ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…

ఉత్తర ఖండ్ కాదిది, మీ రాష్ట్రమే! -కార్టూన్

– నాయకుడు: దారుణం! నా హృదయం ఈ అభాగ్యుల కోసం విలపిస్తోంది… పైలట్: ఇది మీ సొంత రాష్ట్రమే సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మనం వెనక్కి వచ్చేశాం! ———000——— ఉత్తర ఖండ్ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన మేఘ ప్రళయం (cloud bursts), హఠాత్ వరదల (flash floods) ను సృష్టించింది. ఈ వరదల్లో అనేకమంది తప్పించుకోవడానికి కూడా తగిన వీలు, సమయం లేక అసువులు బాసారు. ఇప్పటివరకు 800 చిల్లర…

కారుకూతలు కట్టిపెట్టు! అమెరికాకి చైనా రిటార్ట్

ఉద్దేశ్యపూర్వకంగానే స్నోడెన్ హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి సహకరించారనీ, ఇందులో చైనా హస్తం ఉందనీ అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిరస్కరించింది. కారు కూతలు కట్టిపెట్టాలని దునుమాడింది. అమెరికా మానవ హక్కుల నమూనా అని భావిస్తే ఆ భ్రమల నుండి బైటికి రావాలని హిత బోధ చేసింది. ఇంటర్నెట్ హక్కుల మేనిపులేటర్ గా అవతరించిన అమెరికా “ఒక పిచ్చి (హక్కుల) ఆక్రమణదారు” అని నిరసించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక పీపుల్స్ డైలీ విదేశీ ఎడిషన్ ఈ…

స్నోడెన్ లిబర్టీ – అమెరికన్ లిబర్టీ -కార్టూన్

అమెరికా రాజ్యాధినేతల అక్రమ గూఢచర్యాన్ని లోకానికి తెలిపిన స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు భద్రమైన తావు కోసం ఖండాంతరాలు దాటి పరుగులు పెడుతోంది. స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు ఘనత వహించిన అమెరికన్ లిబర్టీకి సైతం కంటగింపుగా మారిపోయింది. ప్రఖ్యాత లిబర్టీ విగ్రహాన్ని కేవలం విగ్రహ పాత్ర వరకే పరిమితం చేసింది అమెరికా రాజ్యమైతే, దానికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నది ఎడ్వర్డ్ స్నోడెన్. అమెరికన్ లిబర్టీ అమెరికన్ రాజులకు ఎంతగా దాసోహం అయిందంటే, ప్రాణం పోసుకున్న లిబర్టీ పైన తానే…

రుద్ర భూమిపై రాజకీయ హెలికాప్టర్లు -కార్టూన్

శైవ క్షేత్రాలకు కేంద్రమైన ఉత్తర ఖండ్ ను రుద్ర భూమిగా చెప్పవచ్చు. ఆ రుద్ర భూమి రౌద్ర రూపం దాల్చిన క్షణాలు భక్తజన సమూహానికి శాపంగా మారగా, రాజకీయ నాయకులకు మాత్రం ఓట్ల గాలం కావడం అత్యంత శోచనీయం. ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వేలలో నిమగ్నమై తమ తమ రాష్ట్ర వాసుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ బాధిత ప్రజలకు సాయం చేస్తున్న సైనికుల పనిని కష్టతరం చేస్తున్నారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వారిస్తున్నా వినకుండా ఉత్తర…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

స్నోడెన్ కి షెల్టర్ ఇచ్చారా, జాగ్రత్త! అమెరికా హెచ్చరిక

అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార స్వభావాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా మరోసారి చాటుకుంది. సి.ఐ.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ వీడి రష్యా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఏ దేశమూ షెల్టర్ ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరించింది. విద్రోహ నేరం కింద అమెరికాలో ఆయనపై కేసులు నమోదయ్యాయని కాబట్టి ఏ దేశమూ ఆయనకు రక్షణ ఇవ్వడం గానీ, తన గగనతలం గుండా ప్రయాణించే అవకాశం కల్పించడం గానీ చేయరాదని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించినట్లు…

అమెరికాకు చైనా ఝలక్, హాంగ్ కాంగ్ వీడిన స్నోడెన్

అమెరికాకు చైనా దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చింది. స్నోడెన్ ను తమకు అప్పగించాలని అమెరికా చేసిన విన్నపాన్ని పక్కకు నెట్టి ఆయన హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి అనుమతి ఇచ్చేసింది. ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్, సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ దేశ విదేశీ గూఢచర్యం నేరానికి పాల్పడ్డాడని, ఆయన్ని తమకు అప్పగించాలని అమెరికా, చైనాను కొద్ది రోజుల క్రితం కోరింది. తమ నేరారోపణలకు రుజువుగా కొన్ని పత్రాలను చైనా ప్రభుత్వానికి అందజేసింది. అయినప్పటికీ అమెరికా…

