తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్

ఒకరు అరే అంటే మరొకరు ఏరా అంటారు. ఒకరు తొడగొడితే మరొకరు మీసం మెలివేస్తారు. ఒకరు పౌర విమానం పంపితే మరొకరు ఏకంగా జెట్ ఫైటర్ విమానాన్నే పంపుతారు. తూర్పు చైనా సముద్రంలో చైనా, జపాన్ లు మళ్ళీ కీచులాటలు మొదలు పెట్టాయి. కీచులాటలు కాస్తా యుద్ధం వైపుకి దారి తీస్తాయేమోనని ఉగ్గబట్టుకోవడం ఇరుగు పొరుగు దేశాల పనిగా మారుతోంది. నివాస యోగ్యం కాని చిన్న చిన్న దీవుల పైన ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలను…

ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

అమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001…

సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఆపండి! ఒబామాకు అమెరికన్ల పిటిషన్

తిరుగుబాటు పేరుతో సిరియాలో మారణకాండకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం ఆపాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం నిర్వహించే వెబ్ సైట్ whitehouse.gov లో ఈ మేరకు వివిధ సెక్షన్ల ప్రజలు ఒక పిటిషన్ నమోదు చేశారు. ముస్లిం టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం పేర్కొన్న ఆల్-ఖైదా సంస్ధకు సిరియాలో తిరుగుబాటు నడుపుతున్న 29 సంస్ధలు విధేయతను ప్రకటించాయనీ, అలాంటి టెర్రరిస్టులకోసం అమెరికా ప్రభుత్వం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు పెట్టడం గర్హనీయమని…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…

అణు హిపోక్రసీ: అమెరికా పరీక్షలకు జపాన్, ఇరాన్ ఖండన

అణ్వస్త్రవ్యాప్తి నిరోధం గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా తాను మాత్రం అణు పరీక్షలను మానలేదు. సామూహిక విధ్వంసక మారణాయుధాలు కలిగి ఉన్నదంటూ ఇరాన్ దేశాన్నీ, ప్రజలనూ సర్వనాశనం చేయడమే కాక సిరియా, ఇరాన్ లకు కూడా అదే గతి పట్టించే కృషిలో నిమగ్నమై ఉన్న అమెరికా ఈ వారం నెవాడాలో అణు పరీక్షలు నిర్వహించినట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధంలో అమెరికా ద్వంద్వ విధానాన్నీ, హిపోక్రసీని జపాన్, ఇరాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.…

ఇరాన్ మందులు అమెరికాకి రక్ష, అమెరికా ఆంక్షలు ఇరాన్ కి శిక్ష

ఇరాన్ తయారు చేసిన ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను కాపాడుతుంటే, అమెరికా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగులను చంపేస్తున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో పాము కాటుకి గురయిన అమెరికా సైనికులకి ఇరాన్ తయారు చేసిన విరుగుడు ఔషధాలు తప్ప మరో గతి లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఆదివారం ప్రచురించిన ఒక రిపోర్ట్ లో పత్రిక ఈ సంగతి తెలిపింది. నైరుతి ఆసియా ప్రాంతానికి ప్రత్యేకమైన పాముల కాట్లకు గురవుతున్న అమెరికా…

దక్షిణ చైనా సముద్రానికి అవసరమైతే బలగాలు పంపుతాం -ఇండియా

దక్షిణచైనా సముద్ర గొడవల్లో తానూ ఉన్నానని భారత ప్రభుత్వం మరోసారి చాటింది. భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్’ దక్షిణచైనా సముద్రంలో ఆయిల్ పరిశోధనలో పాల్గొంటున్నందున భారత వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే ఇండియా కూడా తన బలగాలను పంపిస్తుందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి స్పష్టం చేశాడు. సరిహద్దు తగాదాపై చర్చించడానికి భారత జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్ చైనా పర్యటనలో ఉండగానే నేవీ చీఫ్ ప్రకటన ఒకింత ఆసక్తిని రేపింది. ప్రపంచ సముద్ర…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

హమాస్ x ఫతా మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1

ప్రపంచ పోలీసు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ ల బెదిరింపులను చీత్కరిస్తూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో చారిత్రాత్మక తీర్పును ప్రకటించాయి. పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక రాజ్యం (non-member observer state) గా గుర్తింపునిస్తూ ఐరాస సాధారణ సభ (General Assembly) భారీ మెజారిటీతో నిర్ణయించింది. ఐరాసకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధిస్తామనీ, పాలస్తీనాకు ఇస్తున్న సహాయాన్ని కూడా ఆపేస్తామనీ అమెరికా అత్యున్నత స్ధాయిలో తీవ్రంగా సాగించిన బెదిరింపులను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి. ప్రపంచ…

తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని…

అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు

26/11 గా ప్రస్తావించే ముంబై మారణహోమంలో పాల్గొన్న అజ్మల్ కసబ్ ను ఉరి తీశారని పత్రికలు తెలిపాయి. కసబ్ ఉరితీతను మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ధృవీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. మారణ హోమానికి నాలుగు సంవత్సరాలు నిండడానికి ఐదు రోజులకు ముందు అజ్మల్ కసబ్ ఉరికంబం పై శిక్ష అనుభవించాడు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 8 తేదీన తిరస్కరించడంతో కసబ్ ని ఉరి తీయడానికి ఉన్న…

సి.ఐ.ఎ మాజీ బాస్ గర్ల్ ఫ్రెండ్ గుప్పెట్లో లిబియా దాడి రహస్యం

సి.ఐ.ఎ మాజీ బాస్ డేవిడ్ పెట్రాస్ రాజీనామాకి దారి తీసిన రాయబారి హత్య అమెరికా ఆధిపత్య వర్గాల రాజకీయాలను కుదిపేస్తున్నది. డేవిడ్ పెట్రాస్ గర్ల్ ఫ్రెండ్ పాలా బ్రాడ్వెల్ కంప్యూటర్ లో సి.ఐ.ఎ రహస్య పత్రాలు దొరికినట్లు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు వెల్లడించడంతో సెక్స్ కుంభకోణం విస్తృతి అమెరికా పాలకవర్గాలకు దడ పుట్టిస్తోంది. డేవిడ్ పెట్రాస్ ఆఫ్ఘన్ యుద్ధ కమాండర్ పదవి నుండి తప్పుకుని సి.ఐ.ఎ బాధ్యతలు స్వీకరించాక ఆఫ్ఘన్…

సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని…