అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…

రక్తం కారేలా కొట్టుకున్న యు.పి పోలీసులు -వీడియో

ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుందట! అలా చెప్పడం అతిశయోక్తే అయినా, జరిగింది మాత్రం ఘోరమే. ఏ తగాదా వచ్చిందో గానీ ఇద్దరు పోలీసులు బహిరంగంగా, అందరూ చూస్తుండగానే రక్తం కారేలా లాఠీలతో బాదుకున్నారు. కెమెరా పని చేస్తోందన్న స్పృహే లేకుండా కొట్టుకున్నారు. చూడడానికి ఒళ్ళు గగుర్పొడిచేలా కొట్టుకుని ఆనక వారిలో ఒకరు వీడియోగ్రాఫర్ తోనో, విలేఖరితోనో మాట్లాడారు కూడాను. తొమ్మిది రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. Times Now వార్తా ఛానెల్ ద్వారా యాహూ…

కంచి దారిలో ఇండియా జి.డి.పి వృద్ధి కధ!

దేశ వనరులన్నీ తవ్వి తీసి దేశ ప్రజలకు వినియోగపెట్టడం మాని విదేశాలకు ఎగుమతి చేయడమే అభివృద్ధిగా చెప్పుకున్న భారత పాలకుల అభివృద్ధి కధ కంచి దారి పట్టినట్లు కనిపిస్తోంది. 2012-13 సంవత్సరానికి గాను దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువ జి.డి.పి వృద్ధి రేటును భారత ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసింది. మాన్యుఫాక్చరింగ్, సేవలు, వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం తదితర ముఖ్యమైన అన్ని రంగాలలోనూ వృద్ధి రేటు కుంటుబడడంతో గత ఆర్ధిక సంవత్సరం…

సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…

మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…

సిరియా: అంతులేని విధ్వంసం, హత్యాకాండల యుద్ధక్షేత్రం -ఫోటోలు

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ మహాశయుని చారిత్రక ప్రతిపాదన ఎంత వాస్తవమో చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. సిరియా అందుకు తాజా రుజువు. అమెరికా, ఐరోపా రాజ్యాల వనరులు, మార్కెట్ల దాహానికీ, అంతర్జాతీయ జియో-పోలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన ప్రత్యర్ధుల ‘ముసుగు యుద్ధానికి’ కేంద్రంగా రక్తం ఓడుతున్న సిరియా, నేటి సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రం. శాంతి విరామం లేని అనంత యుద్ధానికి బహిరంగంగానే నాందీ వాచకం పలికిన జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా వాల్ స్ట్రీట్…

గాంధేయవాదులూ బహిష్కృతులే -రెండో భాగం

(జస్టిన్ పొదుర్ టొరొంటో నగరంలో ఒక రచయిత. యార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్మాలియాలో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన బ్లాగ్: http://www.killingtrain.com ట్విట్టర్: @JustinPodur) మొదటి భాగం తరువాయి………………… జె.పి: ఆశ్రమ్ కూల్చివేత కూడా ఒక ఉదాహరణ అనుకుంటాను. హెచ్.కె: ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ భూమిలోనే మా ఆశ్రమ్ ని ప్రారంభించామని గుర్తుంచుకోండి. సల్వాజుడుం సాగిస్తున్న దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు, గ్రామ దహనాలు మొదలైన వాటిని మేము ప్రశ్నించడం ప్రారంభించాక…

గాంధేయవాదులు కూడా బహిష్కృతులే -గాంధియన్ హిమాంషుతో ఇంటర్వ్యూ

హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను…

కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…

రెంటల్ మేన్స్ గేమ్ -కార్టూన్

ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు. ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం…

అమాయకులు కాదు, కాంగీ నాయకులే లక్ష్యం -మావోయిస్టులు

మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి…

ఎస్-300 సిరియాకి ఇచ్చావో…, రష్యాకి ఇజ్రాయెల్ హెచ్చరిక

సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది. ఇజ్రాయెల్ రక్షణ…

కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. భారత దేశంలో ప్రజలకు హామీలు ఇచ్చే అవకాశం ఎన్నడూ రాని ఆయన (ఎన్నికల్లో పోటీ చేయరు గనుక) దానిని జపాన్ లో దొరకబుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అడిగిందే తడవుగా జపాన్ పారిశ్రామిక వేత్తలకు హామీలు ఇచ్చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్. ‘కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే’ అంటూ పరమానంద రాగం ఆలపించినంత పని చేశారు. ‘మీ మార్కెట్లు ఇంకా బాగా తెరవాలి’ అంటే ‘దాందేముంది, మా ప్రజలకు…