1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్

1962 నాటి ఇండియా-చైనా యుద్ధంలో మొదట దాడి చేసింది ఇండియాయేనని చైనా కాదని  సీనియర్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు నెవిల్లే ప్రకటించారు. ఆనాటి యుద్ధానికి సంబంధించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న పత్రాలను తాను త్వరలో ప్రచురిస్తానని మాక్స్ వెల్ తెలిపారు. పత్రాలను ప్రచురించడం ద్వారా తాను “భ్రాంతిజనకమైన భారతీయ అభిప్రాయాలను పారద్రోలతానని” మాక్స్ వెల్ చెప్పడం విశేషం. 1962 నాటి యుద్ధం చైనా వల్లనే సంభవించిందని భారత దేశంలోని పాఠ్య పుస్తకాలు చెబుతాయి. హిందూ మతోన్మాద సంస్ధలు కూడా…

చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో…

దేవయాని: అమెరికా రాయబారి రాజీనామా

భారత దేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. ఆమె రాయబారిగా నియమితులై రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపే రాజీనామా చేయడానికి దేవయాని ఖోబ్రగదే వ్యవహారమే కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలవడం ద్వారా ఏడేళ్ళ బాయ్ కాట్ కి లాంఛనంగా తెరదించిన నాన్సీ పావెల్ రాజీనామా కొంత కాలంగా అమెరికా విదేశాంగ శాఖ చర్చల్లో నలుగుతున్నదే అని తెలుస్తోంది. రాజీనామా అనంతరం నాన్సీ…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

అమెరికా: మట్టి పెళ్ల కూలి ఓ పట్నం మాయం -ఫోటోలు

వాషింగ్టన్ రాష్ట్రంలోని ఓసో పట్నం వాసులకు మార్చి 22 ఓ మహా దుర్దినం అయింది. అప్పటికి మూడు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చరియ కూలిపోవడంతో దానికింద పడి ఆ పట్నం దాదాపు అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకూ 17 మంది మరణించారని ప్రకటించగా 90 మంది జాడ తెలియలేదు. వీరంతా చనిపోయారన్న నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చేశాయి. వారి బంధువులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. స్ధానికులు ఈ కొండను ‘స్లైడ్…

గూగుల్ Vs బైదు (చైనా): అమెరికాలో వింత తీర్పు

మనకి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఎలాగో అమెరికాలో ఫస్ట్ అమెండ్ మెంట్ అలాగ. ఈ ఫస్ట్ అమెండ్ మెంట్ ని అడ్డం పెట్టుకుని చైనా సర్చ్ ఇంజన్ బైదు పైన దెబ్బ కొట్టాలని చూసిన చైనీస్ అమెరికన్ ప్రముఖులు కొందరు అమెరికా కోర్టు ఇచ్చిన ఓ విచిత్రమైన తీర్పుతో తామే ఖంగు తినాల్సి వచ్చింది. చైనా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే భావాలను చైనాలో అడుగు పెట్టకుండా బైదు సర్చ్ ఇంజన్ ఫిల్టర్ చేసి అడ్డుకుంటోందని దీనివల్ల తమ ప్రజాస్వామిక…

ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్

మేనిఫెస్టో: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేస్తాం. జనం: ఇదిగో ఈ ఒక్క పేజీని మీ మేనిఫెస్టో చెయ్యండి చాలు! *** రాజకీయ పార్టీలు ప్రస్తుతం మేనిఫెస్టోల జాతరలో మునిగి తేలుతున్నాయి. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేయగా బి.జె.పి దాన్ని అబద్ధాలు, మోసపూరితం అంటూ కొట్టిపారేస్తోంది. అక్కడికి బి.జె.పి మేనిఫెస్టో పక్కా నిజాయితీతో తయారు చేసినట్టు! ది హిందు పత్రిక ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో…

మోడి సెకండ్ రేట్ లీడర్ -హిందూ స్వాములు

బి.జె.పి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఒక పక్క తెలుగు సినీ తారలు ఆకాశానికెత్తుతుండగా మరో పక్క హిందూ పీఠాధిపతులు ఆయన్ను విమర్శిస్తున్నారు. బి.జె.పి కార్యకర్తలను ‘వ్యక్తి పూజ’ చేసేలా ఆయన ప్రోత్సహిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ‘హర హర మహా దేవ’ కు బదులుగా ‘హర హర మోడి’ అంటున్నా మోడి వారిని వారించ లేదని విమర్శిస్తున్నారు. వారణాసిలో ఇటీవల జరిగిన బి.జె.పి ర్యాలీలో జరిగిన ఘటన పట్ల వివిధ పీఠాధిపతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.…

