధ్వంసక మారణాయుధాలు కలిగి ఉన్నదంటూ ఇరాన్ దేశాన్నీ, ప్రజలనూ సర్వనాశనం చేయడమే కాక సిరియా, ఇరాన్ లకు కూడా అదే గతి పట్టించే కృషిలో నిమగ్నమై ఉన్న అమెరికా ఈ వారం నెవాడాలో అణు పరీక్షలు నిర్వహించినట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధంలో అమెరికా ద్వంద్వ విధానాన్నీ, హిపోక్రసీని జపాన్, ఇరాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.…

యాక్సిడెంట్ బాధిత ఈశాన్య మహిళపై చేయి చేసుకున్న వీర పోలీసు

టూ వీలర్ తో కారుని గుద్దిన వ్యక్తిని వదిలి కారు నడుపుతున్న మణిపురి మహిళ (పేరు: Swar Thounaojam) పై చేయిచేసుకున్న వీర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. ప్రమాదం చేసిన వ్యక్తిని వదిలిపెట్టి మొదటి తప్పు చేసిన కానిస్టేబుల్ మహిళపై చేయిచేసుకుని మరో నేరానికి పాల్పడ్డాడు. ప్రమాదస్ధలి వద్ద గుమికూడిన జనం కూడా మహిళనే తిట్టి, కొట్టినంతపనిచేసి, అసభ్యంగా తాకరానిచోట్ల తాకి భారత సమాజ నాగరికత యొక్క సగటు సభ్యత పాతాళస్ధాయిలోనే కునుకు తీస్తోందని చాటుకున్నారు.…

నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి

దేశంలో మిగతా రాష్ట్రాలకంటే గుజరాత్ అభివృద్ధిపధంలో దూసుకెళుతోందనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్ధతే దానికి కారణమనీ పత్రికలు భజన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో ‘గుజరాత్ అభివృద్ధి కధ‘ పేరుతో ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాయడం జరిగింది. గుజరాత్ లో జరిగిందంటున్న అభివృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులదే తప్ప అక్కడి ప్రజలది కాదని అందులో తెలియజేశాను. మరికొన్ని వివరాలు ఇపుడు చూద్దాం. వారపత్రిక అయిన తెహెల్కా నవంబరు…

టీచర్లు చితకబాదడంతో స్కూల్ పిల్లాడు మృతి

పదేళ్ళ స్కూల్ పిల్లాడిని ఇద్దరు టీచర్లు దారుణంగా కొట్టడంతో అబ్బాయి చనిపోయాడు. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అస్లాన్ అన్సారీ చేసిన తప్పుకూడా ఏమీ లేదు. స్కూల్ లో ఉన్న బకెట్ ని ఎవరో పగలగొట్టారని అస్లాన్ నవంబర్ 16న టీచర్లకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేశాక అక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు అస్లాన్ నే కొట్టడం మొదలుపెట్టారు. బకెట్ పగలకొట్టింది తాను కాదని పిల్లాడు వేడుకుంటున్నా వినకుండా అస్లాన్ ని చితగ్గొట్టారు. దానితో…

తలతిక్కవాదంతో ఎఫ్.డి.ఐ బిల్లుని గెలిపించిన ఎస్.పి, బి.ఎస్.పి

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని…

నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు

రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే వెళ్ళి ఊహించని పరిణామాల వల్ల క్షోభను అనుభవిస్తున్నాడు. ఎదుగుదల క్రమంలో నేర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్న 7 యేళ్ళ కుమారుడిని అదుపులో పెట్టే క్రమంలో చంద్రశేఖర్ తండ్రిగా అదుపు తప్పాడని నార్వే కోర్టులు భావించి 18…

ఇరాన్ మందులు అమెరికాకి రక్ష, అమెరికా ఆంక్షలు ఇరాన్ కి శిక్ష

ఇరాన్ తయారు చేసిన ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను కాపాడుతుంటే, అమెరికా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగులను చంపేస్తున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో పాము కాటుకి గురయిన అమెరికా సైనికులకి ఇరాన్ తయారు చేసిన విరుగుడు ఔషధాలు తప్ప మరో గతి లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఆదివారం ప్రచురించిన ఒక రిపోర్ట్ లో పత్రిక ఈ సంగతి తెలిపింది. నైరుతి ఆసియా ప్రాంతానికి ప్రత్యేకమైన పాముల కాట్లకు గురవుతున్న అమెరికా…

దక్షిణ చైనా సముద్రానికి అవసరమైతే బలగాలు పంపుతాం -ఇండియా

దక్షిణచైనా సముద్ర గొడవల్లో తానూ ఉన్నానని భారత ప్రభుత్వం మరోసారి చాటింది. భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్’ దక్షిణచైనా సముద్రంలో ఆయిల్ పరిశోధనలో పాల్గొంటున్నందున భారత వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే ఇండియా కూడా తన బలగాలను పంపిస్తుందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి స్పష్టం చేశాడు. సరిహద్దు తగాదాపై చర్చించడానికి భారత జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్ చైనా పర్యటనలో ఉండగానే నేవీ చీఫ్ ప్రకటన ఒకింత ఆసక్తిని రేపింది. ప్రపంచ సముద్ర…

తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు

ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

హమాస్ x ఫతా మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి…