మీజీ పునరుద్ధరణ: జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి నాంది

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ –పార్ట్ 6 (భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది ఆరవ భాగం. మొదటి 5 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్) చాప్టర్ III మీజీ పునరుద్ధరణ మరియు జపాన్ పెట్టుబడిదారీ మార్గం      1850ల వరకూ జపాన్ రాజకీయంగా మూసివేయబడ్డ సమాజం. యూరప్ లో…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ వీరాలాపాలు వల్లిస్తూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఒంటరి యోధుడిలా జనం ముందు నిలబడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన అప్పజెప్పడానికి సిద్ధపడుతున్న వైనం ఇది. ముఖ్యమంత్రి చర్యలను ఆర్ధిక శాఖ అభ్యంతరం చెబుతున్నా వినకుండా 15 నుండి 20 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసే సమావేశం సోమవారం…

బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. పాత నోట్ల ఉపసంహరణ…

ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి

ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వ పాలనలో మరో రెండు అసాధారణ అంశాలు నమోదయ్యాయి. నిజానికి అసాధారణం కాదు. మన ప్రభుత్వాల విధానాల ప్రజా వ్యతిరేక స్వభావంలోని సాధారణత్వం వలన ఎఎపి తీసుకుంటున్న సాధారణ చర్యలు కూడా అసాధారణంగా కనిపిస్తున్నాయి. వాహనదారుల పర్సు లాక్కొని డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఒక అంశం. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న లక్షకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విధాన నిర్ణయం తీసుకోవడం…

టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్

టామ్ & జెర్రీ కార్టూన్ సీరియల్/సినిమాను ఇష్టపడని వారెవరుంటారు? 1940ల్లో ఉనికిలోకి వచ్చింది లగాయితు అనేక తరాల పాటు ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. బలం పెద్దగా లేని చిట్టెలుక తన తెలివితేటలతో బలవంతురాలైనన పిల్లిని ఎలా బురిడీ కొట్టించేదీ ఈ షో చూపిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఎపి, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం కూడా టామ్ & జెర్రీ ఆటను తలపిస్తోందని కార్టూనిస్టు కేశవ్ ఈ కార్టూన్ లో చెబుతున్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి మహా…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

ఎవడు లాగితే లగడపాటి కిందపడతాడో…

“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి. జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు. మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు

ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల తాము చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయిందని ఢిల్లీ లోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు సంతృప్తి ప్రకటిస్తున్నారు. విదేశీయుల కార్యకలాపాల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని, ఢిల్లీ మంత్రి సోమ్ నాధ్ భారతి తనిఖీ, ముఖ్యమంత్రి ధర్నా వలన తమ ఏరియాలో పోలీసుల నిఘా పెరిగిందని వారు తెలిపారు. కాగా ధర్నా నిర్వహించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

గుజరాత్: అప్పుల కుప్పగా మార్చిన మోడి

నరేంద్ర మోడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2001-02 లో గుజరాత్ అప్పు 45,301 కోట్లు కాగా అది 2013-14 నాటికి 1.76 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. ఈ డజను సంవత్సరాల్లో గుజరాత్ కి చేసిన సేవ ఇక చాలనుకుని దేశం మొత్తానికి సేవ చేస్తానని మోడి బయలుదేరారు. భారత మాత రుణం తీర్చుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానని మోడి ఓ సందర్భంలో చెప్పారు కూడా. (మోడి తరహాలోనే భారత మాత రుణం తీర్చుకోవాలని దేశ…

85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం…

సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…