న్యూట్రల్ ఓటుతో భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక

ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో…

అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు

తమ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రకటించింది. చికాగో రాష్ట్ర ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు చార్లెస్ ఇవాన్స్ ఈ మేరకు స్పష్టం చేశారని రాయిటర్స్ తెలిపింది. వడ్డీ రేటు పెంచితే ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ గాడి తప్పుతుందని ఆయన అంచనా వేశారు. నిరుద్యోగం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, బాగా తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వల్ల…

ఈ శ్రామిక మహిళ, మౌనంగానే… ఎదిగింది -కత్తిరింపు

వ్యవసాయాన్ని కనిపెట్టింది మహిళలని సామాజిక చరిత్రకారులు చెబుతారు. ఈ విషయంలో ఎవరికన్నా అనుమానం ఉంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలం జిన్నెల గూడెం నివాసి సాయమ్మను చూస్తే తమ అనుమానాన్ని ఇట్టే పోగొట్టుకుంటారు. సొంత పొలంలో వ్యవసాయం చెయ్యడమే కాకుండా సొంత పనిలేనప్పుడు కూలీకి కూడా వెళ్ళే సాయమ్మ తన జీవితాన్ని శ్రమకే అంకితం చేసింది. ఒంటరి వ్యవసాయంతో సోదరి కుటుంబాన్ని సైతం ఆదుకుంటున్న సాయమ్మ సాహసిక జీవనాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి విలేఖరి ఎం.ఏ.సమీర్ అభినందనీయులు.…

చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు

లండన్, న్యూయార్క్ నగరాల్లో ఓ తెలుగు కుర్రాడు తన కెమెరాలో బంధించిన అద్భుత దృశ్యాలివి. తనను తాను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పోలేపెద్ది చంద్ర శేఖర్ (ఈ బ్లాగ్ లో వ్యాఖ్య ద్వారా) చెప్పుకున్నారు. కానీ ఆయన తీసిన ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఆయన అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే నమ్మ బుద్ధి అయ్యేలా లేవు. చేయి తిరిగిన (కన్ను తిరిగిన అనాలేమో!) ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలివి అని చెప్పినా ఇట్టే నమ్మొచ్చు. ఈ ఫొటోల్లో మనుషులు…

మోడీజీ, అది ఎ.కె-49 కాదు చీపురు! -కార్టూన్

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదవికి పోటీ పడుతున్న వ్యక్తికి ఉండాల్సిన స్ధాయికి తగిన విధంగా లేవని ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శకు తగినట్లుగానే నరేంద్ర మోడి నిన్న (మార్చి 26) మరో చవకబారు విమర్శను ఎక్కుపెట్టారు. జమ్ము & కాశ్మీర్ లో ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన మోడి దేశంలో మూడు ఏ.కె లు పాకిస్తాన్ కి సహాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.…

భూ సంస్కరణలు – జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధి

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ పార్ట్ – 7 (భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది 7 వ భాగం. మొదటి 6 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్) *********            నెపోలియన్ III యొక్క (జపాన్ కి కేటాయించబడిన) మంత్రి తోకుగావా బకుఫుతో ఫ్రెంచి అలయన్స్ కోసం ప్రయత్నించగా…

సోనీ ప్రపంచ ఫోటోగ్రఫి పోటీ -ఫోటోలు

సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల ఫలితాలను వారం రోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుతానికి మూడు విభాగాల ఫలితాలను విభాగాల వారీగా ప్రకటించారు. మూడు కేటగిరీలకు (ఓపెన్, యూత్, నేషనల్) గానూ ప్రపంచం నలుమూలల నుండి ఎంట్రీలు వచ్చాయి. మూడు విభాగాలకు కలిపి మొత్తం 70,000 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తం మీద (ఓవరాల్) విజయులు ఎవరో ఏప్రిల్ 30 తేదీన మాత్రమే ప్రకటిస్తారు. ఈ లోపు వివిధ విభాగాలలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించారు. అనేక…