కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల డిమాండ్. సంఘ్ పరివార్ సంస్ధల్లోనూ, కేడర్ లోనూ హిందూత్వ హార్డ్ లైనర్ గా ప్రసిద్ధి చెందిన నరేంద్ర మోడి కాశ్మీరు వేర్పాటు వాదులతో అందునా హార్డ్ లైనర్ నేతలతో రాయబారం నడుపుతారని ఊహించగలమా? ఊహించలేం. కానీ మోడి ఆ పని చేశారని కాశ్మీరు వేర్పాటువాద నేతల్లో హార్డ్ లైనర్ గా పేరు పొందిన సయ్యద్ ఆలీ…

ప్రమాదవశాత్తు ప్రధాని, ప్రమాదాల ప్రధాని -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్…

మోడి వికాస పురుషుడు కాదు, వినాశ పురుషుడు -ఉమాభారతి

ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఒకరి బండారం మరొకరు బైటపెట్టుకునే పనులు జోరందుకున్నాయి. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటి’ అంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జనానికి ఏమిటి, ఎలా చేస్తామో చెప్పడం మాని ‘నువ్వు వెధవ’ అంటే ‘నువ్వు వెధవ’ అని తిట్టిపోసుకుంటున్నాయి. ‘రీ కౌంటింగ్ మంత్రి’ అని ఒకరు వెకిలి చేస్తే ‘ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి’ అని మరొకరు గుట్టు విప్పుతున్నారు. మోడిపై గతంలో ఉమాభారతి చేసిన విమర్శల వీడియోను తాజాగా వెలికి తీయడం…

ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…

300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు

దక్షిణ కొరియాలో మహా విషాధం సంభవించింది. వందలాది మంది పాఠశాల పిల్లల్ని ఒక ద్వీపానికి విహార యాత్రకు తీసుకెళ్తున్న ఒక నౌక ప్రమాదానికి గురయింది. హఠాత్తుగా పక్కకు ఒరగడం మొదలు పెట్టిన నౌక క్రమంగా సాయంత్రానికి నీళ్ళల్లో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. టైటానిక్ పడవ మధ్యలో విరిగిపోయినట్లు ఈ పడవ విరగలేదు గానీ బైటి జనం, ఫోటోగ్రాఫర్లు చూస్తుండగానే కాస్త కాస్త మునిగిపోతూ పెను విపత్కర దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది. నౌక మునిగిపోతున్నప్పటికీ దానిని వెంటనే ఖాళీ…

ఢిల్లీ మెట్రోల్లో మహిళా జేబుదొంగలే ఎక్కువ

ఢిల్లీ నమోదు చేసిన విచిత్రం ఇది. ఢిల్లీ మెట్రో రైళ్లలో గత నెలలో 27 మంది జేబు దొంగలని అరెస్టు చేయగా వారిలో 26 మంది మహిళలే. ఈ నేపధ్యంలో మహిళా జేబు దొంగల సంఖ్య బాగా పెరుగుతోందని ఢిల్లీ పోలీసులు మొత్తుకుంటున్నారు. గతేడు 400 పిక్ పాకెట్ కేసుల్ని ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అందులో 90 శాతం వరకూ మహిళలే ముద్దాయిలుగా దొరికిపోయారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీళ్ళెవరూ సంఘటిత గ్యాంగులకు చెందిన వారు…

భాషేదైనా కానీ ఈ బుజ్జిదాని పాట చూడాల్సిందే -వీడియో

‘సంగీతానికి ఎల్లలు లేవు’ అని సంగీతం గురించి తెలిసినవారు, తెలియని వారు కూడా తరచుగా చెప్పే మాట! ఎల్లలు అంటే ఏ ఎల్లలో తెలియదు గానీ భాషా పరమైన ఎల్లలు కూడా లేవని ఈ వీడియో చూస్తే (వింటే) వచ్చే ఆనందం ద్వారా మన అనుభవంలోకి వస్తుంది. – ఈ కొరియా పాప (లేకపోతే చైనీస్ పాపో, జపనీస్ పాపో అయినా అయి ఉండవచ్చు) పాడింది ఒక్క నిమిషం మాత్రమే. ఆల్రెడీ రికార్డ్ చేసిన పాటకు నటించిందా…

ఆర్.టి.ఐ పరిధిలో మోడి, వాజ్ పేయ్ ఉత్తర ప్రత్యుత్తరాలు?

