ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

‘మొనగాడు’ అందామా! గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా! మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా! ‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా? గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…

MH17: మీడియా చెప్పనిదేమిటి? -అమెరికా హౌస్ సభ్యుడు రాన్ పాల్

(రాన్ పాల్ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ – మన లోక్ సభకు సమానం)లో 2013 వరకు సభ్యుడు. అమెరికా అధ్యక్ష పదవికి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో రెండు సార్లు అధ్యక్ష పదవికోసం పోటీ పడ్డారు. అమెరికా రహస్య గూడచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అరాచకాలను బైటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాను రాన్ పాల్ కే ఓటు వేశానని బహిరంగంగా చెప్పాడు. అమెరికా బహుళజాతి కంపెనీలకు రాన్ పాల్…

ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు

మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య –వీడియో వివరణ

ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడిలో గాజా రక్తం ఓడడం కొనసాగుతోంది. అంతర్జాతీయ చీత్కరింపులను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ట్యాంకులు, గన్ బోట్లు జనావాసాలపై బాంబులు కురిపిస్తూ పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. ఇజ్రాయెల్ ఒక పక్క మానవ హననం సాగిస్తుంటే మరో పక్క అమెరికా, ఐరోపా, ఐరాసలు బూటకపు శాంతి ఉద్భోదలతో పొద్దు పుచ్చుతున్నారు. పాలస్తీనా (దురాక్రమణ) సమస్య ను క్లుప్తంగా వివరించడానికి ఈ వీడియోలో ప్రయత్నం జరిగింది. నా పి.సికి సౌండ్ డివైజ్ పని…

పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

దాగలేని నిజం: వార్ జోన్ మీదికి విమానాన్ని ఎందుకు మళ్లించారు?

ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతంలో కూల్చివేసిన మలేషియా విమానం MH17, తన రోజు వారీ రూట్ లో కాకుండా జులై 17 తేదీన కాస్త ఉత్తర దిశకు జరిగి ప్రయాణం చేసింది. రోజువారీ రూట్ లో ప్రయాణం చేసి ఉన్నట్లయితే MH17 అసలు తిరుగుబాటు ప్రాంతం దోనెత్స్క్ ప్రాంతం మీదకు వెళ్ళి ఉండేదే కాదు. కూలిపోయిన రోజున యధాప్రకారం ఆంస్టర్ డాం నుండి ఆగ్నేయ దిక్కులో నేరుగా ప్రయాణించకుండా కాస్త పైకి దిశ మార్చుకుని ప్రయాణించింది. ఆ రోజు…

ఇజ్రాయెల్ వ్యతిరేక వార్త, అమెరికా విలేఖరుల తొలగింపు

గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధానికి సంబంధించి వాస్తవ వార్త ప్రసారం చేసినందుకు పశ్చిమ వార్తా సంస్ధలు తమ విలేఖరులను తప్పించాయి. ఒక వార్తా సంస్ధ విలేఖరిని ఇంటికే పంపిస్తే మరో వార్తా సంస్ధ న్యూస్ ప్రజెంటర్ ను తప్పించి ఇతర బాధ్యతలకు బదిలీ చేసింది. ఆ రెండు వార్తా సంస్ధలు సాదా సీదావి కావు. భారీ కార్పొరేట్ వార్తా సంస్ధలు. ప్రజాస్వామ్య సంస్ధాపన కోసం అమెరికా చేసే అడ్డపైన పనుల్ని నెత్తిన పెట్టుకుని మోసే కంపెనీలు.…

బక్ మిసైళ్ళు మిలిటెంట్ల దగ్గర లేవు -ఉక్రెయిన్ అధికారి

మలేషియా విమానాన్ని కూల్చివేసింది తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే అని పశ్చిమ పత్రికలు, పశ్చిమ రాజ్యాధినేతలు తెగ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఇదే పల్లవి అందుకుని మిలిటెంట్లను పోరాట విరమణ చేసేలా సహకరించడం లేదని రష్యాకి కూడా పాపం అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే మిలిటెంట్ల దగ్గర అసలు బక్ మిసైళ్లే లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పడంతో ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం అయిపోయింది.…

అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్

ఓహ్… ఇద్దరూ మనకు మిత్రులే కదా! *** పోటీ అన్నది ఎప్పుడూ సమానుల మధ్య జరగడమే న్యాయం. ఆటలో ఒక పక్షం తొండాట ఆడుతున్నారని తెలిసీ నిస్పక్షపాతం అంటూ గిరి గీసుకు కూర్చుంటే అది చివరికి తొండాటకు మద్దతుగా తేలుతుంది. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇలాగే ఉంది. ఇజ్రాయెల్ అన్ని విధాలుగా బలీయమైన రాజ్యం. అనేక దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాల పోషణలో ఉన్న ఇజ్రాయెల్ మధ్య…

మలేషియా విమానం: ఎవరు కూల్చారు?

ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను…

ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?

ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు. హిందూ మహా…

ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు. ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి. ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు…

జాత్యహంకార నీడలో నిలువెల్లా గాయాల గాజా -ఫోటోలు

గాజా ప్రజ మరోసారి రక్తం ఓడుతోంది. యూదు జాత్యహంకారం విసురుతున్న ఆధునిక క్షిపణి పంజా దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ధి గాంచిన గాజా నిలువెల్లా గాయాలతో నిస్సహాయగా నిలిచి ప్రపంచ వ్యవస్ధల చేతగానితనాన్ని నిలదీసి ప్రశ్నిస్తోంది. పౌరుల ఆవాసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోంది. తోడేలు న్యాయానికి గొర్రెలను అప్పగిస్తున్న పులుల ఆటవిక న్యాయానికి సాక్షిగా నిలబడి సో కాల్డ్ ప్రజాస్వామిక…

ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!

గాజా మరోసారి ఇజ్రాయెల్ జాత్యహంకార ముట్టడికి గురవుతోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్ మరియు హత్యలను సాకుగా చూపుతూ గాజా పౌర నివాసాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా 200కు పైగా గాజా పౌరులు దుర్మరణం చెందగా ఉనికిలో ఉన్న కాసిన్ని ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు శ్రమిస్తున్నాయి. కాగా శాంతి ప్రవచనాలు వల్లించడం వరకే ఐరాస పరిమితం…