లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు నిజం అయ్యాయి. రాజీనామాపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని ఈ రోజు ఉదయం పత్రికలకు చెప్పిన జస్టిస్ గంగూలీ సాయంత్రానికి రాజీనామా ఇచ్చేశారు. తనకు మద్దతుగా సుప్రీం కోర్టులో దాఖలయిన ‘ప్రజా ప్రయోజనా వ్యాజ్యం’తో తనకు సంబంధం లేదని కూడా గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం…

జిఎస్ఎల్‌వి-డి5 విజయంతో క్రయో క్లబ్ లో ఇండియా

ఆదివారం జి.ఎస్.ఎల్.వి-డి5 ప్రయోగం విజయవంతం అయింది. దీనితో ఇండియా కూడా క్రయోజనిక్ ఇంజన్ సామర్ధ్యం గల దేశాల సరసన నిలిచింది. ఇప్పటివరకూ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం ఐదు దేశాలకు మాత్రమే సొంతం. జి.ఎస్.ఎల్.వి -డి5లో మూడో దశ కోసం అమర్చిన దేశీయ క్రయోజనిక్ ఇంజన్ విజయంవంతంగా పని చేయడంతో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఈ.యు ల సరసన ఇండియా కూడా చేరింది. గత సంవత్సరం ఆగస్టులో జరగవలసిన ప్రయోగం చివరి క్షణాల్లో ఇంధనం లీకేజీని…

బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను

బ్రిటన్ ను పెను తుఫాను వణికిస్తోంది. తుఫాను ఫలితంగా 30 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడుతున్నాయి. దానితో తీర ప్రాంత నగరాలు నీటి సముద్రాలుగా మారాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోగా రేస్ కోర్సులు, మైదానాలు, స్టేడియంలు సైతం నీటితో నిండిపోయాయి. దక్షిణ, పశ్చిమ తీరాలు ప్రధానంగా పెను తుఫాను తాకిడికి గురవుతున్నాయి. తుఫాను తీవ్రత తగ్గలేదని సోమవారం వరకు కొనసాగుతుందని పర్యావరణ శాఖ తెలిపింది. ఇంగ్లాండ్ వ్యాపితంగా 100 కుపైగా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి.…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

రైతుల భూములు లాక్కొని తిరిగివ్వని కోకొకోల

ఉత్తర ప్రదేశ్ లో రైతులపై కోకొకోల కంపెనీ సాగిస్తున్న దౌర్జ్యన్యం ఇది. గ్రామ రైతులు ఉమ్మడిగా వాడుకునే భూమిని అక్రమంగా ఆక్రమించిన కంపెనీ రైతులు ఆందోళన చేసినా ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వలేదు. చివరికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కంపెనీకి నోటీసు ఇచ్చి గడువు విధించింది. గడువు ముగిసినా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని కోలా కంపెనీ రైతులపై ఎదురుదాడికి తెగబడింది. ఆక్రమించిన భూమిని కొన్న భూమిగా వాదిస్తోంది. కోకోకోలా నీటి చౌర్యానికి వ్యతిరేకంగా దాదాపు 15…

ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం

అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత…

కాంగ్రెస్ నెత్తిన ఆదర్శ లాల్ బత్తి -కార్టూన్

“ఆ ఎర్ర బల్పును తీసేసే మార్గం మనకి ఏదో ఒకటి దొరక్కపోదు” – అవినీతి నిర్మూలన! ప్రస్తుతం రాజకీయ పార్టీలకు పట్టుకున్న జ్వరం ఇది. ఈ జ్వరం పట్టుకునేలా చేయడంలో తాము సఫలం అయ్యామని ఎఎపి ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటోంది. ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ చేసిన పని ‘లాల్ బత్తి’ తొలగిస్తామని ప్రకటించడం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అనీ, ఒకరూ ఇద్దరు వి.ఐ.పి లు ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదని ఆయన…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…

ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు

ఉత్తర కొరియా గురించి విషం చిమ్మని పశ్చిమ పత్రిక అంటూ కనపడదు. అక్కడికి విదేశీ విలేఖరులను రానివ్వరని, ఉక్కు తెరల మధ్య ప్రజలు అష్టకష్టాలు పడతారని, రోడ్డు మీద అసలు జనమే కనిపించరనీ… ఇలా రాస్తుంటాయి. ఈ ప్రచారం నిజం కాదని చెప్పడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విలేఖరులను ఆహ్వానించి టూర్లకు తిప్పుతుంది. ఈ టూర్లకు వెళ్ళినవాళ్లు ఫోటోలు తీసుకుని కూడా తమ కోసం ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేశారని పశ్చిమ విలేఖరులు రాయడం కద్దు.…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

యూరో జోన్ ఒడిలో లాత్వియా

బాల్టిక్ రిపబ్లిక్కుల్లో ఒకటయిన లాత్వియా యూరో జోన్ తీర్ధం పుచ్చుకుంది. తద్వారా 18 వ యూరో జోన్ సభ్య దేశంగా అవతరించింది. లాత్వియా ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈ.యు) సభ్యురాలు. ఉమ్మడి ‘యూరో’ కరెన్సీ కలిగిన ఈ.యు దేశాలను యూరో జోన్ గా వ్యవహరిస్తారు. 20 లక్షల జనాభా కలిగిన లాత్వియాను ఆర్ధికంగా కూడా కలుపుకోవడం ద్వారా ఈ.యు ప్రభావం మరింత తూర్పుకు జరిగినట్లయింది. లాత్వియా ప్రభుత్వం యూరో జోన్ లో చేరడానికి నిర్ణయించినప్పటికీ అక్కడి ప్రజలు…

మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే. ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా…

2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష

నూతన సంవత్సరం సందర్భంగా ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్లు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్’ ను సమీక్షించారు. సమీక్ష తాలూకు అంశాలను బ్లాగ్ లో ప్రచురించే అవకాశం కల్పించారు. 2013లో సందర్శకులు 4,00,000 సార్లు ఈ బ్లాగ్ ని చూశారు. 816 కొత్త టపాలు ప్రచురించబడ్డాయి. మొత్తం మీద చూస్తే ఇప్పటివరకూ ఈ బ్లాగ్ లో 2,826 టపాలు ప్రచురితం అయ్యాయి. మరిన్ని వివరాల కోసం కింద లింక్ ను క్లిక్ చేయగలరు. The WordPress.com…