టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్

టామ్ & జెర్రీ కార్టూన్ సీరియల్/సినిమాను ఇష్టపడని వారెవరుంటారు? 1940ల్లో ఉనికిలోకి వచ్చింది లగాయితు అనేక తరాల పాటు ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. బలం పెద్దగా లేని చిట్టెలుక తన తెలివితేటలతో బలవంతురాలైనన పిల్లిని ఎలా బురిడీ కొట్టించేదీ ఈ షో చూపిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఎపి, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం కూడా టామ్ & జెర్రీ ఆటను తలపిస్తోందని కార్టూనిస్టు కేశవ్ ఈ కార్టూన్ లో చెబుతున్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి మహా…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

ఎవడు లాగితే లగడపాటి కిందపడతాడో…

“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి. జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు. మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు

ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల తాము చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయిందని ఢిల్లీ లోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు సంతృప్తి ప్రకటిస్తున్నారు. విదేశీయుల కార్యకలాపాల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని, ఢిల్లీ మంత్రి సోమ్ నాధ్ భారతి తనిఖీ, ముఖ్యమంత్రి ధర్నా వలన తమ ఏరియాలో పోలీసుల నిఘా పెరిగిందని వారు తెలిపారు. కాగా ధర్నా నిర్వహించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

గుజరాత్: అప్పుల కుప్పగా మార్చిన మోడి

నరేంద్ర మోడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2001-02 లో గుజరాత్ అప్పు 45,301 కోట్లు కాగా అది 2013-14 నాటికి 1.76 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. ఈ డజను సంవత్సరాల్లో గుజరాత్ కి చేసిన సేవ ఇక చాలనుకుని దేశం మొత్తానికి సేవ చేస్తానని మోడి బయలుదేరారు. భారత మాత రుణం తీర్చుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానని మోడి ఓ సందర్భంలో చెప్పారు కూడా. (మోడి తరహాలోనే భారత మాత రుణం తీర్చుకోవాలని దేశ…

85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం…

సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…

అసమాన వ్యవస్ధలకు పునాది అసమానతల బాల్యం -ఫోటోలు

ప్రపంచ వ్యాపితంగా ఏ దేశం చూసినా అసమానతలతో నిండి ఉన్నదే. బాల్యం నుండే అసమానతలను సహజ న్యాయంగా చూపించే వ్యవస్ధలో, మతంలో, నమ్మకాల్లో ఆ అసమానతల్ని రూపుమాపే బదులు న్యాయబద్ధం చేసే సూత్రాలకు కొదవ లేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా ఇదే పరిస్ధితి. కొందరు నోట్లో బంగారు స్పూన్ తో పుడితే అనేకమందిని కటిక నేల ఆదరించి సాకుతుంది. ఈ ఫోటోలు చేప్పేదీ అదే.

ఎన్నికల్లో రెడ్ కార్పెట్, పాలనలో నో కార్పెట్ -కార్టూన్

ఎర్ర తివాచీ పైన నడిచి వచ్చినట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గి వచ్చిన ఎఎపికి పాలనలోకి వచ్చాక గాని మర్మం బోధపడలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి లు చెప్పేది కూడా ఇదేగా? అవినీతిని అంతం చేయడానికి జన్ లోక్ పాల్ తేవాలంటూ అన్నా, అరవింద్ ల బృందం ఆందోళన చేస్తున్నపుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది’ అని సవాలు విసిరాయి రాజకీయ పార్టీలు. సవాలు స్వీకరించిన అరవింద్ ఎఎపి కి అంకురార్పణ చేయగా…

సునందది ఆకస్మిక, అసహజ మరణం -ఎఐఐఎంఎస్

కేంద్ర మంత్రి శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ మరణం “ఆకస్మికం, అసహజం” అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. విష ప్రయోగం జరగలేదని నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు జరుపుతామని తెలిపారు. శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధ డాక్టర్లు ఈ విషయాలు తెలిపారు. డాక్టర్ల నిర్ధారణలతో హత్య అన్న అనుమానాలు తలెత్తాయి. సునంద పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి ఆమెపై దాడి…

శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం…

ఎఎపి వెనుక ఫోర్డ్ ఫౌండేషన్?

ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్ధలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఎఎపి కి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్.ఐ ల పేరుతో అమెరికా నుండి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు.…