తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ను తిరస్కరించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ గత బి.ఎ.సి సమావేశంలోనే చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం అయింది. అయితే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభా కార్యక్రమాలకు అడ్డు పడడంతో తీర్మానం ఎలా ప్రవేశపెడతారన్న ప్రశ్న ఉదయించింది. ఈ సమస్యను అధిగమించడానికి…














