టెర్రరిస్టులకు మద్దతుగా ఇజ్రాయెల్ ట్యాంకు, ధ్వంసం చేసిన సిరియా

పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన…

మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…

అమెరికా: తుపాకులు పట్టుకు తిరిగేవారిలో తెల్లవారే ఎక్కువ

న్యూయార్క్ నగరంలో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని న్యూయార్క్ పోలీసుల సర్వేలో తేలింది. నేరం జరిగినప్పుడల్లా నల్లవారిని అనుమానించే న్యూయార్క్ పోలీసుల ధోరణిలో తీవ్ర తప్పిదం ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది. న్యూయార్క్ పోలీసులు గత రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్న stop-and-frisk ఆపరేషన్లలో సేకరించిన డేటా ద్వారా నల్లవారి కంటే రెట్టింపు సంఖ్యలో తెల్లవారి దగ్గరే ఆయుధాలు లభ్యమయ్యాయని రష్యా టుడే తెలిపింది. న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ పలు…

హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…

ప్రకృతి ఒక్క కసురు కసిరితే చాలు… విలయమే ఇక!

మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది. గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక…

రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

పన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది.…

బి.జె.పి – మోడి డామినేషన్ -కార్టూన్

నరేంద్ర మోడిని బి.జె.పి కేంద్ర పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుని రెండు నెలలు కూడా కాలేదు. ఆయనని బోర్డు సభ్యుడుగా తీసుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే ఇతర సభ్యులను డామినేట్ చేశారు. మీడియాని ఎలా ఆకర్షించాలో మోడీకి కరతలామలకమే. పార్లమెంటరీ బోర్డు సమావేశాలపై కేంద్రీకరించడం మాని విలేఖరులు మోడి చుట్టూ తిరగడం, ఆయన వెంట పరుగులు పెట్టడం చేశారు. బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీలోని బి.జె.పి నాయకులను ఒక్కొక్కరినీ స్వయంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం ద్వారా మోడి ఈ…

మధ్య ఆసియా: మూసివేత దిశలో కిర్ఘిస్తాన్ అమెరికా ఆర్మీ బేస్

మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను…

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5…

వేడి సెగల డ్రాగన్ షేక్-హ్యాండ్ -కార్టూన్

చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా…

యాహూ ఒడిలో టంబ్లర్, గూగుల్ ‘మేయర్’ పాచిక

గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.…

ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు

కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది. అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా…

కర్ణాటకలో పదవుల కొట్లాట -కార్టూన్

– నా తక్షణ కర్తవ్యం, మంత్రులు కానివారిని అదుపులో పెట్టడం… – మెట్టు తర్వాత మెట్టు ఎక్కడం రాజకీయ నాయకుల వంతయితే, పెనం మీద నుండి పొయ్యిలోకి నిరంతరాయంగా జారుతుండడం ప్రజల వంతు. తమ మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, పార్టీలు, ఆ కాస్త ఎన్నికల యజ్ఞం అయ్యాక పదవుల పండేరంలో మునిగి తేలడం రివాజు. కర్ణాటకలో ఇపుడు జరుగుతోంది అదే. అక్రమ మైనింగ్ కేసులు నడుస్తున్నందుకు…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…