2002 నాటి గుజరాత్ మారణకాండ కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరలో బహిరంగం కావచ్చని తెలుస్తోంది. అయితే దీనికి గుజరాత్ ప్రభుత్వం మరియు, ముఖ్యమంత్రి మోడిల అనుమతిని ప్రధాన మంత్రి కార్యాలయం కోరుతున్నట్లు తెలుస్తోంది. గోధ్రా రైలు దహనం అనంతర కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రి ల మధ్య జరిగిన సంభాషణను వెల్లడి చేయాలంటూ ఆర్.టి.ఐ కార్యకర్త ఒకరు దరఖాస్తు చేయగా దానిని ప్రధాన మంత్రి…

భారత దేశపు రేప్ అనుకూల లాబీ -ది హిందూ సంపాదకీయం

(ముంబై శక్తి మిల్స్ అత్యాచార నిందితుల్లోని ముగ్గురు రిపీట్ అఫెండర్స్ కు కోర్టు మరణ శిక్ష విధించిన నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ “అబ్బాయిలు అబ్బాయిలే. వారు తప్పు చేయరా” అని వ్యాఖ్యానించి పెను దుమారానికి తెరతీశారు. అవి ఆయన పొరబాటుగా అన్న మాటలు కావనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారని ది హిందూ సంపాదకీయం సరిగ్గా వ్యాఖ్యానించింది. మనకు కనపడని ప్రొ-రేపిస్టు లాబీ ఒకటి మన దేశంలోనూ ఉందని చెబుతున్న…

మన్మోహన్ తన భార్య పేరు రాయలేదుగా? -బి.జె.పి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వివాహం, భార్య అంశాలపై రాహుల్ గాంధీ దాడి ఎక్కుపెట్టిన నేపధ్యంలో బి.జె.పి తన సొంత ఆయుధం తెరపైకి తెచ్చింది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తన భార్య పేరును అఫిడవిట్ లో ఇవ్వలేదన్న సంగతిని ఎత్తి చూపింది. 2013లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మన్మోహన్ సింగ్ తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లో తన భార్య పేరు ఇవ్వలేదని బి.జె.పి నేత రవిశంకర్ ప్రసాద్…

చైనా నౌకా విన్యాసాలు: ఇండియా ఇన్, అమెరికా ఔట్

చైనా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకా విన్యాసాల సమీక్షలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఎన్నాళ్లనుండో పాల్గొంటుందని భావిస్తున్న జపాన్ కు చైనా ‘నో’ చెప్పడంతో అమెరికా కూడా తప్పుకుంది. ఆసియాలో తన అనుంగు మిత్రుడు జపాన్ కు ప్రవేశం లేని చోటకు నేనూ రాను అని చెప్పేసింది. కాగా చైనా కోరిక మేరకు విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇండియా తన సంసిద్ధతను ప్రకటించడంతో విన్యాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. చైనాకు కౌంటర్-వెయిట్ గా నిలపాలని అమెరికా భావిస్తున్న ఇండియా, చైనా…

మోడి పెళ్లి: మరిన్ని ప్రశ్నలు రేపుతున్న బి.జె.పి జవాబులు

మోడి వివాహం గురించి ఊహించినట్లే రగడ చెలరేగుతోంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ (అనధికారిక) ప్రధాని అభ్యర్ధే ఈ అంశం పైన దాడి ఎక్కుపెట్టారు. మోడి నామినేషన్ తిరస్కరించాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బి.జె.పి నేతలేమో మోడి వ్యక్తిగత వ్యవహారాలపై దాడికి దిగవద్దని చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే గాంధీ వంశస్ధుల వ్యక్తిగత వివరాలను కూడా వీధిలోకి లాగవలసి వస్తుందని బెదిరింపులకు దిగుతున్నారు. మోడి వివాహ వ్యవహారానికి సంబంధించి వారు ఇస్తున్న సమర్ధనలు, జవాబులు మరిన్ని ప్రశ్నలను…

దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు. బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి…

శక్తి మిల్స్ అత్యాచారం నిర్భయ ఘటనకు తీసిపోదు -కోర్టు

ముంబై లోని శక్తి మిల్స్ అత్యాచారం ఘటన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనకు ఏ మాత్రం తీసిపోనిదని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శాలిని ఫన్సల్కర్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. నిర్భయ ప్రాణం కోల్పోవలసి రాగా ముంబై బాధితురాలు తట్టుకుని నిలబడ్డారని ఆమె ఇచ్చిన సాక్ష్యం కేసుకు అత్యంత బలమైన మూలాధారం అనీ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు ఆమెతో వెళ్ళిన ఆమె స్నేహితుడు కూడా చివరి వరకూ నిలబడి పోరాడిన తీరు అభినందనీయం అని…

ఉక్రెయిన్: త్వరలో జెనీవా సమావేశం, పరిష్కారం అనుమానం

ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇరు పక్షాలు చర్చలకు మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. ఉక్రెయిన్ లో తమ తమ ప్రయోజనాలను ఘర్షణలు లేకుండా సంరక్షించుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు సమావేశం అవుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ పాత్ర నామమాత్రం. ఉక్రెయిన్ పాలనను ప్రస్తుతం అదుపులో ఉంచుకున్నది ఇ.యు, అమెరికాలే కనుక ఆ మేరకు పశ్చిమ సామ్రాజ్యవాదులకు సానుకూలత ఏర్పడి ఉంది. అయితే ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో రష్యా భాష మాట్లాడే…