హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్

హిందుత్వను ప్రభోదిస్తూ దాన్నుండి దూరంగా ఉన్నారన్న భ్రమల్ని ప్రజల్లో కలిగించడం అంటే మాటలు కాదు. అలాంటి బృహత్కార్యాన్ని విజవంతంగా నిర్వహించినవారిలో ప్రముఖులు అటల్ బిహారీ వాజ్ పేయ్. హిందూత్వలో మోడరేటర్ గా ముద్ర పొందుతూనే అవసరం వచ్చినప్పుడు కరడు గట్టిన హిందూత్వను ప్రదర్శించడం వాజ్ పేయి కి మించినవారు లేరు. తాను కరకు ఆర్.ఎస్.ఎస్ వాడినని చెబుతూనే సెక్యులరిస్టులకు, హిందూత్వ నుండి దూరంగా ఉండదలచినవారికీ ఆయన ఆమోద యోగ్యుడు కాగలిగారంటే అది వాజ్ పేయి చాతుర్యమే అని…

ఈగ. ఈగ.. ఈగ… యముడి మెరుపు తీగ! -కార్టూన్

ఈగ సినిమా చూశారు కదా! చిన్న ఈగను చంపబోయి ఒక పెద్ద విలను తానే కోరి చావును కొని తెచ్చుకుంటాడు. లేదా ఈగే తెలివిగా విలన్ ను చావు వైపుకి నడిపిస్తుంది. ఇప్పుడు బీహార్ లో నితీశ్ కుమార్ పరిస్ధితి కూడా అలాగే ఉంది చూడబోతే! బుద్ధ గయ పేలుళ్లు, మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు చనిపోవడం.. ఈ రెండు దుర్ఘటనల అనంతరం ఆసక్తికరమైన మౌనం పాటించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నట్టుండి…

బోస్టన్ బాంబర్ లొంగిపోయిన రక్తసిక్త క్షణాలు… -ఫోటోలు

గత ఏప్రిల్ నెలలో బోస్టన్ నగరంలో మారధాన్ పరుగు పందెం జరుగుతుండగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చెచెన్యా నుండి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు అన్నదమ్ములు ఈ పేలుళ్లకు బాధ్యులని అమెరికా ఆ తర్వాత తేల్చింది. పేలుళ్లు జరిగిన రోజే పెద్ద సోదరుడు తామర్లేన్ జర్నాయెవ్ ను ఎఫ్.బి.ఐ పోలీసులు కాల్చి చంపేశారు. రెండు రోజుల పాటు బోస్టన్ శివార్లలోని ఎం.ఐ.టి యూనివర్సిటీ సమీపంలో ఇల్లిల్లూ గాలించిన తర్వాత ఒక…

మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది. వాస్తవానికి ఈ…

సి.బి.ఐ కేసు కంచికి, ములాయం యు.పి.ఎ గూటికి

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్…

మోడీకి అమెరికా వీసా కావాలట!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అమెరికా వీసా కావాలి. ఈ మేరకు తాము అమెరికాను కోరనున్నట్లు బి.జె.పి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా తన మనసులో మాట వెలిబుచ్చారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ అక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం…

బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు, వీల్ చైర్ వ్యక్తి అరెస్టు

బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.…

తెలంగాణ ఖాయమేనట!

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది…

విషతుల్యమైన పళ్ళెం -ది హిందు సంపాదకీయం

బీహార్, శరణ్ జిల్లాలో కనీసం 22 మంది బడి పిల్లలకు ప్రాణాంతక పరిణామాలను రుచి చూపించిన రోజువారీ మధ్యాహ్న భోజనం భారత దేశంలోని విస్తార భాగాల్లో పాఠశాల విద్య ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదో వెల్లడి చేస్తోంది. ప్రభుత్వాలు ఒక పాఠశాల నిర్మాణానికి కాసింత చోటు చూపించలేకపోవడం, ఆహార పదార్ధాలు కలుషితం అయ్యే ప్రమాదానికి లోనుకాకుండా నిలవ చేయలేకపోవడం… ఈ అంశాలు సార్వత్రిక ప్రాధమిక విద్య పట్ల ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో పట్టిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించి,…

బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి

మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు…

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి -కార్టూన్

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం…

తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్

కాదన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలంగాణ ఉద్యమం అంటే ప్రజలు, వారి ఆకాంక్షలు, వారి అవసరాలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కాంగ్రెస్ దృష్టిలో 2014 ఎన్నికల్లో కురిసే ఓట్లు, సీట్లు మాత్రమే. ఆ మాటకొస్తే ఏ పార్టీకి మాత్రం కాదు? తెలంగాణ వాగ్దానం చేసిన బి.జె.పి కూడా 1999 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం సీట్ల కోసం దాన్ని పక్కన పెట్టింది. అవే సీట్ల కోసం రేపు తెలంగాణ ఇవ్వడానికి సోనియా…

గుజరాత్ హత్యాకాండ: నేను తప్పు చేయలేదు -మోడి

గుజరాత్ మారణకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి పరోక్షంగా సమర్ధించుకున్నారు. తాను ఏది సరైంది అనుకున్నానో అదే చేశానని నరేంద్ర మోడి రాయిటర్స్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధులు ఆయన మాటలకు దురుద్దేశాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ ఆ మాట నరేంద్ర మోడియే ఎందుకు చెప్పరో అర్ధం కాని విషయం. మోడి తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడం, దానికి అసలు అర్ధాలేవీటో ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు వివరణలకు పూనుకోవడం దేశాన్ని పాలించదలుచుకున్న వ్యక్తులకు,…

భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

గౌరవ మర్యాదలకు విఘాతం -ది హిందు సంపాదకీయం

(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్) “తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,”…