ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

రచన: నాగరాజు ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…

గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం…

అత్యాచారాలపై ఎలా స్పందించాలి? ఓ బాధితురాలి మాటల్లో… -వీడియో

ఈ వీడియోలో మాట్లాడుతున్న వక్త పేరు సునీతా కృష్ణన్. స్వచ్ఛంధ సంస్ధగా ఎందరో పాపలను, బాబులను, అమ్మాయిలను, మహిళలను కాపాడిన ఈమె స్వయంగా చిన్నతనంలో జరిగిన సామూహిక అత్యాచారానికి బాధితురాలు. పేగులు బైటికి వచ్చే విధంగా అనేకమంది చేత అత్యాచారం చేయబడిన నాలుగేళ్ల పాప గురించీ ఇంకా అనేకమంది గురించీ ఈమె చెబుతుంటే మనుషుల మానవత్వంపై గట్టి అనుమానం రాకతప్పదు. ఫ్లెష్ ట్రేడ్ బాధితులకు ధైర్యం ఇవ్వడానికి టన్నుల కొద్దీ సానుభూతి ఇచ్చినా అది అక్కరకు రాదనీ…

బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది.…

కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే

“ప్రపంచానికి నాకూతురు పేరు తెలియాలి. నాకూతురు తప్పేమీ చేయలేదు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చనిపోయింది… నా కూతురంటే నాకు గర్వంగా ఉంది. ఆమె పేరు వెల్లడిస్తే ఇలాంటి దాడులు ఎదుర్కొని బైటపడినవారికి ధైర్యంగా ఉంటుంది. నాకూతురినుండి వారు శక్తిని పొందుతారు” అని 53 సంవత్సరాల బద్రిసింగ్ పాండే చెప్పడాని బ్రిటన్ పత్రిక ‘సండే పీపుల్’ తెలిపింది. మరో ప్రఖ్యాత పత్రిక ‘డెయిలీ మిర్రర్’ కి ఇది అనుబంధం. అమ్మాయి పేరును కూడా పత్రిక వెల్లడించింది. ఉత్తర…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…

దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష

లైంగిక అత్యాచారాల నిరోధం విషయంలో భారత ప్రభుత్వానికి దక్షిణ కొరియా ఒక దారి చూపినట్లు కనిపిస్తోంది. అత్యాచార నేరస్ధులకు ‘రసాయన పుంస్త్వనాశనం’ (chemical castration) ఒక శిక్షగా విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రతిపాదించగా దక్షిణ కొరియా కోర్టు ఒక పెడోఫైల్ (చిన్నపిల్లలపై అలవాటుగా లైంగిక అత్యాచారం చేసే వ్యక్తి) కి మొదటిసారిగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కెమికల్ కేస్ట్రేషన్ కు అనుగుణంగా 2011లో చట్టం చేసిన తర్వాత దక్షిణ కొరియాలో…

గుజరాత్ లోకాయుక్త: మోడికి ఓటమి, గవర్నర్ కి మొట్టికాయ

కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన…

ఢిల్లీ అత్యాచారం: కొనసాగుతున్న గోప్యత ఎవరి ప్రయోజనాలకు?

మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన…

2012లో జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ -వర్డ్ ప్రెస్ రివ్యూ

2012 సంవత్సరం ప్రారంభంలో చేసినట్లే 2013 సంవత్సరం ప్రారంభానికి కూడా “జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ” బ్లాగ్ ను వర్డ్ ప్రెస్ వారు సమీక్షించారు. వర్డ్ ప్రెస్ బ్లాగర్లకు ఆ సంస్ధ ఇస్తున్న నూతన సంవత్సర కానుక కాబోలు! గత నాలుగైదు నెలలుగా మునుపటిలా ఎక్కువగా టపాలు రాయలేకపోతున్నాను. దానికి మూడు కారణాలు. ఒకటి: వార్తకంటే విశ్లేషణపై కేంద్రీకరించాలని నిర్ణయించడం; రెండు: ఆర్ధరైటిస్ సమస్య వలన కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోలేకపోవడం; మూడు: పుస్తక పఠనంపై మరింత కేంద్రీకరణ పెంచడం.…

అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

నిర్భయానికి మరణం లేదు -కవిత

ఢిల్లీ బస్సులో దారుణానికి గురై మరణించిన అమ్మాయిని పత్రికలు, ప్రజలు, ఆందోళనకారులు అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆరు మృగాలతో నిర్భయంగా పోరాడింది కనుక ‘నిర్భయ’ అనీ కొందరు, ఒకనాటి వాస్తవ ఘటనకు గుర్తుకు తెచ్చుకుంటూ ‘దామిని’ అని కొందరు పిలుస్తున్నారు. ఎన్.డి.టి.వి చానెల్ బాధితురాలిని ‘అమానత్’ అని సంబోధించింది. ఆకాశంలో సగం ధిక్కరించిన పిడికిళ్ళైనంతకాలం తాను ఏ పేరుతోనైనా నిలిచే ఉంటుందని మరో కవి చిట్టిపాటి.వెంకటేశ్వర్లు తన కవితలో ఇలా స్పందిస్తున్నారు. బొమ్మపై క్లిక్ చేసి…