దుర్గా నాగపాల్: 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించా

ఉత్తర ప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను తాను 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వాగుతుండగా రికార్డు చేసిన వీడియో బైటకొచ్చింది. దీనితో శాంతిభద్రతలను నియంత్రించడంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేశామన్న యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా అఖిలేష్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిలో పడినట్లయింది. మింగలేక, కక్కలేక సమాధానాలు వెతుక్కోవలసిన పనిలో రాష్ట్ర ప్రభూత్వం పడిపోయింది. నిజాయితీ అధికారుల కంటే ఇసుక మాఫియాయే…

రష్యా ఆశ్రయం మంజూరు, స్నోడెన్ కు బంధ విముక్తి

ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ…

భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు, ఒక పరిశీలన

(ఈ వ్యాసం e-సాహిత్య పత్రిక ‘వాకిలి’ ఆగస్టు సంచికలో ప్రచురించబడింది. రచయిత్రి రమా సుందరి గారు. స్త్రీల వస్త్రధారణ గురించి తరచుగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో బ్లాగ్ పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో రచయిత్రి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను.  -విశేఖర్) ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి…

టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు,…

అది ఆంధ్ర, ఇది తెలంగాణ -కార్టూన్

“శుభ వార్త! హై కమాండ్ నిర్ణయం తీసేసుకుంది. అదేమో ఆంధ్ర, ఇదేమో తెలంగాణ…”  — కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరం, తెలంగాణ ఏర్పాటును ఎలా తరుముకొచ్చిందో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. తెలంగాణ అనుకూల నిర్ణయం ద్వారా తెలంగాణలో గణనీయ సంఖ్యలో పంచాయితీలను ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. విచిత్రంగా సీమాంధ్ర ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ గెలుచుకున్న పంచాయితీలు తక్కువేమీ కాదు. చూడబోతే 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారబోతున్నట్లే ఉంది.

తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు

తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభ మరియు విధాన సభలు రెండు తమ తమ అభిప్రాయాలు చెప్పడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అభిప్రాయాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం పార్లమెంటుకు లేదని కూడా వారు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ లాంటివారు ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానం మనసు మార్చొచ్చు’ అని వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో నిపుణుల అభిప్రాయాలను పరిశీలించడం ఉపయుక్తం కాగలదు. లోక్ సభకు సెక్రటరీ జనరల్ గా పని…

తెలంగాణ: కాంగ్రెస్ ఫుడ్ సెక్యూరిటీ? -కార్టూన్

రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది. వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు…

తెలంగాణ ప్రజకు అభినందన వందనం!

యు.పి.ఎ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాయి. ఎల్లుండి (ఆగస్టు 1) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతున్నది. అందులో కూడా ఏకగ్రీవ తీర్మానమే ఆమోదం పొందుతుంది. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనప్రాయమే. గత 56 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేకానేక రక్త తర్పణలు కావించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా అభినందన వందనం! సాయంత్రం 4 గంటలకు ప్రారంభం…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

మేడం-తెలంగాణ -కార్టూన్

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.” – భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ…

రాయల-తెలంగాణ ప్రతిపాదన కె.సి.ఆర్ దే!?

రాయల తెలంగాణ ఏర్పాటును మొట్టమొదట ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయారెనా? అవునంటోంది ‘ది హిందు.’ వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజమట! రాయల తెలంగాణ ప్రతిపాదన తనకే ఎదురు తిరగడంతో దానిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ఇప్పుడు నటిస్తున్నారని పత్రిక సూచిస్తోంది.  ది హిందు పత్రిక మాటల్లోనే ఆ సంగతి చూడడం సముచితం. Sounds strange but true that the proposal of ‘Rayala-Telangana’ with ten districts of Telangana and two…

స్పెయిన్ ప్రమాదం: విధ్వంసం-రుధిరం-దుఃఖం పెనవేసుకుని…

ఎంత సేపని! ఈ ప్రమాదం మొదలయ్యి పూర్తి కావడానికి అయిదంటే అయిదే క్షణాలు పట్టింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు 78 ప్రాణాలు హరీమన్నాయి. మృతులు ఎంత హృదయ విదారకంగా మరణించారంటే, 80 మంది మరణించారని చెప్పిన అధికారులు ఆ తర్వాత సంఖ్యను 78కి తగ్గించుకున్నారు. ఈ సంఖ్య మళ్ళీ మారవచ్చని కూడా వారు తెలిపారు. అంటే పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. ప్రమాదంలో విధ్వంసం ధాటికి మృత దేహాల శరీర భాగాలు తునాతునకలై పోవడం వలన ఈ…

తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…

అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!” “ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!” “మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!” దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది.…

మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న

“Politics is the last refuge of scoundrels.” అని పెద్దాయన జార్జి బెర్నార్డ్ షా ఏ సందర్భంలో, ఎందుకు అన్నారో గానీ దాన్ని రుజువు చేయడానికి భారత రాజకీయ నాయకులు అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. అమార్త్య సేన్ తన భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటూ ‘నరేంద్ర మోడి ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పిన సందర్భం వారికి మరోసారి కలిసొచ్చింది. తన అభిప్రాయం చెప్పినందుకు కొందరు బి.జె.పి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక…