ఇండియాలో అమెరికా రాయబారుల వీసా ఫ్రాడ్

తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు…

బొగ్గు కుంభకోణం vis-à-vis పర్యావరణ అనుమతి -కార్టూన్

ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా బొగ్గు తవ్వి పారేస్తున్న కంపెనీలు కొన్నాయితే పర్యావరణ అనుమతులు లేకుండానే లక్షల టన్నుల బొగ్గు గనుల్ని అట్టే పెట్టుకున్న కంపెనీలు మరి కొన్ని. ఇవి సాదా సీదా కంపెనీలు కూడా కాదు. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంకేతాలుగా పాలకులు సగర్వంగా చాటుకునే కంపెనీలు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్, అదాని పవర్.. ఇత్యాది కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బొగ్గు కేటాయింపులకు కేంద్రం ఏర్పాటు…

అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…

దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’…

ఎఎపిపాలన: అప్పుడే తిరుగుబాటు?

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చిన్నపాటి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి విఫలం అయిన వినోద్ కుమార్ బిన్నీ ఈ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్నాడు. అయితే ఆయనకు మద్దతుగా ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఎఎపి ప్రభుత్వం తన సిద్ధాంతాల నుండి పక్కకు వెళ్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అవుతోందని బిన్నీ ఆరోపించాడు. అధికారం చేపట్టి మూడు వారాలు కూడా కాక మునుపే ఈ రకం విమర్శ చేయడంలోనే…

ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా? జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ… నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం…

క్వాంటమ్: ఆఫ్-లైన్ కంప్యూటర్లపైనా అమెరికా నిఘా

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ ఆన్-లైన్ కంప్యూటర్ల పైనే కాకుండా ఆఫ్-లైన్ కంప్యూటర్లపైన కూడా నిఘా పెట్టే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడి అయింది. ఇంటర్నెట్ తో కనెక్షన్ లేకపోయినా నిఘా పెట్టగల పరికరాలను తయారు చేసుకున్న ఎన్.ఎస్.ఏ ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలకు చెందిన అత్యంత ముఖ్యమైన లక్షకుపైగా కంప్యూటర్లపై వాటి సాయంతో గూఢచర్యం నిర్వహించిందని తెలిసింది. లక్ష్యిత కంప్యూటర్లలో రేడియో తరంగాలను వెలువరించే పరికరాలను, తగిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను ఇన్ స్టాల్ చెయ్యడం…

మోడీకి నీతివంతులైన యువకులు కావాల్ట! -కార్టూన్

‘రాజకీయాలు ఎలా చేయాలో మేం వారికి నేర్పుతాం’ అని అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం అన్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది పైకే నవ్వితే చాలా మంది లోలోపలే నవ్వుకున్నారు. అరవింద్ ది అతి విశ్వాసం అని చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కానీ ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లుగా ఇప్పుడు ఎఎపి వల్ల ప్రభావితం కానీ పార్టీ అనేదే ఇండియాలో లేకుండా పోయింది. కాంగ్రెస్ అగ్ర యువ నేత రాహుల్ గాంధీ ఎఎపిని…

కవోష్ణ జ్వాలల జిమ్ము సినబాంగ్ అగ్నికొండ -ఫోటోలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర రాష్ట్రంలోని సినబాంగ్ అగ్ని కొండ ఇంకా మండుతూనే ఉంది. తానే రగిలే వడగాలై అగ్ని కిలలు విరజిమ్ముతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి భారీ పరిణామాల్లో బూడిద, లావా, మంటలు ఆకాశంలోకి ఊస్తున్న సినబాంగ్ కొండ ధాటికి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలస పోవాల్సిన పరిస్ధితి. సినబాంగ్ కొండ చిమ్ముతున్న బూడిద పరిమాణాలను చూస్తే అక్కడేదో అణు బాంబు పేలినట్లే కనిపిస్తోంది. పైరో క్లాస్టిక్ వాయువు, బూడిద, మంటలు అని పిలుస్తున్న…

రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!

మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో

ఢిల్లీ ప్రభుత్వం పాత నిర్ణయాన్ని తిరగదోడింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న షీలా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. తాము ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకం కాదని కానీ తమ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రిటైల్ వర్తకం ఎఫ్.డి.ఐ చట్టం ప్రకారం బహుళ బ్రాండుల చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించేదీ లేనిదీ…

గొర్రెని చూసి పులి చారల్ని చెరిపేసుకున్నట్లు…

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా? ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో…

ఆయన విప్లవ ద్రోహి, ఆమె అతని భార్య కాదు -మావోయిస్టులు

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన గుడ్స ఉసెండి అలియాస్ సుఖదేవ్ అలియాస్ గుముడవెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ను విప్లవ ద్రోహి గా సి.పి.ఐ(ఎం-ఎల్-మావోయిస్టు) పార్టీ ప్రకటించింది. పార్టీతో ఆయనకు సైద్ధాంతీక విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఒట్టిదే అని పార్టీ తెలిపింది. నైతికంగా దిగజారిన సుఖదేవ్ విప్లవ ద్రోహిగా మారి పోలీసులకు లొంగిపోయాడు తప్ప రాజకీయ విభేదాల వల్ల కాదని తెలిపింది. ఆయన భార్య పార్టీలోనే కొనసాగుతున్నారని, బైటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మహిళను వెంటపెట్టుకుని వెళ్ళి…

చలికి చివికిపోతున్న అమెరికా దౌత్యం -కార్టూన్

తాజా రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఉనికిలో ఉన్న వాతావరణంతో పోలిక పెట్టి పాఠకులకు గిలిగింతలు పెట్టడం కార్టూనిస్టులకు ఇష్టమైన విద్య. ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కూడా ఈ కార్టూన్ లో ఈ విద్యనే ప్రదర్శించారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావంతో గత వారం అంతా అమెరికా చలితో గజ గజ వణికిపోయింది. కొన్ని చోట్ల -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయేంతగా చలి గాలులు అమెరికాను పీడించాయి. ఆర్కిటిక్ చలి వాతావరణాన్ని సహజసిద్ధంగా పట్టి బంధించే…

నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా అని మనకి తెలిసిందే. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే ఈ భారీ జలపాతం నిత్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫొటోల్లో చూస్తేనే గుండెలు గుభిల్లుమానిపించే ఈ జలపాతం గడ్డ కడితే?! పోలార్ వొర్టెక్స్ పుణ్యమాని అటువంటి అరుదైన ప్రకృతి దృశ్యం మనిషి కళ్ల ముందు ఆవిష్కృతం అయింది. అమెరికా, కెనడాల సరిహద్దులో విస్తరించి ఉండే నయాగరా జలపాతం వద్ద చరిత్రలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…