బోస్టన్ బాంబర్ లొంగిపోయిన రక్తసిక్త క్షణాలు… -ఫోటోలు

గత ఏప్రిల్ నెలలో బోస్టన్ నగరంలో మారధాన్ పరుగు పందెం జరుగుతుండగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చెచెన్యా నుండి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు అన్నదమ్ములు ఈ పేలుళ్లకు బాధ్యులని అమెరికా ఆ తర్వాత తేల్చింది. పేలుళ్లు జరిగిన రోజే పెద్ద సోదరుడు తామర్లేన్ జర్నాయెవ్ ను ఎఫ్.బి.ఐ పోలీసులు కాల్చి చంపేశారు. రెండు రోజుల పాటు బోస్టన్ శివార్లలోని ఎం.ఐ.టి యూనివర్సిటీ సమీపంలో ఇల్లిల్లూ గాలించిన తర్వాత ఒక…

మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది. వాస్తవానికి ఈ…

ముస్లిం జనాభా: దురభిప్రాయాలు -2

జనాభా పెరుగుదలను ప్రభావితం చేసే కారణాలు ఏమిటి? మతానికి జనాభా వృద్ధికి సంబంధం ఉందా? మతంతో సంబంధం లేకపోతే జనాభా పెరుగుదల దేనితో సంబంధం కలిగి ఉంది? ఇవి పరిశీలించవలసిన ప్రశ్నలు. మతాన్ని ఫెర్టిలిటీతో ముడిపెడుతూ కొన్ని వాదనలు ఉన్నాయి. నిర్దిష్ట మత విశ్వాసాలు వారి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అని వీరి వాదన. ముఖ్యంగా ముస్లింలకు ఈ కారణాన్ని ఆపాదిస్తారు. కానీ కాస్త నిదానించి పరిశోధిస్తే జనాభా పెరుగుదలలో మతం జోక్యం ప్రభావం చాలా…

సి.బి.ఐ కేసు కంచికి, ములాయం యు.పి.ఎ గూటికి

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్…

రిలయన్స్-మంత్రుల్ చెట్టపట్టాల్ -కార్టూన్

కేశవ్ గారి మేజికల్ అప్పీల్ కి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? భారత దేశ రాజకీయ నాయకులు ఈ దేశంలోని అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి, రిలయన్స్ కంపెనీ అధినేత అయిన ముఖేష్ అంబానీతోనూ, ఆయన కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తోనూ పాలు-నీళ్ళు లాగా ఎంతగా కలిసిపోయారో చెప్పగల ఇలస్ట్రేషన్ ఇంతకు మించి ఉంటుందా? ఒకవేళ అర్ధం కాకపోతే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ లోగోనూ, ఈ కార్టూన్ నూ పక్క పక్కనే పెట్టి చూస్తే మర్మం…

నాకు తెలియని ఉదయభాను

ఈ పాట నిన్నే విన్నాను (చూశాను). ఉదయభాను తన అమ్మగారితో కలిసి ఈ పాట రాశారట. పాట రాయడం అటుంచి ఆమె పాడతారని కూడా నాకు తెలియదు. ‘నేను గతంలో చాలాసార్లు పాడాను’ అంటున్న ఆమెను చూసి ‘నిజమా’ అనుకుని హాశ్చర్యపోయేసి అందులోంచి తేరుకునే లోపు ఆమె పాడడం కూడా మొదలుపెట్టారు. పాట ఒక్కోపాదం వినేకొద్దీ నా ఆశ్చర్యం అవధులు దాటింది. మధ్యలో తెలంగాణ యాసలో ఉన్న కొన్ని పదాలు తప్ప  చాలావరకు పాట అర్ధం అయింది.…

మోడీకి అమెరికా వీసా కావాలట!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అమెరికా వీసా కావాలి. ఈ మేరకు తాము అమెరికాను కోరనున్నట్లు బి.జె.పి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా తన మనసులో మాట వెలిబుచ్చారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ అక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం…

బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు, వీల్ చైర్ వ్యక్తి అరెస్టు

బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.…

అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు.  జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని…

తెలంగాణ ఖాయమేనట!

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది…

ముస్లింల జనాభా: అభిప్రాయాలూ – దురభిప్రాయాలు

భారత దేశంలో హిందువులు, ముస్లింల జనాభా వృద్ధి విషయంలో వివిధ వేదికల పైన అనేక వాదనలు, ప్రతి వాదనలు జరుగుతుంటాయి. వీటిలో హిందూ అతివాద శక్తులు సాగించే దుష్ప్రచారం కలిసిపోయి ఉంటుంది. ఈ దుష్ప్రచారంతో ప్రభావితులై అనేకమంది సామాన్య ప్రజలు కూడా అవే వాదనలు నమ్మి తమకు తెలియకుండానే నోటి మాట ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఒక్క క్షణం నిలబడి ఈ వాదనలు నిజామా కాదా అని ప్రశ్నించుకుని వాటికి ఖచ్చితమైన సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తే తాము…

విషతుల్యమైన పళ్ళెం -ది హిందు సంపాదకీయం

బీహార్, శరణ్ జిల్లాలో కనీసం 22 మంది బడి పిల్లలకు ప్రాణాంతక పరిణామాలను రుచి చూపించిన రోజువారీ మధ్యాహ్న భోజనం భారత దేశంలోని విస్తార భాగాల్లో పాఠశాల విద్య ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదో వెల్లడి చేస్తోంది. ప్రభుత్వాలు ఒక పాఠశాల నిర్మాణానికి కాసింత చోటు చూపించలేకపోవడం, ఆహార పదార్ధాలు కలుషితం అయ్యే ప్రమాదానికి లోనుకాకుండా నిలవ చేయలేకపోవడం… ఈ అంశాలు సార్వత్రిక ప్రాధమిక విద్య పట్ల ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో పట్టిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించి,…

భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్

భారత ఆర్ధిక వ్యవస్ధకు చేసిన జబ్బుకి మళ్ళీ ఎఫ్.డి.ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మందు వేయడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకోడానికీ, ప్రమాదకరంగా ఉన్న కరెంటు ఖాతా లోటును స్ధిరీకరించడానికి ఎఫ్.డి.ఐలు తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వంలోని ఆర్ధిక పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్…

బొలీవియాకు స్పెయిన్ బహిరంగ క్షమాపణ

బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంలో అనుమతి నిరాకరించడం జరగనేలేదని వాదించిన స్పెయిన్ ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. మాస్కో నుండి బొలీవియా ప్రయాణిస్తున్న బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ విమానానికి ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ దేశాలు అనుమతి నిరాకరించడంతో అది అత్యవసరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో దిగవలసి వచ్చింది. ప్రపంచ ప్రజలపై అమెరికా అక్రమ గూఢచర్యం వివరాలను వెల్లడించిన ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ విమానంలో ఉన్నాడన్న అనుమానంతో సి.ఐ.ఏ ఇచ్చిన…

బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి

మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు…