లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు

లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు చోటు చేసుకున్నట్లు పి.టి.ఐ తెలిపింది. ఏప్రిల్ నెలలో చొరబడిన ప్రాంతానికి సమీపంలోనే తాజా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. చుమర్ సెక్టార్ లో చొరబడిన చైనా పి.ఎల్.ఏ బలగాలు భారత సైన్యం నిర్మించిన బంకర్లు కొన్ని ధ్వంసం చేసి కెమెరా కేబుల్స్ ను తెంచివేసినట్లు తెలిసింది. ఈ రోజు (మంగళవారం, జులై 9) వెలుగులోకి వచ్చినప్పటికీ వాస్తవానికి ఈ చొరబాటు జూన్ నెలలోనే జరిగింది. చైనా, భారత్ ల భూభాగాలను విడదీసే…

ఉత్తరఖండ్, బుద్ధగయ మరియు జోకర్ వి.ఐ.పిలు -కార్టూన్

ఉత్తరఖండ్ హిమాలయ విలయం నుండి దేశం ఇంకా తేరుకోనే లేదు. అక్కడింకా శవాల లెక్కలు తేలలేదు. మందాకిని పూడ్చిన గ్రామాలు, పొలాలు పైకి లేవలేదు. విగతులైనవారి అంత్యక్రియలు సైతం పూర్తి కాలేదు. ఇంతలోనే బుద్ధగయ మానవ విధ్వంసం! దేశానికి ప్రకృతి విలయాలు కొత్త కాకపోవచ్చు. ఆ మాటకొస్తే ఉగ్రవాద బాంబు పేలుళ్లు కూడా కొత్త కాదు. కానీ రాజకీయ నాయకులకు, వి.ఐ.పి లకు అవి ఎప్పటికప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అక్కరకు వచ్చే నిత్య నూతన సాధనాలు. ప్రకృతి…

ఉచిత పధకాల ఖర్చు మోయలేం బాబోయ్! -కార్టూన్

– “మరేం ఫర్వాలేదు – మాకు సంతోషమే. ఎందుకంటే ఆ ఉచితాలన్నింటి ఖర్చు ఇక మేము భరించనక్కర్లేదు కదా!” – రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పధకాలు అవినీతి కాదని చెబుతూనే అవి ప్రజాస్వామ్యం మూలాలను కుదిపి వేస్తాయని అంగీకరించింది. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ పంపిణీ పధకాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అవి అవినీతి…

ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు

ధర్మపురిలో రైలు పట్టాలపై శవమై కనిపించిన ఇళవరసన్ ది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ది హిందు పత్రిక ప్రకారం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవం కనిపించినట్లుగా ఏ రైలు అధికారీ రికార్డు చేయలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రైలు ఏ వ్యక్తినైనా ప్రమాదవశాత్తూ ఢీ కొట్టినా లేక ఆత్మహత్య కోసం రైలు ముందుకు దూకినా సదరు రైలు డ్రైవర్ గానీ, గార్డు గానీ లేదా ఇతర…

ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్

ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు పని చేయగలవో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్ల కోసం మద్యం, డబ్బు, బంగారం దగ్గర్నుండి క్రికెట్ కిట్ల వరకూ పంచి పెట్టినా అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసే మిలట్రీ అధికారులు కూడా ‘ప్రజాస్వామ్యం కోసమే కుట్ర చేశాం’ అని చెబుతారు. అదే నోటితో ‘త్వరలోనే ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పజెబుతాం’ అని కూడా చెబుతారు. చివరికి హిట్లర్ కూడా తనది ప్రజాస్వామ్య పాలనే…

ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్: గుజరాత్ పోలీసు సాక్ష్యంలో మోడి పేరు

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ తరపున భావి ప్రధానిగా బి.జె.పి నిలపనున్నదని పత్రికలు ఊహిస్తున్న నేత అయిన నరేంద్ర మోడి మెడపై మరో కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇష్రత్ జహాన్, ఆమె స్నేహితుడు ప్రాణేశ్వర్ పిళ్లై అలియాస్ జావేద్ షేక్, మరో ఇద్దరు యువకుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో, గుజరాత్ పోలీసులు కలిసి ఉమ్మడిగా చేసిన కుట్ర ఫలితంగా నలుగురు అమాయకులు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని…

స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా

అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన రష్యా విమానాశ్రయంలో కూర్చుని ఏ దేశం తనకు ఆశ్రయం ఇస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆయన తమకు తెలియకుండా ఎక్కడ తప్పించుకుని పోతాడా అని అమెరికా కుక్క కాపలా కాస్తోంది. స్నోడెన్ కోసం అమెరికా ఎంతకు తెగించిందంటే బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంపై ప్రయాణించకుండా ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చేటంతగా. ఫ్రాన్సు, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు బొలీవియా అధ్యక్షుడు…

మనకీ ఉన్నారు కామిక్ హీరోలు! -కార్టూన్

ప్రపంచం అంతా పాపులారిటీ సంపాదించిన కామిక్ హీరోలంతా దాదాపు పశ్చిమ దేశాల వాళ్ళే. సూపర్ మేన్, బ్యాట్ మేన్, స్పైడర్ మేన్, ఫాంటమ్ ఇత్యాదూలంతా పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ప్రాణం పోసుకున్నవారు. వారితో సమానంగా పాపులారిటీ సంపాదించిన జంతు రూప’ కామిక్ క్యారెక్టర్లు కూడా అక్కడివే. అదేం కాదు, మనకి కూడా కామిక్ హీరోలు, క్యారెక్టర్లు ఉన్నారని చెబుతున్నారు ది హిందూ కార్టూనిస్టు. సృజనాత్మకత ఉట్టిపడుతున్న మన కామిక్ హీరోల గొప్పతనాన్ని కనిపెట్టడానికి కేశవ్ లాంటి…

