ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్

అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…

ఫుకుషిమా: 8 రెట్లు పెరిగిన రేడియేషన్

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) కంపెనీ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని అణు ధార్మికత నిండిన నీరు ట్యాంకర్ల నుండి లీక్ అవుతుండడమే దీనికి కారణం అని టెప్కో తెలిపింది. టోక్యో, జపాన్ ప్రజలకే కాకుండా అమెరికాకు కూడా వణుకు పుట్టిస్తున్న రేడియేషన్ లీకేజిని అరికట్టడానికి కంపెనీ వద్ద ఆధారపడదగిన…

మంచుతో శిల్పాలు చెక్కినారు…

మనిషి సృజనాత్మకతకు అవధుల్లేవు అనడానికి ఈ మంచు శిల్పాలు ఒక సూచిక. శిల్పాల సంగతి అటుంచి చైనాలో మంచుతో ఏకంగా భవనాలే నిర్మించడం ఫొటోల్లో చూడొచ్చు. ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాల ప్రజలకే ఈ మంచు శిల్పాలు చెక్కే అవకాశం వస్తుందనుకుంటాను. అంటార్కిటికాకు దగ్గర్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా శిల్పాలు చెక్కే మంచు అందుబాటులో ఉంటుందేమో. బిగ్ బెన్ గడియారం దగ్గర్నుండి వివిధ జంతువులు, వివిధ మైధాలజీల పాత్రలు, టైటానిక్ పడవలాంటి ఘటనల వరకూ భారీ…

ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఒక్కో రోజూ తీసుకుంటున్న పాలనా చర్యలు స్వతంత్ర పరిశీలకులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తాము ఎఎపి లో చేరుతున్నామని ప్రకటింస్తున్నారు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులయిన ప్రముఖులు వీరిలో ఉండడం విశేషం. మరోవైపు పెద్ద పెద్ద పార్టీలు నైరాశ్యపు చలికి మునగడ తీసుకుని ఎఎపి ఆకర్షక గాలికి తట్టుకోవడం ఎలాగా అని ఆందోళనలో పడిపోయాయని కార్టూన్ సూచిస్తోంది. నరేంద్ర మోడి రాష్ట్రం గుజరాత్ లో ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్…

నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం…

మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

పూర్తయిన నేరారోపణ, ఇండియా వస్తున్న దేవయాని

దేవయాని సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతోంది. గురువారం వరుసగా, వేగంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు న్యూయార్క్ ప్రాసిక్యూషన్ కోర్టులో దేవయానిపై అభియోగాలను మోపడం పూర్తి అవుతుండగానే ఆమెకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించే ఐరాస భారత శాశ్వత కార్యాలయం బదిలీని ఆమోదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది. దానితో రాయబార రక్షణ ఆసరాతో దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం…

సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం

సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్…

ఎలక్షన్ కమిషన్: భద్రతా భయంతో గూగుల్ ఒప్పందం రద్దు

భారత ఎలక్షన్ కమిషన్ ఒక భేషయిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల వల్ల కాని పని తనకు చేతనవునని చాటుకుంది. ఓటర్ల సేవల నిమిత్తం గూగుల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ లు ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారులందరి పైనా గూఢచర్యం సాగిస్తున్నాయని, దీనికి గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికన్ ఇంటర్నెట్…

కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అందరికీ ఐడియాలు సమకూర్చిపెడుతోంది. బేషరతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు 18 షరతులు విధించిన ఆప్, అనంతరం కాంగ్రెస్ మద్దతు స్వీకరణకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వినూత్న ప్రజాస్వామిక ఆచరణకు నాంది పలికింది. ఆప్ నుండి ‘క్లూ’ అందిపుచ్చుకున్నారేమో ఇప్పుడు బాబా రామ్ దేవ్ మోడీకి మద్దతు ఇస్తాను గానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయ్ అంటున్నారు. తాను మొదట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాననీ కానీ…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…

పోలార్ వర్టెక్స్ అంటే?

పోలార్ వర్టెక్స్ వలన అమెరికాలో అత్యంత కనిష్ట స్ధాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానితో అక్కడ ప్రజా జీవనం దాదాపు స్తంభించిపోయింది. -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పత్రికలు చెబుతున్నాయి. ది హిందూ పత్రిక ఈ ఉష్ణోగ్రతలను సెంటీ గ్రేడ్ లలో చెప్పగా రష్యా టుడే ఫారెన్ హీట్ లలో తెలిపింది. –50o C వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే మాత్రం 56o F కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలిపింది.…

పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా

అమెరికా ప్రస్తుతం ‘పోలార్ వొర్టెక్స్’ చలి కౌగిలిలో వణికిపోతోంది. మధ్య పశ్చిమ (Midwest) అమెరికా రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఆర్కిటిక్ చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత -52o C వరకు నమోదయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావద్దని ప్రభుత్వాలు కోరాయి. తీవ్ర చలిగాలులు ఉన్న చోట బైటికి వెళితే తెలియకుండానే గడ్డకట్టుకుని…