సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస…

సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ పెనవేసుకున్న వేళ…

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్’ పోటీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మరో ఆరు వారాల పాటు ఎంట్రీలను ఆహ్వానిస్తారట. నేషనల్ జాగ్రఫిక్ వారు నిర్వహిస్తున్న ఈ 25 వ పోటీలకు వచ్చిన కొన్ని ఎంట్రీలను ‘ది అట్లాంటిక్’ ప్రచురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఊహకు అందని శిఖరాలకు అభివృద్ధి చెందిన నేపధ్యంలో మనిషి సాధారణ ఊహా శక్తిని అనేక రెట్లకు చేర్చుతోంది ఫోటోగ్రఫి. ఇంకా ఆరు నెలల పాటు ఎంట్రీలకు ప్రవేశం ఉన్నందున తెలుగు నేలను ఆవహించిన ప్రకృతి…

అవినీతిని సహించరట! -కార్టూన్

– “వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో ఎన్ని సున్నాలున్నా మనం భరిస్తున్నామనేనా దానర్ధం?” – “అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదు” ఇది మన మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, రాజ్యాంగేతర శక్తులు తరచుగా చేసే హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఎంత బోలుతనం, ఎంత పరిహాసం, ఇంకెంత కపటం, మరెంత నమ్మక ద్రోహం ఉన్నదో ఆ చెప్పేవాడికీ, విని రాసుకుని పత్రికల్లో నివేదించేవారికీ, చదివేవారికీ… అందరికీ తెలుసు. అయినా సరే, అలవాటు పడిపోయాం…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…

సి.బి.ఐ అటానమీ -కార్టూన్

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. “పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ…

రష్యాలో అమెరికా రాయబారి గూఢచర్యం, బహిష్కరణ

గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు…

సిరియా: ఇజ్రాయెల్ దూకుడుకి రష్యన్ మిసైల్ ముకుతాడు

సిరియా కిరాయి తిరుగుబాటులో అంతిమ అంకానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.  సిరియా లోని ఒక జాతీయ సైనిక శిబిరం పైకి ఇజ్రాయెల్ చేత ఇప్పటికీ మూడుసార్లు మిసైళ్లతో అమెరికా దాడి చేయించడంతో రష్యా తన శక్తివంతమైన ఎస్-300 మిసైల్ వ్యవస్ధను సిరియాకు సరఫరా చేయడానికి వేగంగా నిర్ణయం తీసుకుంది. ఎస్-300 క్షిపణులు సిరియా ప్రభుత్వం చేతికి వస్తే (ఒక మిసైల్ బ్యాటరీ ఇప్పటికే సరఫరా అయిందని వార్త) అమెరికా పధకాలు దాదాపు తల్లకిందులు అయినట్లే. అమెరికా అమ్ముల…

దొంగ-గజదొంగ : నేరము-శిక్ష -కార్టూన్

– ఖైదీ నెం. 1: వాల్ స్ట్రీట్ లో బిలియన్లు దొంగిలించినందుకు నాకు 3 నెలలు వేసారు! కేడీ నెం. 1: కొన్ని జాయింట్లు నా దగ్గర దొరికాయని నాకు 3 సంవత్సరాలు వేశారు!! – అమెరికాలో వాల్ స్ట్రీట్, బ్రిటన్ లో ‘ద సిటీ (ఆఫ్ లండన్)’, ఇండియాలో దలాల్ స్ట్రీట్… ఇత్యాది బజార్లలో సామాన్యులకు ప్రవేశం దుర్లభం. గోల్డ్ మెన్ గజదొంగలకే ఇక్కడ ప్రవేశం.  సెకన్ల వ్యవధిలోనే షేర్ల కదలికల్ని ప్రభావితం చేసి మిలియన్ల…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…

ఉత్తర కొరియా శాంతించినా, అణు వాహక నౌక తరలించిన అమెరికా

ఉభయ కొరియాల వద్ద నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్ధితులను శాంతింపజేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మాత్రం తమ భారీ మిలట్రీ డ్రిల్ తో రెచ్చగొట్టుడు కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. సరిహద్దు వద్ద మొహరించిన మధ్య శ్రేణి క్షిపణులను ఉపసంహరించడంతో పాటు ఉత్తర కొరియా తమ మంత్రివర్గంలో కూడా మార్పులు చేసి తద్వారా ఉద్రిక్తతలు శాంతించడానికి తన వంతు చర్యలు చేపట్టింది. అయితె అమెరికా, దక్షిణ కొరియాలు తదనుగుణంగా స్పందించలేదు. పైగా అమెరికా అణు…

కర్ణాటక: కష్టం ఒకరిది, పేరు మరొకరిది -కార్టూన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల…