ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం

ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‘ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక  దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.…

తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్

దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…

పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…

చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…

శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…

గూఢచర్యం: చైనా అమ్మాయితో అమెరికన్ అణు రొమాన్స్

– అమెరికా, చైనాల వైరుధ్యాలు క్రమంగా వివిధ రంగాలలో ప్రస్ఫుటంగా ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం అడపాదడపా గౌరవం ప్రకటించుకుంటూనే ఒకరిపై మరొకరు గూఢచర్యానికి పాల్పడడం అగ్ర దేశాలకు కొత్త కాకపోయినా, చైనా అణు గూఢచర్యం వెల్లడి కావడం ఇదే ప్రధమం కావచ్చు. అమెరికాకు చెందిన ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అమెరికా అణు రహస్యాలను ఒక చైనా అమ్మాయికి అందజేసి దొరికిపోయాడని ఫెడరల్ పోలీసు సంస్థ ఎఫ్.బి.ఐ ప్రకటించింది. డిఫెన్స్ కాంట్రాక్టర్ హవాయ్ ద్వీపంలో అమెరికా…

దేశం వదిలి వెళ్లొద్దు, ఇటలీ రాయబారికి సుప్రీం ఆదేశం

ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటాలియన్ మెరైన్లను ఇండియాకి తిరిగి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు అసాధారణ చర్య చేపట్టింది. ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని తమ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఫిబ్రవరి 24-25 తేదీలలో జరిగిన ఇటలీ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి తిరిగి వెనక్కి వస్తామని మెరైన్లు సుప్రీం కోర్టును కోరగా వారికి ఇటలీ రాయబారి హామీగా నిలిచాడు.…

బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో

అమెరికా అనే సామ్రాజ్యవాద మత్త గజాన్ని తెలిసి తెలిసి ఢీకొన్న నేటి కాలపు హీరో బ్రాడ్లీ మేనింగ్. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాల్లో అమెరికా సైనికులు, అధికారులు పాల్పడిన అమానవీయ హత్యాకాండలు, సామాన్య పౌరులపై సాగించిన యుద్ధ నేరాలు తదితర సమాచారాన్ని ‘వికీ లీక్స్’ కి అందజేసి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న దారుణ కృత్యాలకు కేంద్రం అమెరికాయేనని ససాక్ష్యాలతో వెల్లడి చేశాడు బ్రాడ్లీ మేనింగ్. అత్యంత రహస్యంగా బ్రాడ్లీ మేనింగ్ ని విచారిస్తూ తాను నిత్యం వల్లించే…

భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2

విదేశీ చమురు కంపెనీలు చెల్లించే రాయల్టీలను గణనీయంగా పెంచి దానిని ప్రజోపయోగాలకు తరలించడానికి ఛావెజ్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. 2001 చట్టం ద్వారా చమురు అమ్మకాల ఆదాయంలో విదేశీ కంపెనీల వాటాను 84 నుండి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. భార చమురు వెలికి తీసే ఒరినికో చమురు బేసిన్ లో చమురు రాయల్టీలను 1 శాతం నుండి 16.6 శాతానికి పెంచింది. ఈ చెల్లింపులకు బడా చమురు కంపెనీలు ఎక్సాన్, కొనొకో ఫిలిప్స్ తిరస్కరించడంతో వాటిని…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -1

అది న్యూయార్క్ నగరం లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం. ప్రపంచ రాజకీయ ఆధిపత్య సాధనకు అమెరికా పనిముట్టుగా తిరుగులేని రికార్డు సంపాదించిన ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయ భవనంలో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత రోజే అదే చోట ప్రసంగించడానికి పోడియం ఎక్కిన వ్యక్తి ఒక అభివృద్ధి చెందిన దేశానికి నాయకుడు. తమ దేశంలోని ఆయిల్ వనరులను ప్రజల జీవన స్థాయిని పెంచడానికి వినియోగ పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో…

ఛావెజ్ మరణం అమెరికా పన్నాగం కావచ్చు –రష్యా నాయకుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు. “అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న…

అమెరికా సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన హ్యూగో ఛావెజ్ ఇక లేడు

వెనిజులా చమురు క్షేత్రాల నుండి లాభాల రాశులను తవ్వుకుపోతున్న అమెరికా బహుళజాతి కంపెనీలను ఉరికించి కొట్టిన బొలివారన్ విప్లవ నేత హ్యూగో ఛావెజ్ తుది శ్వాస విడిచాడు. అమెరికా గూఢచారులు ప్రవేశ పెట్టిన కేన్సర్ జబ్బుతో పోరాడి అలసిపోయిన ఛావెజ్ మంగళవారం రాత్రి కన్ను మూశాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన క్యూబా డాక్టర్లు నాలుగు సార్లు సర్జరీ చేసినప్పటికీ లొంగని కేన్సర్ కణాలు తమ యజమానులు ఆశించినట్లుగానే ఛావెజ్ ను తుదముట్టించిగాని ఊరుకోలేదు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు…