ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?
ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు. హిందూ మహా…