స్నోడెన్ రాజకీయ ఆశ్రయం, వివిధ దేశాల స్పందనలు

ప్రపంచ ప్రజలపై అమెరికా దొంగచాటు నిఘాను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ సకల దేశాల ఎజెండాలోకి చేరిపోయాడు. రాజకీయ ఆశ్రయం కోరుతూ ఆయన వివిధ దేశాలకు వినతి పత్రాలు పంపడంతో ఆయా దేశాల ప్రజాస్వామ్య కబుర్ల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాయి. రాజకీయ ఆశ్రయం పొందడం ప్రపంచంలో ప్రతి పౌరుడి హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించగా సభ్య దేశాలన్నీ దాన్ని ఆమోదించాయి. ఐరాస ఒప్పంద పత్రాలపై తాము చేసిన సంతకాలు ఎంత నామమాత్రమో అనేక దేశాలు వెల్లడించుకోగా, చాలా కొద్ది…

ఓ స్నోడెన్! నిన్ను గుండెల్లో మాత్రమే దాచుకోగలం!!

– రచన: చందుతులసి ఓ స్నోడెన్.. ఓ వేగుచుక్కా… సాహసమే ఊపిరిగా స్వేచ్ఛా కేతనం ఎగరేసిన వీరుడా…… గుంటనక్క గోతుల్ని సాక్ష్యాలతో చాటిన శోధనుడా. నీ ధైర్యం ప్రపంచ యువతను వెన్నుతట్టి లేపుతోంది ఆంక్షలు లేని భావప్రపంచపు కొత్తదారిని చూపుతోంది. ఓ స్నోడెన్ ఓ వెలుగు రేఖా… శాంతిని, స్వేచ్ఛను లోకానికి చాటిన బుద్ధుడు పుట్టిన నేల అనుకొని ఆశ్రయం కోరావా….? సిద్ధార్ధుడ్నే కాదు…ఆయన సిద్ధాంతాల్ని మేమెప్పుడో మర్చిపోయాం. మా కెవడైనా గుర్తుచేస్తే వాన్ని పక్క దేశాలకు…

స్నోడెన్: అమెరికాకు ఇండియా జో హుకుం

భారత పాలకులు తమ విధేయతను మరోసారి రుజువు చేసుకున్నారు. భారత దేశంలో రాజకీయ ఆశ్రయం ఇవ్వాలని కోరిన ఎడ్వర్డ్ స్నోడెన్ విన్నపాన్ని భారత ప్రభుత్వం తోసి పుచ్చింది. ఇంకా ఘోరం ఏమిటంటే అసలు అమెరికా చేస్తున్నది గూఢచర్యమే కాదట!? మేము అన్ని దేశాల ప్రజల సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సంభాషణలపై గూఢచర్యం చేస్తున్నమాట నిజమే అని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఒప్పుకున్నా భారత పాలకులకు అది నిజం కాదని నమ్మదలుచుకున్నారు. ఇంత దివాళాకోరు పాలకులు మనల్ని పాలిస్తున్నందుకు…

గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్

ఆ, అది చాలా సార్లు దగ్గరగా వచ్చింది లెండి! – బీహార్ గడ్డి కుంభకోణం అందరికీ తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో ఒక నిందితుడు. ఈ కేసు అంతిమ తీర్పే తరువాయి అన్న దశలో ఉంది. ఈ దశలో గడ్డి కుంభకోణం కేసును సి.బి.ఐ కోర్టు నుండి మరో కోర్టుకు మార్చాలంటూ ఆయన బీహార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేసు కొట్టేసింది. కేసును మార్చాలన్న ఆయన…

గోపీనాధ్ ముండేకి ఎన్నికల సంస్కరణలు కావాలిప్పుడు -కార్టూన్

గోపీనాధ్ ముండే! ఈయన 2009లో మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయిన బి.జె.పి నాయకుడు. లోక్ సభలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీకి ఈయన ఉపనాయకుడు కూడా. 2009 ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిన ముండే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను లోక్ సభ ఎన్నికలకు 8 కోట్లు ఖర్చు చేశానని అసలు నిజం వెళ్ళగక్కారు. ఈయన మర్చిపోయి నిజం మాట్లాడలేదు.…

బబూన్ ల గుంపే కాంగ్రెస్ -నిజం

బబూన్ అంటే తెలుగులో కొండముచ్చు అని అర్ధం. గండు కోతి, తిమ్మడు అని కూడా అంటారని అంతర్జాలంలో ఆంగ్ల పదాలకు తెలుగు తదితర భారతీయ భాషలకు అర్ధాలు ఇచ్చే శబ్ద కొష్ ద్వారా తెలుస్తోంది. ఈ గండు కోతులు పెద్ద సంఖ్యలో గుంపులుగా కూడితే దాన్నే కాంగ్రెస్ అంటారట! అమెరికా పార్లమెంటులో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of Representatives) ను కూడా కాంగ్రెస్ అంటారు. సభకు ఆ పేరు సరిగ్గా సరిపోయిందని ఈ…

ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…