అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…

సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు

ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది…

ఇరాక్: ఆల్-జజీరా చానెల్ అనుమతి రద్దు

కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా…

విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?

తాగి ఎటు వెళుతున్నాడో తెలియని స్ధితిలో సరిహద్దు దాటాడని అతని కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. పాక్ భూభాగం లోని పంజాబ్ రాష్ట్రంలో 1990లో జరిగిన వరుస పేలుళ్లకు కుట్ఱ పన్నాడని పాకిస్ధాన్ ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్ధానం ఆరోపించి మరణ శిక్ష కూడా వేశేసాయి. ఆయన్ని విడిచి పెట్టాలని, కనీసం క్షమాభిక్ష అయినా పెట్టాలని కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి వేడుకుంటుండగానే సరబ్ జిత్ సింగ్ గురువారం ప్రాణాంతక దాడికి గురై తీవ్ర స్ధాయి కోమాలోకి వెళ్ళిపోయి…

ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…

లడఖ్ లో చొరబాటు వార్తలను తిరస్కరించిన చైనా

తూర్పు లడఖ్ ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర చైనా సాయుధ బలగాలు ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయన్న వార్తలని చైనా ఖండించింది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) కు సంబంధించి ఇండియాతో కుదిరిన ఒప్పందాలను తాము అతిక్రమించబోమని, తమ సైనికులు రేఖను దాడి వెళ్లలేదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించాడు.…

బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…

శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…

ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో…

అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ…

ఉ.కొరియా అణు సామర్ధ్యంపై అమెరికాలో విభేదాలు

ఉత్తర కొరియా అణు క్షిపణులు అమెరికా భూభాగాన్ని చేరగలవా లేదా? చేరగలిగితే ఎక్కడి వరకు రాగలవు? పశ్చిమ తీర ప్రాంతం అయిన అలాస్కా వరకేనా లేక ప్రధాన భూభాగాన్ని కూడా చేరగలవా? అసలు ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగల తక్కువ సైజు అణు బాంబులను ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకున్నదా? ఇవి అమెరికా ప్రభుత్వాన్ని తొలుస్తున్న ప్రశ్నలు. అణ్వస్త్ర సామర్ధ్యాన్ని ఉత్తర కొరియా రుజువు చేసుకున్నప్పటికీ వాటిని మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులు ఎంత దూరం వెళ్లగలవనేది అంతర్జాతీయ పరిశీలకులు…

ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…

ఇండియా అణు పరీక్షను ముందే ఊహించిన అమెరికా -వికీలీక్స్

ఇందిరా గాంధీ హయాంలో భారత దేశం 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరానితనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చుకోవడానికి వీలు లేదని శాసించాయి. అందుకోసం ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ…

అమెరికా విమాన దాడుల్లో 11 మంది ఆఫ్ఘన్ పిల్లల దుర్మరణం

అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి. అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని…