ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

విమర్శల రాయి విసురు, నిధుల పండ్లు రాలు -కార్టూన్

రాజకీయాలు పెద్దోళ్లు-పెద్దోళ్లు ఆడుకోవడానికే గానీ జనాల అవసరాలు తీర్చడానికా? ఎన్నికల మేనిఫెస్టోలు, నాయకుల ప్రసంగాలు, పార్టీల రాజ్యాంగాలు ఇవన్నీ జనం పేరు చెప్పకుండా ఒక్క వాక్యాన్నీ ముగించలేవు. అదే చేతల్లోకి వస్తే జేబులోకి (ఆదేలెండి, ఖాతాలోకి) కాసు రాలకుండా ఒక్క అడుగూ ముందుకు పడదు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల సాగించిన బురద రాజకీయం ఆ సంగతే చెబుతోంది. రెండు రోజుల పాటు ములాయం సింగ్ కాంగ్రెస్ పైన నోటితో నిప్పులు విరజిమ్మాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్నాడు.…

ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

బ్రిక్స్ పీఠంపై బాహాబాహి, జపాన్ వాకిట భిక్షాందేహి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల…

ములాయంజీ! ఆకాశానికి నిచ్చెన నిలిచేనా? -కార్టూన్

బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది. ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ పరిస్ధితులను ఎలా చూడలన్న విషయాన్ని చూశాము. అంతర్జాతీయ రంగంలో ఉండే వివిద శిబిరాలు, ఆర్ధిక, రాజకీయ కూటములు, భౌగోళిక విభజనలు, వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలను ఈ ఐదు భాగాల్లో చర్చించాము. ఆరవ భాగం…

నారాయణ స్వామి కత్తి దూశారు… తిరగేసి! -కార్టూన్

సిబిఐ పుణ్యమాని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.నారాయణ స్వామి వార్తల్లో నానుతున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, యుపిఎ ను వదిలి వెళ్ళిన మరుసటి రోజే ఆ పార్టీ నేత కరుణానిధి తనయులు స్టాలిన్, అళగిరి ఇళ్లపైన సిబిఐ చేత దాడి చేయించడం ద్వారా అన్ని పక్షాల నుండి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దురుద్దేశం ఏమీ లేదని సిబిఐ తన పని తాను చేసుకుందే తప్ప ప్రభుత్వానికి దానికి సంబంధం లేదనీ, అది స్వతంత్ర సంస్థ…

భారత్ రాయబార విజయం, తిరిగి రానున్న ఇటలీ మెరైన్లు

ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…

తమిళనాట ఇపుడు యు.పి.ఎ భాగస్వామి ఎవరు? -కార్టూన్

– డిఎంకె తెగతెంపులు చేసుకోవడంతో యుపిఎలో తమిళనాడు స్ధానం సీటు ఖాళీ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో తమిళనాడులో ఖాళీ అయిన సీటును భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. తెలియని ప్రేమికుడి కోసం తమిళనాడు (T) గేటు వద్ద ఆ పార్టీ మోహ గీతాలు ఆలపిస్తోందని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఆ గీతాలకు స్పందించే వారు దొరక్కపోరు. వాడుకుని వదిలేయడం భారత పాలకులకు కొత్త…

శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…