శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు

సిరియాపై అమెరికా ప్రత్యక్ష దురాక్రమణ దాడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల అండతో 18 నెలలుగా సిరియా ప్రజలపై టెర్రరిస్టులు సాగిస్తున్న మారణకాండ అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యక్ష జోక్యానికి సాకులు వెతుకుతున్న నాటో కూటమి తానే ఒక సాకును సృష్టించుకుంది. టర్కీ భూభాగం నుండి సిరియాలోకి చొరబడిన టెర్రరిస్టులు టర్కీ పైకే జరిపిన దాడిని అడ్డు పెట్టుకుని సిరియాపై ఆయుధ దాడికి టర్కీ (నాటో సభ్యురాలు) మిలట్రీ తెగబడింది. ఇరాక్ పై…

సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా కొత్త కుట్ర

సిరియా కిరాయి తిరుగుబాటు ఎంతకీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ప్రత్యక్ష దాడికి అమెరికా కొత్త మార్గాలు వెతుకుతోంది. రష్యా జోక్యంపై అబద్ధాలు సృష్టించి ఆ సాకుతో తానే ప్రత్యక్షంగా రంగంలో దిగడానికి పావులు కదుపుతోంది. జులైలో సిరియాలో జొరబడిన టర్కీ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేయడం వెనుక రష్యా హస్తం ఉందంటూ తాజాగా ప్రచారం మొదలు పెట్టింది. సిరియా కిరాయి తిరుగుబాటుకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్న సౌదీ అరేబియాకి చెందిన చానెల్ ఆల్-అరేబియా ఈ…

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా…

చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల…

ప్రపంచ వ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు -ఫోటోలు

ఒక అమెరికన్ యూదు (నకౌలా బెస్సెలే నకౌలా) నిర్మించాడని చెబుతున్న ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమా కు నిరసనగా సెప్టెంబరు 11 తేదీన ప్రారంభమయిన నిరసనలు ప్రపంచం అంతటా విస్తరించాయి. కైరో, బెంఘాజీ నగరాల్లో జరిగిన హింసాత్మకం దాడుల అనంతరం పెచ్చరిల్లిన ఈ నిరసనలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. అమెరికా ఎంబసీలు నిరసనలకు, విధ్వంసాలకు లక్ష్యంగా మారాయి. తమ ఎంబసీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెబుతూనే అమెరికా కొన్ని అరబ్,…

లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు.…

ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు…

ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…

సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట

ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మద్దతు ప్రకటించాడు. జి-20 గ్రూపులో అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చుని కూడా ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ…

సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్…

అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ (ఎం.డి.ఎస్) ఏర్పాటు పూర్తి చేశామని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించింది. యూరోప్ కోసం అని చెబుతూ మధ్య యూరప్ నుండి తన సరిహద్దు దేశాల వరకూ ఆయుధ వ్యవస్ధను అమెరికా నిర్మించడం…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…

ఆపరేషన్ గ్లాడియో: పశ్చిమ దేశాల ముసుగు టెర్రరిజమే గురుద్వారా హత్యాకాండ?

ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…