గూఢచర్యం ప్రపంచీకరణ: ఎల్లలు లేని ఒబామా ఫోన్ ట్యాపింగ్

మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బారక్ ఒబామా నల్ల చట్టాలు అమలు చేయడంలో జార్జి డబ్ల్యూ. బుష్ ని మించిపోతున్నారు. ప్రభుత్వ చెప్పు చేతల్లోని విదేశీ గూఢచర్య కోర్టు (Foreign Intelligence Surveillance Act Court -FISA Court) నుండి తనకు కావలసిన ఆర్డర్ తెప్పించుకుని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచంలోని ఇతర అన్ని దేశాల ప్రజల ఫోన్ సంభాషణల పైనా గూఢచర్యం సాగించడానికి తెగబడ్డాడు. గత ఏప్రిల్ 25 తేదీన కోర్టు ఈ మేరకు ఆర్డర్ సంపాదించారని…

ఆహార భద్రతా బిల్లు: ఖోలో సెసేమ్! -కార్టూన్

ఎన్నికలలోపు ‘ఆహార భద్రతా బిల్లు’ (Food Security Bill) ను చట్టం రూపంలో తేవాలని యు.పి.ఏ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. బి.జె.పి సహాయ నిరాకరణ వలన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు. మైనారిటీలో ఉన్న యు.పి.ఏ-2 ప్రభుత్వం బి.జె.పి సహకారం లేకుండా చట్టం తేవడం అసంభవం. ఈ నేపధ్యంలో కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కి ఎందుకింత తొందర? ఆహార భద్రతా…

రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది. 1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి.…

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇలా వస్తాయా? -కార్టూన్

“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!” సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని,…

చేపమందు అశాస్త్రీయం, ఏర్పాట్లు మీవే -లోకాయుక్త

బత్తిన సోదరులకు ఊహించని రీతిలో షాక్ లాంటిది ఎదురయింది. చేప మందు అశాస్త్రీయమని లోకాయుక్త కోర్టు చెప్పేసింది. ప్రైవేటు వ్యక్తుల కార్యకలాపాలకు ప్రభుత్వం నుండి సహాయం చేయడానికి వీలు లేదని తీర్మానించింది. బత్తిన సోదరులే చేపలు మింగడానికి వచ్చేవారికి తమ సొంత ఖర్చులతో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది. జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగే చేప మందు పంపిణీ కోసం మంచి నీరు, భద్రత, శుభ్రత లాంటి తగిన ఏర్పాట్లు…

ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు

యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు.…

స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్

పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…

కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?

కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా ఆడపిల్లదేనా? ‘వాడికేం మగాడు’ అనే సమాజం తల్లిదండ్రుల చేత తన కూతుళ్లపైన ఎంతటి ఘోరకలికయినా తెగించేట్లు చేస్తుందా? ఆడపిల్లలకు ఇష్టమైనవారిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరించగలరో బెంగుళూరులోని ఈ హృదయ విదారక సంఘటన చెబుతోంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు 31 యేళ్ళ (ఇప్పుడు 35) తమ కూతురిని నాలుగేళ్లుగా గదిలో బంధించి ఉంచిన తల్లి దండ్రులను ఎలా అర్ధం…

అద్వానీ కల తీరిది! -కార్టూన్

అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు ఆయన పార్టీ చేత ‘ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అని పరోక్షంగా చెప్పిస్తున్నారు. మోడిని తీవ్ర స్ధాయిలో ప్రమోట్ చేయించడం ద్వారా ఆయనని విశ్రాంతి తీసుకొమ్మని ‘హింట్’ ఇప్పిస్తున్నారు. కానీ అద్వానీ శ్రీ మహా…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…

సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

అబ్బే మా మధ్య విభేదాలేమీ లేవు -కార్టూన్

– – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ…

హింస కాదు ప్రతి హింస: అరుంధతీ రాయ్ -3

రెండో భాగం తరువాయి………….. సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా? అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…