దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…

చిక్కుముడులు అవలీలగా దాటిన మోడి! -కార్టూన్

ది హిందు పత్రిక నుండి నరేంద్ర మోడీకి వచ్చిన ప్రశంసా ఇది? ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేవైపుగా ప్రయాణం చేస్తున్న నరేంద్ర మోడి తన దారిలో ఎదురవుతున్న చిక్కు మూడులను అవలీలగా అధిగమించారని ఈ కార్టూన్ సూచిస్తోంది. తాడు మీద నడవడం చిన్న చిన్న సర్కస్ విద్యలు ప్రదర్శించేవారు చాలా తేలికగా ప్రదర్శించే విద్య. నరేంద్ర మోడి కేవలం తాడు మీద నడవడమే కాదు, తా తాడుపైన తల కిందులుగా కూడా నడిచి చిక్కు మూడులను అధిగమించారని…

ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు. ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన…

పుడమి తల్లి భావాల మాల, నీలాల మేఘమాల

‘ఓహో… మేఘమాలా… నీలాల మేఘమాల’ అంటూ ప్రియ సఖి, సఖుడిని ఉద్దేశించి పాడిన నాయికా నాయికలకు తెలుగు సినిమాలలో కొదవలేదు. ‘నీలి మేఘమా.. జాలీ చూపుమా… ఒక నిమిషమాగుమా’ అంటూ అర్ధించేది ఒకరయితే, ‘మనసు తెలిసిన మేఘమాలా’ అంటూ తమ గోడు చెప్పుకున్న బావా మరదళ్లు మరొకరు. పక్షులకే గాక ప్రేమ పక్షకులకు కూడా నేస్తాలయిన మేఘాలు మానవ సమాజానికి ప్రకృతి ప్రసాదించిన అద్వితీయమైన వరం. ప్రపంచ వ్యాపితంగా వివిధ వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా ఏర్పడిన మేఖాల…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…

రష్యాలో ఆత్మాహుతి దాడి, 16 మంది దుర్మరణం

రష్యాలోని వోల్వోగ్రాడ్ పట్టణ రైల్వే స్టేషన్ లో పట్ట పగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మహిళా మిలిటెంటు తనను తాను పేల్చుకోవడంతో 16 మంది మరణించారని రష్యా టుడే పత్రిక తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని, వారిలో 8 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ పేరు ఒక్సానా అస్లనోవా అని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. మరణాల సంఖ్యను రష్యా పరిశోధనా సంస్ధ ధృవీకరించింది. వోల్గోగ్రాడ్…

మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…

కోర్టుల పాత్రలో మీడియా!

(ఈ ఆర్టికల్ రాసి మూడు వారాలయింది. దిన పత్రిక కోసం ఇక్కడ ప్రచురించకుండా ఆపాను. ఇక ఆ సందర్భం దాటిపోయింది. అందువలన ప్రచురిస్తున్నాను.) కేసు ప్రస్తుతం ఫలానా కోర్టులో ఉంది అని చెప్పుకునే బదులు ‘మీడియా కోర్టులో ఉంది’ అని చెప్పుకునే రోజుల్లో ఉన్నామని అనేకమంది ఈ మధ్య తరచుగా వాపోతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించిన కేసుల్లో న్యాయమూర్తులు నిస్పక్షపాతంగా తీర్పు చెప్పలేని పరిస్ధితి వస్తోందన్నది విమర్శకుల అభిప్రాయం. న్యాయమూర్తి మీడియా ప్రభావం నుండి ఎంత దూరంగా ఉన్నా,…

కరెంటు వైరూ, చిరుగు బేనరూ … కాదేదీ గీతకనర్హం

అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కవితామయమేనోయ్ అన్నీ…  అన్నారు మహాకవి శ్రీ శ్రీ శ్రీ శ్రీ అన్నది కవిత్వం గురించి. కవిత్వం అల్లడానికి అందమైన స్త్రీ మూర్తి మాత్రమే అర్హురాలని భావిస్తున్న రోజుల్లో, రచనా స్ఫూర్తి కోసం కావ్య ప్రబంధాలను బట్టీయం వేయాల్సిందేనని భావించే రోజుల్లో, మనో భావాలను అక్షరీకరించడానికి ఛందోబద్ధ సంకెళ్ళను విధించిన యుగంలో శ్రీ శ్రీ రాసిన ఈ కవిత ఒక పెద్ద సంచలనం! జన తత్వం వంటబట్టాలే…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…

అవినీతి ఫైళ్ళు తగలబెడుతున్న ఢిల్లీ అధికారులు!

అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్…

కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే

దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…