చైనా ఫోన్ కంపెనీ, యూనివర్శిటీలను హ్యాక్ చేసిన అమెరికా

“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు  వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి…

ఉత్తరఖండ్ వరదలు: స్వయంకృత మహా విధ్వంసం -ఫోటోలు

ఉత్తర ఖండ్ రాష్ట్రంలో వారం రోజుల క్రితం ఉన్న పళంగా ఊడిపడిన వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటిదాకా 556 మృత దేశాలను లెక్కించిన అధికారులు వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి ఇప్పటివరకు 73,000 మందిని రక్షించినప్పటికీ వివిధ చోట్ల నీటి తటాకాల మధ్య, రోడ్లు కూలిపోయినందు వల్లా ఇంకా 40,000 మంది ఎటువంటి సాయమూ అందక ఇరుక్కొనిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత…

ఏదైతే అదవుతుంది! -కార్టూన్

రూపాయి విలువ నూతన లోతులకు దిగజారుతున్నా, దుగుమతుల విలువ అమాంతం పెరిగిపోతున్నా మన పాలకులకు పెద్ద ఆందోళన లేదు. సరిగ్గా చెప్పాలంటే వారిపై వారికే నమ్మకం లేదు. జనం అయితే పోలీసుల్ని, సైన్యాన్నీ దించి అణచివేయొచ్చు గానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధిపతిని వీరేమి చేయగలరు? అందువల్ల ఆందోళన పడుతున్న భారత మదుపుదారులకు ‘మరేం ఫర్వాలేదు’ అని చెబుతూ తమకు తాము ‘చేసేదేముంది ఏదైతే అడవుతుంది’ అని చెప్పుకుని నిశ్చేష్టులై ఉండిపోయారు. సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) అనేది…

అమెరికాలో మంచు కురిస్తే భరత ఖండం వణికిపోవాల!

చైనాలో వర్షం కురిస్తే ఇక్కడ గొడుగు పడతారని భారత కమ్యూనిస్టుల గురించి ఒక సామెత లాంటి జోక్ ప్రచారంలో ఉండేది. చైనాలో సోషలిజానికి చరమగీతం పాడిన తర్వాత ఆ సామెత (లాంటి జోక్) ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకుండా పోయింది. ఐతే 1992 నుండి అమలవుతున్న నూతన ఆర్ధిక విధానాల పుణ్యాన ఈ సామెతను మార్చి చెప్పుకోవాల్సిన అగత్యం ఎప్పుడో వచ్చింది. ‘అమెరికాలో మంచు కురిస్తే భారత ప్రజలు వణికిపోవాలి’ అని. అయితే చైనాలో వర్షం కురిస్తే…

ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు

భారత దేశ ప్రజల బతుకు చిత్రంలో ఋతుపవనాల రంగులకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో చెప్పలేము. కేరళలో అడుగుపెట్టి అటు అండమాన్, ఇటు ఉత్తరాఖండ్ ల వరకూ భరత ఖండం అంతా విస్తరించే నైరుతి ఋతుపవనాలైనా, హిమాలయాల చల్లదనాన్ని కారు మబ్బుల ద్వారా దక్షిణాదికి మోసుకొచ్చే ఈశాన్య ఋతుపవనాలైనా భారత దేశంలోని సకల ఉత్పత్తి రంగాలకు జీవ గర్రలు. నీటి పారుదల సౌకర్యం కలిగిన పొలాలకు కూడా ఈ రెండు పవనాలు తెచ్చే వానలే నదులు, రిజర్వాయర్లను నింపి…

అమెరికా-తాలిబాన్ చర్చలు, కర్జాయ్ అలక

సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని…

నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్

కేశవ్ నుండి మరో అద్భుతమైన, నిశితమైన, శక్తివంతమైన కార్టూన్! మోడి నియంతృత్వ పోకడలు ఇతర పార్టీలే కాకుండా బి.జె.పి నాయకులు కూడా అనేకమంది విమర్శిస్తారు. తన ప్రధాని కలకు అడ్డువచ్చిందుకు ఎల్.కె.అద్వానీ మోడి సహిత బి.జె.పి పైన చేసిన విషయం ఇంకా పత్రికల్లో నానుతోంది. గోధ్రా అనంతర అల్లర్లను ఆపకుండా రాజధర్మ నిర్వహణలో విఫలమైనందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సైతం మోడీని విమర్శించారు. పరమత విద్వేష పూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ తొగాడియా (విశ్వ…