సి.బి.ఐ అటానమీ -కార్టూన్

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. “పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ…

రష్యాలో అమెరికా రాయబారి గూఢచర్యం, బహిష్కరణ

గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు…

సిరియా: ఇజ్రాయెల్ దూకుడుకి రష్యన్ మిసైల్ ముకుతాడు

సిరియా కిరాయి తిరుగుబాటులో అంతిమ అంకానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.  సిరియా లోని ఒక జాతీయ సైనిక శిబిరం పైకి ఇజ్రాయెల్ చేత ఇప్పటికీ మూడుసార్లు మిసైళ్లతో అమెరికా దాడి చేయించడంతో రష్యా తన శక్తివంతమైన ఎస్-300 మిసైల్ వ్యవస్ధను సిరియాకు సరఫరా చేయడానికి వేగంగా నిర్ణయం తీసుకుంది. ఎస్-300 క్షిపణులు సిరియా ప్రభుత్వం చేతికి వస్తే (ఒక మిసైల్ బ్యాటరీ ఇప్పటికే సరఫరా అయిందని వార్త) అమెరికా పధకాలు దాదాపు తల్లకిందులు అయినట్లే. అమెరికా అమ్ముల…

దొంగ-గజదొంగ : నేరము-శిక్ష -కార్టూన్

– ఖైదీ నెం. 1: వాల్ స్ట్రీట్ లో బిలియన్లు దొంగిలించినందుకు నాకు 3 నెలలు వేసారు! కేడీ నెం. 1: కొన్ని జాయింట్లు నా దగ్గర దొరికాయని నాకు 3 సంవత్సరాలు వేశారు!! – అమెరికాలో వాల్ స్ట్రీట్, బ్రిటన్ లో ‘ద సిటీ (ఆఫ్ లండన్)’, ఇండియాలో దలాల్ స్ట్రీట్… ఇత్యాది బజార్లలో సామాన్యులకు ప్రవేశం దుర్లభం. గోల్డ్ మెన్ గజదొంగలకే ఇక్కడ ప్రవేశం.  సెకన్ల వ్యవధిలోనే షేర్ల కదలికల్ని ప్రభావితం చేసి మిలియన్ల…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…

ఉత్తర కొరియా శాంతించినా, అణు వాహక నౌక తరలించిన అమెరికా

ఉభయ కొరియాల వద్ద నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్ధితులను శాంతింపజేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మాత్రం తమ భారీ మిలట్రీ డ్రిల్ తో రెచ్చగొట్టుడు కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. సరిహద్దు వద్ద మొహరించిన మధ్య శ్రేణి క్షిపణులను ఉపసంహరించడంతో పాటు ఉత్తర కొరియా తమ మంత్రివర్గంలో కూడా మార్పులు చేసి తద్వారా ఉద్రిక్తతలు శాంతించడానికి తన వంతు చర్యలు చేపట్టింది. అయితె అమెరికా, దక్షిణ కొరియాలు తదనుగుణంగా స్పందించలేదు. పైగా అమెరికా అణు…

కర్ణాటక: కష్టం ఒకరిది, పేరు మరొకరిది -కార్టూన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల…

రేటింగ్ కంపెనీలు: అమెరికాకి పోటీగా చైనా రంగంలోకి

అమెరికా రేటింగ్ కంపెనీలకు పోటీగా చైనా తన స్వంత రేటింగ్ కంపెనీని రంగంలోకి దించుతోంది. దశాబ్దాలుగా మార్కెట్ ఎకానమీ దేశాలలో రేటింగ్ కంపెనీల మార్కెట్ ను శాసిస్తున్న మూడు అమెరికా కంపెనీలకు ఇప్పటి వరకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), మూడీస్, ఫిచ్… ఈ మూడు క్రెడిట్ రేటింగ్ కంపెనీలదే ఇప్పటివరకు రేటింగ్ లను జారీ చేయడంలో ఇష్టారాజ్యం. ఆర్ధికంగా అమెరికాకు పోటీగా ఎదిగిన చైనా క్రమ క్రమంగా…

అబద్ధాన్ని పదే పదే చెబితే అది…. -మొగుల్ స్ట్రిట్ ఆర్ట్

బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా.  నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో…

తుపాకుల కాపలాలో అమెరికా స్వేచ్ఛ! -కార్టూన్

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తానే అసలు ప్రతినిధినని చెప్పుకుంటుంది అమెరికా. వ్యక్తిగత స్వేచ్ఛను మించింది లేదని అంటుంది అమెరికా. (స్వేచ్ఛా హక్కు లాంటి ప్రాధమిక హక్కులకు హేతుబద్ధమైన పరిమితులు -reasonable restrictions- ఉండాలంటుంది భారత రాజ్యాంగం.) భారీ లిబర్టీ విగ్రహం సాక్షిగా చూపే అమెరికాలో లిబర్టీ, శిలగా తప్ప బతకలేని పరిస్ధితి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో స్వేచ్ఛను స్ధాపిస్తానంటూ బాంబులు, ఫిరంగులతో బయలుదేరే అమెరికా అత్యంత కరుడుగట్టిన నియంతృత్వ రాజ్యాలకు కాపలా కాయడమే కాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన…

ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో

ఆ కనిపించే గోడ ఇజ్రాయెల్ తన ప్రాంతాల చుట్టూ నిర్మించిన కట్టడం. కోట కోడను తలపించే ఇలాంటి ఎత్తైన గోడలు ఇజ్రాయెల్ నిండా దర్శనమిస్తాయి. అవి ఇజ్రాయేలీయులు (యూదులు), పాలస్తీనీయులు నివసించే ప్రాంతాలను వేరు చేస్తాయి. పనులకు వచ్చే పాలస్తీనీయులను శల్య పరీక్ష చేయడానికి కూడా చెక్ పోస్టుల వద్ద ఇలాంటి ఎత్తైన గోడలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇలాంటి చెక్ పోస్టుల వద్ద ‘క్యూ’లలో ఇజ్రాయెల్ సైనికుల చేత నఖశిఖ పర్యంతం చెకింగ్ అయ్యాకనే పాలస్తీనీయులకు ఆ…

బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

పార్లమెంటుకు 4 కి.మీ దూరంలో బలవంతపు వ్యభిచారం

ఢిల్లీ మెడికల్ విద్యార్ధిని నిర్భయ సామూహిక అత్యాచారం దరిమిలా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి సమాధానం ఇస్తూ ప్రధాని మన్మోహన్ ‘మహిళల రక్షణే తమ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం’ అని ప్రకటించారు. కానీ ఆయన ఆ ప్రకటన చేసిన పార్లమెంటు భవనానికి నాలుగు కి.మీ దూరం లోపలే వివిధ రాష్ట్రాల నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికల చేత బలవంతపు వ్యభిచారం చేయిస్తున్న అమానుషం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన టీనేజి అమ్మాయిని బంధించి…