కాంగ్రెస్ నెత్తిన ఆదర్శ లాల్ బత్తి -కార్టూన్

“ఆ ఎర్ర బల్పును తీసేసే మార్గం మనకి ఏదో ఒకటి దొరక్కపోదు” – అవినీతి నిర్మూలన! ప్రస్తుతం రాజకీయ పార్టీలకు పట్టుకున్న జ్వరం ఇది. ఈ జ్వరం పట్టుకునేలా చేయడంలో తాము సఫలం అయ్యామని ఎఎపి ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటోంది. ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ చేసిన పని ‘లాల్ బత్తి’ తొలగిస్తామని ప్రకటించడం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అనీ, ఒకరూ ఇద్దరు వి.ఐ.పి లు ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదని ఆయన…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…

ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు

ఉత్తర కొరియా గురించి విషం చిమ్మని పశ్చిమ పత్రిక అంటూ కనపడదు. అక్కడికి విదేశీ విలేఖరులను రానివ్వరని, ఉక్కు తెరల మధ్య ప్రజలు అష్టకష్టాలు పడతారని, రోడ్డు మీద అసలు జనమే కనిపించరనీ… ఇలా రాస్తుంటాయి. ఈ ప్రచారం నిజం కాదని చెప్పడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విలేఖరులను ఆహ్వానించి టూర్లకు తిప్పుతుంది. ఈ టూర్లకు వెళ్ళినవాళ్లు ఫోటోలు తీసుకుని కూడా తమ కోసం ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేశారని పశ్చిమ విలేఖరులు రాయడం కద్దు.…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

యూరో జోన్ ఒడిలో లాత్వియా

బాల్టిక్ రిపబ్లిక్కుల్లో ఒకటయిన లాత్వియా యూరో జోన్ తీర్ధం పుచ్చుకుంది. తద్వారా 18 వ యూరో జోన్ సభ్య దేశంగా అవతరించింది. లాత్వియా ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈ.యు) సభ్యురాలు. ఉమ్మడి ‘యూరో’ కరెన్సీ కలిగిన ఈ.యు దేశాలను యూరో జోన్ గా వ్యవహరిస్తారు. 20 లక్షల జనాభా కలిగిన లాత్వియాను ఆర్ధికంగా కూడా కలుపుకోవడం ద్వారా ఈ.యు ప్రభావం మరింత తూర్పుకు జరిగినట్లయింది. లాత్వియా ప్రభుత్వం యూరో జోన్ లో చేరడానికి నిర్ణయించినప్పటికీ అక్కడి ప్రజలు…

మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే. ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా…

2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష

నూతన సంవత్సరం సందర్భంగా ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్లు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్’ ను సమీక్షించారు. సమీక్ష తాలూకు అంశాలను బ్లాగ్ లో ప్రచురించే అవకాశం కల్పించారు. 2013లో సందర్శకులు 4,00,000 సార్లు ఈ బ్లాగ్ ని చూశారు. 816 కొత్త టపాలు ప్రచురించబడ్డాయి. మొత్తం మీద చూస్తే ఇప్పటివరకూ ఈ బ్లాగ్ లో 2,826 టపాలు ప్రచురితం అయ్యాయి. మరిన్ని వివరాల కోసం కింద లింక్ ను క్లిక్ చేయగలరు. The WordPress.com…

దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…

చిక్కుముడులు అవలీలగా దాటిన మోడి! -కార్టూన్

ది హిందు పత్రిక నుండి నరేంద్ర మోడీకి వచ్చిన ప్రశంసా ఇది? ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేవైపుగా ప్రయాణం చేస్తున్న నరేంద్ర మోడి తన దారిలో ఎదురవుతున్న చిక్కు మూడులను అవలీలగా అధిగమించారని ఈ కార్టూన్ సూచిస్తోంది. తాడు మీద నడవడం చిన్న చిన్న సర్కస్ విద్యలు ప్రదర్శించేవారు చాలా తేలికగా ప్రదర్శించే విద్య. నరేంద్ర మోడి కేవలం తాడు మీద నడవడమే కాదు, తా తాడుపైన తల కిందులుగా కూడా నడిచి చిక్కు మూడులను అధిగమించారని…

ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు. ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన…

పుడమి తల్లి భావాల మాల, నీలాల మేఘమాల

‘ఓహో… మేఘమాలా… నీలాల మేఘమాల’ అంటూ ప్రియ సఖి, సఖుడిని ఉద్దేశించి పాడిన నాయికా నాయికలకు తెలుగు సినిమాలలో కొదవలేదు. ‘నీలి మేఘమా.. జాలీ చూపుమా… ఒక నిమిషమాగుమా’ అంటూ అర్ధించేది ఒకరయితే, ‘మనసు తెలిసిన మేఘమాలా’ అంటూ తమ గోడు చెప్పుకున్న బావా మరదళ్లు మరొకరు. పక్షులకే గాక ప్రేమ పక్షకులకు కూడా నేస్తాలయిన మేఘాలు మానవ సమాజానికి ప్రకృతి ప్రసాదించిన అద్వితీయమైన వరం. ప్రపంచ వ్యాపితంగా వివిధ వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా ఏర్పడిన మేఖాల…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…