బి.జె.పి – మోడి డామినేషన్ -కార్టూన్

నరేంద్ర మోడిని బి.జె.పి కేంద్ర పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుని రెండు నెలలు కూడా కాలేదు. ఆయనని బోర్డు సభ్యుడుగా తీసుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే ఇతర సభ్యులను డామినేట్ చేశారు. మీడియాని ఎలా ఆకర్షించాలో మోడీకి కరతలామలకమే. పార్లమెంటరీ బోర్డు సమావేశాలపై కేంద్రీకరించడం మాని విలేఖరులు మోడి చుట్టూ తిరగడం, ఆయన వెంట పరుగులు పెట్టడం చేశారు. బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీలోని బి.జె.పి నాయకులను ఒక్కొక్కరినీ స్వయంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం ద్వారా మోడి ఈ…

మధ్య ఆసియా: మూసివేత దిశలో కిర్ఘిస్తాన్ అమెరికా ఆర్మీ బేస్

మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను…

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5…

వేడి సెగల డ్రాగన్ షేక్-హ్యాండ్ -కార్టూన్

చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా…

యాహూ ఒడిలో టంబ్లర్, గూగుల్ ‘మేయర్’ పాచిక

గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.…

ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు

కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది. అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా…

కర్ణాటకలో పదవుల కొట్లాట -కార్టూన్

– నా తక్షణ కర్తవ్యం, మంత్రులు కానివారిని అదుపులో పెట్టడం… – మెట్టు తర్వాత మెట్టు ఎక్కడం రాజకీయ నాయకుల వంతయితే, పెనం మీద నుండి పొయ్యిలోకి నిరంతరాయంగా జారుతుండడం ప్రజల వంతు. తమ మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, పార్టీలు, ఆ కాస్త ఎన్నికల యజ్ఞం అయ్యాక పదవుల పండేరంలో మునిగి తేలడం రివాజు. కర్ణాటకలో ఇపుడు జరుగుతోంది అదే. అక్రమ మైనింగ్ కేసులు నడుస్తున్నందుకు…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…

సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస…

సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ పెనవేసుకున్న వేళ…

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్’ పోటీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మరో ఆరు వారాల పాటు ఎంట్రీలను ఆహ్వానిస్తారట. నేషనల్ జాగ్రఫిక్ వారు నిర్వహిస్తున్న ఈ 25 వ పోటీలకు వచ్చిన కొన్ని ఎంట్రీలను ‘ది అట్లాంటిక్’ ప్రచురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఊహకు అందని శిఖరాలకు అభివృద్ధి చెందిన నేపధ్యంలో మనిషి సాధారణ ఊహా శక్తిని అనేక రెట్లకు చేర్చుతోంది ఫోటోగ్రఫి. ఇంకా ఆరు నెలల పాటు ఎంట్రీలకు ప్రవేశం ఉన్నందున తెలుగు నేలను ఆవహించిన ప్రకృతి…

అవినీతిని సహించరట! -కార్టూన్

– “వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో ఎన్ని సున్నాలున్నా మనం భరిస్తున్నామనేనా దానర్ధం?” – “అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదు” ఇది మన మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, రాజ్యాంగేతర శక్తులు తరచుగా చేసే హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఎంత బోలుతనం, ఎంత పరిహాసం, ఇంకెంత కపటం, మరెంత నమ్మక ద్రోహం ఉన్నదో ఆ చెప్పేవాడికీ, విని రాసుకుని పత్రికల్లో నివేదించేవారికీ, చదివేవారికీ… అందరికీ తెలుసు. అయినా సరే, అలవాటు పడిపోయాం…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…