ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు…

ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…

సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట

ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మద్దతు ప్రకటించాడు. జి-20 గ్రూపులో అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చుని కూడా ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ…

సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్…

అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ (ఎం.డి.ఎస్) ఏర్పాటు పూర్తి చేశామని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించింది. యూరోప్ కోసం అని చెబుతూ మధ్య యూరప్ నుండి తన సరిహద్దు దేశాల వరకూ ఆయుధ వ్యవస్ధను అమెరికా నిర్మించడం…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…

ఆపరేషన్ గ్లాడియో: పశ్చిమ దేశాల ముసుగు టెర్రరిజమే గురుద్వారా హత్యాకాండ?

ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…

నోరు మూసుకో! -అమెరికాతో చైనా ‘పీపుల్స్ డెయిలీ’

నోరు మూసుకొమ్మని చైనా ప్రభుత్వ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అమెరికాను హెచ్చరించింది. చైనా సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం వద్దని పత్రిక విదేశీ విభాగం గట్టిగా చెప్పింది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య తగాదాలు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా విరోధాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం అమెరికాకి కొత్త కాదనీ ఇటీవలీ కాలంలో చైనా విషయంలో కూడా ఈ ట్రిక్కు వినియోగిస్తున్నదని నిందించింది.…

సిరియాలో ఆల్-ఖైదా ను ప్రవేశపెట్టింది అమెరికా, నాటోలే -అమెరికా చరిత్రకారుడు

‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి విదితమే. ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశామని కూడా ప్రకటించిన అమెరికా అదే సంస్ధకు చెందిన టెర్రరిస్టులకు ఆయుధాలు ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టిందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు, రచయిత, ఆర్ధికవేత్త, జర్నలిస్టు అయిన వెబ్స్టర్ టార్ప్లే తెలిపాడు. ప్రాంతీయంగా టర్కీ ప్రధాని ఎర్డోగన్, విదేశీ మంత్రి దవుతోగ్లు ల దురభిమానాన్ని, అత్యాశను రెచ్చగొట్టి సిరియా కిరాయి తిరుగుబాటులో…

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…

అమెరికా చెబుతున్నది అబద్ధం -భారత జాలర్లు

కాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశామని అమెరికా చెబుతున్నది ఒట్టి అబద్ధమని దుబాయ్ తీరంలో అమెరికా సైనికుల కాల్పుల్లో గాయబడిన భారత జాలర్లు ‘ది హిందూ’ కు తెలిపారు. యు.ఏ.ఇ కి చెందిన కంపెనీలో పని చేస్తున్న భారత జాలర్లపై అక్కడి అమెరికా సైనిక స్ధావరానికి చెందిన సైనికులు కాల్పులు జరపడంతో ఒక భారతీయ జాలరి చనిపోగా, మరో ముగ్గురు జాలర్లు గాయపడ్డారు. కాల్పులకు ముందు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశామనీ వినకపోవడంతో కాల్చారని అమెరికా చెబుతుండగా…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు

ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం. తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న…